Political News

బీజేపీ ఎంపీల‌కు మోడీ వార్నింగ్

ఇటీవ‌ల పార్ల‌మెంటు స‌మావేశాల్లో బీజేపీ ఎంపీల‌కు.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బిగ్ వార్నింగ్ ఇచ్చా రంటూ.. మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. పార్ల‌మెంటు స‌భ‌ల‌కు.. బీజేపీ త‌ర‌ఫున గెలిచిన ఎంపీలు హాజ‌రు కావ‌డం లేద‌ని.. ఇలా అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు కూడా ద‌క్క‌వ‌ని ఆయ‌న హెచ్చ‌రించిన‌ట్టు  ప్ర‌చారం జ‌రిగింది. నిజానికి బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. మోడీ ఇలాంటి హెచ్చ‌రి క‌లు చేయ‌డం ఇది రెండోసారి. గ‌త ఏడాది కూడా మోడీ ఇలానే ఎంపీల‌ను హెచ్చ‌రించారు. ఇప్పుడు తాజాగా మ‌రింత తీవ్రంగా హెచ్చ‌రించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. గ‌తానికి ఇప్ప‌టికి తేడా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో మూడు నూత‌న‌ వ్య‌వ‌సాయ చ‌ట్టాల విష‌యంలో కొన్ని ప్ర‌తిప‌క్షాలు.. ముఖ్యంగా పంజాబ్‌కు చెందిన వారు.. స‌భ‌లో ఆందోళ‌న చేశారు. ఈ క్ర‌మంలో వారి దూకుడుకు.. అధికార ప‌క్షం అడ్డుక‌ట్ట వేయ‌లేక పోయింది. ఈ క్ర‌మంలో స‌భ‌లోనూ బీజేపీ స‌భ్యులు త‌క్కువ‌గా హాజ‌ర‌య్యారు. బీజేపీ స‌భ్యుల బ‌లం ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. స‌భ‌లో స‌భ్యులు లేక‌పోవ‌డ‌తో ప్ర‌తిప‌క్షాన్ని నిలువ‌రించ‌డం క‌ష్ట సాధ్యంగా మారింది. దీంతో అప్ప‌ట్లోనే పార్ల‌మెంటు బీజేపీ స‌భ్యుల‌ను మోడీ హెచ్చ‌రించారు. అయితే.. ఇప్పుడు చేసిన తీవ్రంగా ఆయ‌న అప్ప‌ట్లో హెచ్చ‌రించ‌లేదు.

దీనికి కార‌ణం.. త‌మ స‌భ్యులు స‌భ‌లో లేక‌పోయినా.. ఇత‌ర పార్టీల స‌భ్యులు.. తెర‌చాటు మ‌ద్ద‌తిస్తున్న స‌భ్యులు  చాలా మంది మౌనంగా ఉండిపోవ‌డ‌మే కార‌ణం. అయితే.. ఇప్పుడు మాత్రం.. ఎవ‌రైతే.. త‌మ‌కు ఇంత‌కాలంగా మ‌ద్ద‌తుగా ఉన్నారో.. వారంతా .. ఇప్పుడు యాంటీ అయ్యారు. త‌మ త‌మ రాష్ట్రాల‌కు కేంద్రం అన్యాయం చేస్తోంద‌ని.. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. వారు గ‌ళం విప్పుతున్నారు. దీంతో మోడీ ప్ర‌భుత్వం స‌భ‌ల్లో ఇరుకున‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో చాలా విష‌యాల‌పై చ‌ర్చ‌లు కూడా చేప‌ట్ట‌డం లేదు. నిజానికి రైతు వ్య‌వ‌సాయ చ‌ట్టాల విష‌యంలో వైసీపీ, టీఆర్ ఎస్, స‌హా.. మ‌మ‌తా బెన‌ర్జీకి చెందిన తృణ‌మూల్ కాంగ్రెస్ కూడా ప‌రోక్షంగా మ‌ద్ద‌తిచ్చాయి.

దీంతో స‌భ‌లో బీజేపీ స‌భ్యుల సంఖ్య త‌గ్గినా.. మోడీపై పెద్ద‌గా ఎఫెక్ట్ ప‌డ‌లేదు. కానీ, ఇప్పుడు.. ఆయా పార్టీలే.. త‌మ త‌మ స‌మ‌స్య‌ల‌తోపాటు.. జాతీయ ప్రాధాన్యం ఉన్న స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళాల ప‌రిధి పెంపు, పెట్రో ధ‌ర‌ల త‌గ్గింపు.. ధాన్యం సేక‌ర‌ణ వంటి ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ.. కేంద్రాన్ని ఇరుకున పెడుతున్నాయి. దీంతో దీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ స‌భ్యులు స‌భ‌ల్లో ఉండ‌క‌పోవ‌డంతో.. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆందోళ‌న‌లు, వారు చేస్తున్న యాంటీ ప్ర‌చారం ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా చేరుతోంది.

దీనిని ప‌సిగ‌ట్టిన ప్ర‌ధాని.. త‌న స‌భ్యులు స‌భ‌ల్లో ఎక్కువ మంది ఉంటే.. ఇంత వ్య‌తిరేక‌త‌ను కూడా సునాయాశంగా ఎదుర్కొన‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎంపీల‌కు టికెట్ల భ‌యం పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. జాతీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రి మోడీ బెదిరింపుల‌ను ఎంత వ‌ర‌కు నేత‌లు అర్ధం చేసుకుంటారో.. లైన్‌లోకి వ‌స్తారో చూడాలి.  

This post was last modified on December 10, 2021 9:16 am

Share

Recent Posts

‘మ్యాడ్’ భామకు ప్యారడైజ్ ఛాన్స్ మిస్…

నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…

28 minutes ago

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గ్రేటే

టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…

1 hour ago

నాని సినిమా… సూపర్ స్ట్రాటజీ

యుఎస్‌లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…

7 hours ago

అవును… సోనియా పుస్త‌కం ప్ర‌చురించం!

కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్య‌క్షురాలు, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మక‌థ ..పుస్త‌కం ముద్రణ వ్య‌వ‌హారం వివాదంగా మారింది.…

8 hours ago

సెప్టెంబర్ బోణీ వారం… పోటీ రసవత్తరం

ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…

8 hours ago

మీ ఫిజిక‌ల్ హెల్ప్ వ‌ద్దు… డ‌బ్బుంటే ఇవ్వండి!

ఆక‌స్మిక ప్ర‌చండ వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన నేపాల్ తాజాగా ప్ర‌పంచ దేశాల‌ను ఉద్దేశించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ``భౌతికంగా మీరు మాకు…

9 hours ago