Political News

పార్లమెంటులో టీఆర్ఎస్ ఒంటరైందా ?

పార్లమెంటు శీతాకాల  సమావేశాలను బహిష్కరించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. పార్లమెంట్ ఈనెల 23వ తేదీన ముగుస్తున్న విషయం తెలిసిందే. బాయిల్డ్ రైస్ కొనాలని, పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలనే డిమాండ్లతో గడచిన వారంరోజులుగా పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్ఎస్ లోక్ సభ+రాజ్యసభ ఎంపీలు రకరకాలుగా ఆందోళనలు చేశారు. అయితే వీళ్ళ ఆందోళనలను, డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఇదే విషయమై మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ఆందోళనలను  కేంద్రం పట్టించుకోవడం లేదు కాబట్టే తాము పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాలని డిసైడ్ అయినట్లు రాజ్యసభ ఎంసీ కే కేశవరావు చెప్పారు. ఇక్కడే టీఆర్ఎస్ నిర్ణయం కరెక్టేనా అనే డౌటు పెరిగిపోతోంది. ఎందుకంటే తమ ఆందోళనను కేంద్రం పట్టించుకోకపోతే ఏకంగా పార్లమెంటు సమావేశాలనే బహిష్కరించటం సబబేనా ? పార్లమెంటు సమావేశాలను ఎంపీలు బహిష్కరించటం వల్ల ఎవరికి ఉపయోగం ? ఎవరికి నష్టం ?  

పార్లమెంటులో రాష్ట్రంలోని సమస్యలను వినిపించాల్సిన బాధ్యత ఎంపీలపైనే ఉంటుంది. అలాంటిది ఎంపీలే పార్లమెంటు సమావేశాలను బహిష్కరిస్తామంటే అర్ధమేంటి ? మిగిలిన పార్టీల ఎంపీలను కూడా మద్దతుతీసుకుని తమ వాణిని మరింత బలంగా వినిపించాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీపైనే ఉంది. కానీ జరిగింది చూస్తుంటే పార్లమెంటులో టీఆర్ఎస్ ఒంటరైందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. కేంద్రాన్ని నిలదీసే విషయంలో ఇతర పార్టీల ఎంపీల సహకారం తీసుకోవాలని స్వయంగా కేసీయార్ ఆదేశించారు.

ప్రతిపక్షాలతో టీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడారా ? మాట్లాడితే వాళ్ళేమన్నారు ? మద్దతు దొరకని కారణంగానే తమ ఆందోళనలను టీఆర్ఎస్ ఎంపీలు విరమించుకున్నారా ? అనే ప్రశ్నలకు ఎంపీలు లేదా కేసీయారే సమాధానం చెప్పాలి. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కేసీయార్ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అయితే బాయిల్డ్ రైస్ ను కొనేది లేదని  కేంద్రం ఎప్పుడో చెప్పేసింది.  ఈ విషయంలో మిగిలిన రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ఎంపీలు టీఆర్ఎస్ కు మద్దతుగా నిలబడినట్లు కనిపించటంలేదు.

పార్లమెంటులో ఎంతసేపు టీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే ఆందోళన చేస్తు కనిపించారు. అంటే ప్రతిపక్షాల్లో ఏ పార్టీ కూడా టీఆర్ఎస్ కు మద్దతుగా నిలవలేదని అర్ధమైపోతోంది. దాంతో ఇక లాభం లేదని అర్ధమైపోయే  తమ ఆందోళనను విరమించుకున్నారు. పనిలో పనిగా పార్లమెంటుకు హాజరై కామ్ గా కూర్చోలేరు కాబట్టి ఏకంగా పార్లమెంటు సమావేశాలనే బహిష్కరించాలని డిసైడ్ అయ్యారు. 

This post was last modified on December 8, 2021 12:49 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

8 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

9 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

12 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

12 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

13 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

13 hours ago