Political News

రైతు ఉద్యమంపై కీలక నిర్ణయం ?

దాదాపు ఏడాదికి పైగా ఢిల్లీ శివార్లలో ఉద్యమం చేసి అనుకున్నది సాధించిన భారతీయ కిసాన్ యూనియన్ తన ఉద్యమానికి ముగింపు పలకబోతోందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏడాది కాలంగా చేసిన ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి రైతు సంఘాలకు గతంలోనే విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా రైతుసంఘాలకు విజ్ఞప్తి కూడా అందింది. 

ప్రధాన డిమాండ్ అయిన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయడం రైతు సంఘాలు సాధించిన అతిపెద్ద విజయమనే చెప్పాలి. ప్రస్తుతం పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయడం, ఉద్యమ సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయడం, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ను బర్తరఫ్ చేసి కేసులు పెట్టడం లాంటి అనేక డిమాండ్లున్నాయి. వీటిల్లో కనీస మద్దతు ధర చట్టం రూపకల్పనకు కేంద్రం ఓ కమిటిని కూడా నియమించింది. 

కేంద్రం చర్యలతో  రైతు సంఘాలు కూడా హ్యాపీగానే ఉన్నాయి. ఇదే విషయమై బుధవారం జరిగే సమావేశంలో ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టే విషయమై నిర్ణయం తీసుకుంటామని ఉద్యమానికి నేతృత్వం వహించిన రాకేష్ తికాయత్ ప్రకటించారు. ప్రధాన డిమాండ్ పరిష్కారమైపోవటం, మద్దతు ధర చట్టంపై కమిటీ వేయటానికి కేంద్రం రెడీ అయిపోవటంతో చాలామంది రైతులు తమ ఊర్లకు తిరిగి వెళ్ళటమే మేలనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. 

దాదాపు ఏడాదికిపైగా జరుగుతున్న ఉద్యమంలో రైతుసంఘాల లెక్కల ప్రకారం సుమారు 700 మంది చనిపోయారు. వీరిలో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొందరు చలిని తట్టుకోలేక మరణించారు. ఇంకొందరికి కరోనా వైరస్ సోకటంతో ఆసుపత్రుల్లో మరణించారు. అలాగే ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటన సందర్భంగా పోలీసు కాల్పుల్లో మరికొందరు చనిపోయారు. కాబట్టి చనిపోయిన రైతుకుటుంబాలకు కేంద్రం నష్టపరిహారం ఇవ్వాలని రైతుసంఘాలు డిమాండ్ చేస్తోంది.

This post was last modified on December 8, 2021 2:08 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

నారా రోహిత్ సినిమాకు ఇన్ని కష్టాలా

ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా…

6 mins ago

జ‌గ‌న్‌లో ఓట‌మి భ‌యానికిది సంకేత‌మా?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకో వార‌మే స‌మ‌యం ఉంది. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అటు ప్ర‌తిప‌క్ష…

7 hours ago

ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…

8 hours ago

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

11 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

14 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

15 hours ago