Political News

ఉద్యమ సెగతో మంటెక్కినట్లే ఉంది

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిస్థితి చూస్తుంటే ఈ విషయం బాగా అర్థమైపోతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఆందోళన మొదలుపెట్టినప్పుడు మోడీ అసలు లెక్కేచేయలేదు. ఆందోళన ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు పాకినపుడు కూడా మీరేమన్నా చేసుకోండి పట్టించుకునేదే లేదన్నట్లుగా వ్యవహరించారు. చివరకు ఆందోళన కాస్త రైతు సంఘాలంతా కలిసిపోయి ఉద్యమరూపం దాల్చినపుడు కూడా ఏమాత్రం లెక్క చేయలేదు.

చివరకు రైతు ఉద్యమం హింసాత్మకంగా మారినపుడు కూడా వెనక్కు తగ్గేదే లేదన్నారు. అలాంటి మోడీ హఠాత్తుగా ఎందుకని వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చట్టాలను రద్దు చేయటమే కాదు రైతాంగానికి క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే తాజాగా రైతు సంఘాల ప్రతి డిమాండ్ ను అంగీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

నిరసన కార్యక్రమాల్లో చనిపోయిన రైతుకుటుంబాలకు నష్టపరిహారం అందించేందుకు హర్యానా, యూపీ ప్రభుత్వాలు అంగీకరించాయి. పంటలకు కనీస మద్దతు ధరలను చట్టం రూపంలో తెచ్చేందుకు కూడా కేంద్రం అంగీకరించింది. దీనికి సంప్రదింపుల కోసం వేసిన కమిటిలో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులకు చోటు కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు బిగించే అంశంపై సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు సంబంధిత వర్గాలందరితోను చర్చించిన తర్వాతే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతామని కేంద్రం హామీ ఇచ్చింది.

ఇలా రైతు సంఘాల ప్రతి డిమాండ్ ను కేంద్రం అంగీకరించటంతోనే ఉద్యమ సెగ మోడీకి ఏ స్థాయిలో మంటపుట్టించిందో అర్థమైపోతోంది. రైతు సంఘాల డిమాండ్లకు మోడీ సాంతం అంగీకరించటానికి ప్రధాన కారణం రాబోయే అసెంబ్లీ ఎన్నికలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్యనే జరిగిన 29 అసెంబ్లీ, మూడు పార్లమెంటు ఉపఎన్నికల్లో బీజేపీకి పెద్ద దెబ్బ పడింది. ఇదే పరిస్థితి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కంటిన్యూ అయితే 2024 పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్న భయమే చివరకు మోడిని సాంతం దిగొచ్చేట్లు చేసింది. ప్రభుత్వాలపై  ఉద్యమ సెగ ఎలాగుండాలో రైతు సంఘాల ఉద్యమం చాటిచెప్పింది.

This post was last modified on December 10, 2021 3:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago