Political News

కేసీఆర్ తో మోడీ డీల్… అందుకే రేపు ఎంపీలు డుమ్మా – రేవంత్

టీఆర్‌ఎస్ ఎంపీలు ఉభయసభల్లో నాటకం ఆడుతున్నారని టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదని తప్పుబట్టారు.

కొన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన పేరుతో గాంధీ విగ్రహం వద్ద పదినిమిషాలు.. లోక్ సభలో పోడియం వద్ద పదిహేను నిమిషాలు చేస్తున్నారనే తప్ప… వీరి నిరసనలో నిజాయతీ లేదని విమర్శించారు. దున్నపోతు మీద వానపడితే తోకైనా ఆడిస్తాదని, అయితే రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతుకంటే హీనంగా ఉందని ధ్వజమెత్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ సెంట్రల్ హాల్ ప్రస్తావన తెచ్చారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ ను కాలేజీల్లో క్యాంటిన్ తో పొల్చారు. అలాంటి ప్రదేశంలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఫొటో దిగి తాము పార్లమెంట్ లో నిరసన తెలుపుతున్నామని తెలంగాణ సమాజాన్ని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ఎంపీలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వమే దోషి అని కేసీఆర్ భావిస్తే.. ఆయన ఎందుకు ఢిల్లీలో నిరసన తెలుపలేదని ప్రశ్నించారు. గతంలో మోదీ మెడలు వంచుతానని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. ప్రధానిని, ధాన్యం కొలుగోలుకు సంబంధించిన మంత్రిని ఎందుకు ఆయన నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు ఢిల్లీకి వెళ్లడం లేదు. ప్రగతిభవన్ లో పడుకున్నారా లేక ఫాం హౌస్ లో ఉన్నారా అని నిలదీశారు.

రాష్ట్రంలో 25 వేల మెట్రిన్ టన్నుల బియ్యం మాయమైతే కేంద్రం ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుంటే బీజేపీ ఎందుకు రాష్ట్రాన్ని కాపాడుతోందని నిలదీశారు.

పటి నుంచి టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన తెలుపరని, ఇప్పటికే అందరినీ హైదరాబాద కు రమ్మని కేసీఆర్ ఆదేశాలిచ్చారని తెలిపారు. ఎందుకంటే కేంద్రం నుంచి కేసీఆర్ కు ఆదేశాలు వెళ్లాయని చెప్పారు. కేంద్ర ఆదేశాల మేరకు రేపు టీఆర్‌ఎస్ ఎంపీలు హడావిడి చేసి లోక్ సభ, రాజ్యసభ నుంచి మాయమవుతున్నారని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రైతులు ఆగమవుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కుప్పలపై రైతులు గుండెలు ఆగి చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందు రాలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు.

This post was last modified on December 6, 2021 10:40 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

2 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

3 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

3 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

4 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

4 hours ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

5 hours ago