Political News

వామ్మో ఇదేం స్కీమ్ జగనన్న

వైసీపీ పాలనలో నిర్మాణ రంగం బాగా దెబ్బతిందని, కాంట్రాక్టర్లకు, బిల్లర్లకు బిల్లుల చెల్లింపు సకాలంలో జరగడం లేదని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే కొత్తగా ఏవైనా నిర్మాణాల కోసం ప్రభుత్వం టెండర్లకు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో బిల్డర్లు, కాంట్రాక్టర్లు, రియల్టర్లకు ఏపీ ప్రభుత్వం మరో షాకిచ్చింది.

ఇక నుంచి పట్టణ ప్రాంతాల్లో రాబోయే లేఅవుట్లలో 5శాతం స్థలాన్ని సదరు జిల్లా కలెక్టర్‌కు ఇవ్వాలని షాకింగ్ ఉత్తర్వులను జారీచేసింది. ఒకవేళ అలా ఇవ్వకుంటే…లేఅవుట్ కు 3 కిలోమీటర్ల పరిధిలో 5 శాతం భూమిని కొని ప్రభుత్వానికి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ రెండు ఆప్షన్లను వద్దనుకుంటే ఆ 5 శాతం స్థలం విలువకు సమానమైన మొత్తాన్ని కలెక్టర్ కు చెల్లించాలని మూడో ఆప్షన్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై రియల్టర్లు, బిల్డర్లు, లే అవుట్లు వేసేవారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మా డబ్బులతో మేము ప్రైవేటు ప్రాపర్టీలో వెంచర్ వేసుకుంటే ప్రభుత్వానికి స్థలం ఇవ్వడమేమిటని పలువురు రియల్టర్లు షాక్ అవుతున్నారు. ఇది కేవలం ఖజానా నింపుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న పని అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా దెబ్బకు, సకాలంలో బిల్లులు రాక తీవ్రంగా నష్ట పోయామని, ఇకపై లే అవుట్లు వేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు.

చాలా కాలం నుంచే లే అవుట్లో 10 శాతం స్థలాన్ని సామాజిక అవసరాలకు వదిలేయాలనే రూల్ ఉంది. తాజా ఉత్తర్వులతో అద 15 శాతానికి పెరిగింది. తాజా ఉత్తర్వుల ప్రకారం 5 ఎకరాల్లోపు లేఅవుట్లకు 47.50 శాతం, 5 ఎకరాల పైబడిన లేఅవుట్లకు 49 శాతం భూమిని అదనంగా బిల్డర్లు, రియల్టర్లు వదులుకోవాల్సి ఉంటుంది. అయితే, బిల్లర్లు, రియల్టర్లపై పడుతోన్న అదనపు భారం ఫ్లాట్లు కొనేవారిపైనే పడుతుందని అంటున్నారు. ఇకపై ఫ్లాట్లు కొనేవారికి తిప్పలు తప్పవని అనుకుంటున్నారు. లోటు బడ్జెట్ తో ఉన్న ఏపీ ఖజానాను భర్తీ చేసేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

This post was last modified on December 8, 2021 10:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

27 minutes ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

1 hour ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

2 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

3 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

4 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

4 hours ago