Political News

ఉద్యమ సెగతో మంటెక్కినట్లే ఉంది

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిస్థితి చూస్తుంటే ఈ విషయం బాగా అర్థమైపోతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఆందోళన మొదలుపెట్టినప్పుడు మోడీ అసలు లెక్కేచేయలేదు. ఆందోళన ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు పాకినపుడు కూడా మీరేమన్నా చేసుకోండి పట్టించుకునేదే లేదన్నట్లుగా వ్యవహరించారు. చివరకు ఆందోళన కాస్త రైతు సంఘాలంతా కలిసిపోయి ఉద్యమరూపం దాల్చినపుడు కూడా ఏమాత్రం లెక్క చేయలేదు.

చివరకు రైతు ఉద్యమం హింసాత్మకంగా మారినపుడు కూడా వెనక్కు తగ్గేదే లేదన్నారు. అలాంటి మోడీ హఠాత్తుగా ఎందుకని వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చట్టాలను రద్దు చేయటమే కాదు రైతాంగానికి క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే తాజాగా రైతు సంఘాల ప్రతి డిమాండ్ ను అంగీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

నిరసన కార్యక్రమాల్లో చనిపోయిన రైతుకుటుంబాలకు నష్టపరిహారం అందించేందుకు హర్యానా, యూపీ ప్రభుత్వాలు అంగీకరించాయి. పంటలకు కనీస మద్దతు ధరలను చట్టం రూపంలో తెచ్చేందుకు కూడా కేంద్రం అంగీకరించింది. దీనికి సంప్రదింపుల కోసం వేసిన కమిటిలో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులకు చోటు కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు బిగించే అంశంపై సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు సంబంధిత వర్గాలందరితోను చర్చించిన తర్వాతే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతామని కేంద్రం హామీ ఇచ్చింది.

ఇలా రైతు సంఘాల ప్రతి డిమాండ్ ను కేంద్రం అంగీకరించటంతోనే ఉద్యమ సెగ మోడీకి ఏ స్థాయిలో మంటపుట్టించిందో అర్థమైపోతోంది. రైతు సంఘాల డిమాండ్లకు మోడీ సాంతం అంగీకరించటానికి ప్రధాన కారణం రాబోయే అసెంబ్లీ ఎన్నికలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్యనే జరిగిన 29 అసెంబ్లీ, మూడు పార్లమెంటు ఉపఎన్నికల్లో బీజేపీకి పెద్ద దెబ్బ పడింది. ఇదే పరిస్థితి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కంటిన్యూ అయితే 2024 పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్న భయమే చివరకు మోడిని సాంతం దిగొచ్చేట్లు చేసింది. ప్రభుత్వాలపై  ఉద్యమ సెగ ఎలాగుండాలో రైతు సంఘాల ఉద్యమం చాటిచెప్పింది.

Satya

Recent Posts

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

8 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

9 hours ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

11 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

12 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

13 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

13 hours ago