Political News

ప్రభుత్వం కంటే ఫాస్ట్ – బాధితులకు అండగా భువనేశ్వరి

ఈమధ్యనే గ్రేటర్ రాయలసీమ ప్రాంతమంతా భారీగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి.

అప్పట్లో భారీ వర్షాలకు, వరదల కారణంగా నష్టపోయిన బాధితుల దగ్గరకు భువనేశ్వరి సోమవారం వెళ్ళబోతున్నట్లు ఎన్టీయార్ ట్రస్టు వర్గాలు చెప్పాయి. బాధిత కుటుంబాలకు ఎన్టీయార్ మెమోరియల్ ట్రస్టు తరపున తలా లక్ష రూపాయలను భువనేశ్వరి అందించబోతున్నారట. మొత్తం 48 కుటుంబాలకు భువనేశ్వరి ఆర్ధికసాయం అందించబోతున్నారు. వర్షాలు, వరదల సమయంలోనే చంద్రబాబునాయుడు పర్యటించి ప్రతి కుటుంబానికి తలా రు.2 వేలిచ్చిన విషయం తెలిసిందే.

భువనేశ్వరిపై టీడీపీ వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆమధ్య ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎంఎల్ఏలు తన భార్య భువనేశ్వరిని అవమానించినట్లు చంద్రబాబు ఆవేదన చెంది అసెంబ్లీ నుంచి శాశ్వతంగా వాకౌట్ చేస్తూ సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతానని శపథం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో భోరున ఏడ్చారు. ఇది తెలుగుదేశం శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సాధారణ జనాల్లో కూడా వైసీపీ సభ్యుల తీరుపై ఏహ్యభావం వ్యక్తమైంది. ఆ తర్వాత ఎన్టీయార్ కుటుంబసభ్యులు కూడా భువనేశ్వరికి మద్దతుగా మీడియా సమావేశం పెట్టడం అందరికీ గుర్తుండే ఉంటుంది.

దీంతో అప్పట్లో భువనేశ్వరి వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్రమంతా పర్యటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో ప్రచారం ప్రచారంగానే మిగిలిపోయింది. అయితే ఆమెపై అనేక అవాకులు చెవాకులు పేలుతున్నా పట్టించుకోకుండా… ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఆమె సహాయ కార్యక్రమాలు చేపట్టారు. వరద బాధితులను కూడా కలిశారు. వారి బాధలు విన్నారు. తాజాగా వరదల వల్ల మరణించిన కుటుంబాలకు రూ.48 లక్షలు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పు సాయం అందిస్తున్నారు.

This post was last modified on December 20, 2021 11:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏఎంబీ… ఇక్కడ హిట్… అక్కడ ఫ్లాప్?

ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల…

5 minutes ago

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

2 hours ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

జనసైనికుల మనసు దోచుకున్న నారా లోకేష్

“మనకు అన్నీ బాగున్నప్పుడు అందరూ తోడుంటారు. కానీ కష్టకాలంలో అండగా నిలిచినవారే మనవారు. అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు”…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

3 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

4 hours ago