Political News

ప్రభుత్వం కంటే ఫాస్ట్ – బాధితులకు అండగా భువనేశ్వరి

ఈమధ్యనే గ్రేటర్ రాయలసీమ ప్రాంతమంతా భారీగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి.

అప్పట్లో భారీ వర్షాలకు, వరదల కారణంగా నష్టపోయిన బాధితుల దగ్గరకు భువనేశ్వరి సోమవారం వెళ్ళబోతున్నట్లు ఎన్టీయార్ ట్రస్టు వర్గాలు చెప్పాయి. బాధిత కుటుంబాలకు ఎన్టీయార్ మెమోరియల్ ట్రస్టు తరపున తలా లక్ష రూపాయలను భువనేశ్వరి అందించబోతున్నారట. మొత్తం 48 కుటుంబాలకు భువనేశ్వరి ఆర్ధికసాయం అందించబోతున్నారు. వర్షాలు, వరదల సమయంలోనే చంద్రబాబునాయుడు పర్యటించి ప్రతి కుటుంబానికి తలా రు.2 వేలిచ్చిన విషయం తెలిసిందే.

భువనేశ్వరిపై టీడీపీ వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆమధ్య ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎంఎల్ఏలు తన భార్య భువనేశ్వరిని అవమానించినట్లు చంద్రబాబు ఆవేదన చెంది అసెంబ్లీ నుంచి శాశ్వతంగా వాకౌట్ చేస్తూ సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతానని శపథం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో భోరున ఏడ్చారు. ఇది తెలుగుదేశం శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సాధారణ జనాల్లో కూడా వైసీపీ సభ్యుల తీరుపై ఏహ్యభావం వ్యక్తమైంది. ఆ తర్వాత ఎన్టీయార్ కుటుంబసభ్యులు కూడా భువనేశ్వరికి మద్దతుగా మీడియా సమావేశం పెట్టడం అందరికీ గుర్తుండే ఉంటుంది.

దీంతో అప్పట్లో భువనేశ్వరి వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్రమంతా పర్యటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో ప్రచారం ప్రచారంగానే మిగిలిపోయింది. అయితే ఆమెపై అనేక అవాకులు చెవాకులు పేలుతున్నా పట్టించుకోకుండా… ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఆమె సహాయ కార్యక్రమాలు చేపట్టారు. వరద బాధితులను కూడా కలిశారు. వారి బాధలు విన్నారు. తాజాగా వరదల వల్ల మరణించిన కుటుంబాలకు రూ.48 లక్షలు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పు సాయం అందిస్తున్నారు.

This post was last modified on December 20, 2021 11:01 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

10 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

11 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

12 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

13 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

13 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

14 hours ago