Political News

రేవంత్ ని హర్ట్ చేసిన ఢిల్లీ కాంగ్రెస్

ఇప్ప‌టికే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో దారుణ ఫ‌లితంతో ఢీలా ప‌డ్డ రాష్ట్ర కాంగ్రెస్‌కు ప్ర‌స్తుతం ఢిల్లీలో అధిష్ఠానం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఇబ్బందిక‌రంగా మారుతుంద‌నే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి. ఇక్క‌డ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పోరాటం చేస్తుంటే.. అటు ఢిల్లీలో టీఆర్ఎస్ మంత్రుల‌తో క‌లిసి కాంగ్రెస్ స‌మావేశం నిర్వ‌హించ‌డం రాష్ట్ర నేత‌ల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. దీనిపై జాతీయ నేత‌లు దృష్టి సారించాల‌ని రాష్ట్ర పార్టీ నాయ‌కులు కోరుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

బీజేపీపై ఫోక‌స్‌..

ఇప్ప‌టికే తెలంగాణ‌లో కేసీఆర్ త‌న‌కు ప్రధాన ప్ర‌త్య‌ర్థిగా బీజేపీని భావిస్తున్నారు. ఆ పార్టీ నాయ‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకునే ఆయ‌న విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ నాయ‌కులు ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌ర్వాత ఇక్క‌డ కాంగ్రెస్ ప‌రిస్థితి నానాటికీ దిగ‌జారింది.

కానీ తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్ నియామ‌కంతో తిరిగి రాష్ట్రంలో పార్టీ దూకుడు కొన‌సాగిస్తోంది. రేవంత్ పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ సాగుతున్నారు. కానీ ఇప్పుడు అటు జాతీయ స్థాయిలో అధిష్ఠానం వైఖ‌రి ఇప్పుడు రాష్ట్ర నాయ‌కుల‌కు ఇబ్బందిగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఆ స‌మావేశంతో..

పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అధికార బీజేపీపై విప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. ఆ ఆందోళ‌న‌లో టీఆర్ఎస్ కూడా జ‌త‌క‌లిసింది. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీల నేత‌లు క‌లిసి స‌మావేశంలో పాల్గొన్నాయి. దీన్ని రాష్ట్రంలోని బీజేపీ నాయ‌కులు హైలైట్ చేశారు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ ఒక‌టేన‌ని తెలంగాణ‌లో ఆ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయం తామేన‌ని చెప్పుకుంటున్నారు. ఇది ఇప్పుడు రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయ‌కుల‌కు ఇబ్బందిగా మారింది. ఒకవేళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేత‌ల ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టే నిర‌స‌న‌లు,స‌మావేశాల్లో టీఆర్ఎస్ పాల్గొంటే.. అది రాష్ట్ర స్థాయిలో త‌మ‌కు న‌ష్టం క‌లిగిస్తుంద‌ని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఇదే విష‌యాన్ని కాంగ్రెస్ పెద్ద‌ల‌కు కూడా చెప్పార‌ని తెలిసింది. అయితే బీజేపీ వ్య‌తిరేకంగా వ‌చ్చే పార్టీల‌ను జాతీయ స్థాయిలో క‌లుపుకుని పోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కాంగ్రెస్ పెద్ద‌లు బ‌దులిచ్చిన‌ట్లు స‌మాచారం. 

This post was last modified on December 8, 2021 5:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

36 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

43 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago