ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నికలో దారుణ ఫలితంతో ఢీలా పడ్డ రాష్ట్ర కాంగ్రెస్కు ప్రస్తుతం ఢిల్లీలో అధిష్ఠానం వ్యవహరిస్తున్న తీరు ఇబ్బందికరంగా మారుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోరాటం చేస్తుంటే.. అటు ఢిల్లీలో టీఆర్ఎస్ మంత్రులతో కలిసి కాంగ్రెస్ సమావేశం నిర్వహించడం రాష్ట్ర నేతలకు ఇబ్బందికరంగా మారింది. దీనిపై జాతీయ నేతలు దృష్టి సారించాలని రాష్ట్ర పార్టీ నాయకులు కోరుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
బీజేపీపై ఫోకస్..
ఇప్పటికే తెలంగాణలో కేసీఆర్ తనకు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీని భావిస్తున్నారు. ఆ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకునే ఆయన విమర్శలు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజారింది.
కానీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకంతో తిరిగి రాష్ట్రంలో పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. రేవంత్ పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు చేస్తూ సాగుతున్నారు. కానీ ఇప్పుడు అటు జాతీయ స్థాయిలో అధిష్ఠానం వైఖరి ఇప్పుడు రాష్ట్ర నాయకులకు ఇబ్బందిగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఆ సమావేశంతో..
పార్లమెంట్ సమావేశాల్లో అధికార బీజేపీపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆందోళనలు చేస్తున్నాయి. ఆ ఆందోళనలో టీఆర్ఎస్ కూడా జతకలిసింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నేతలు కలిసి సమావేశంలో పాల్గొన్నాయి. దీన్ని రాష్ట్రంలోని బీజేపీ నాయకులు హైలైట్ చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటేనని తెలంగాణలో ఆ పార్టీలకు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్నారు. ఇది ఇప్పుడు రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులకు ఇబ్బందిగా మారింది. ఒకవేళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో చేపట్టే నిరసనలు,సమావేశాల్లో టీఆర్ఎస్ పాల్గొంటే.. అది రాష్ట్ర స్థాయిలో తమకు నష్టం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు కూడా చెప్పారని తెలిసింది. అయితే బీజేపీ వ్యతిరేకంగా వచ్చే పార్టీలను జాతీయ స్థాయిలో కలుపుకుని పోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పెద్దలు బదులిచ్చినట్లు సమాచారం.
This post was last modified on December 8, 2021 5:52 pm
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…