Political News

జగన్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసుల్లో సీఎం జగన్ విచారణ ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన జగన్ బెయిల్ పై బయట ఉన్నారని, సీఎం హోదాలో ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిని కోర్టు కొట్టవేసింది. ఇక, ప్రతి శుక్రవారం కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలన్న జగన్ పిటిషన్ విచారణ కూడా కోర్టులో చాలాకాలంగా పెండింగ్ లో ఉంది.

ఈ క్రమంలోనే తాజాగా నేడు జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సీఎం హోదాలో జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని, అందుకే ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని హైకోర్టును సీబీఐ తరఫు న్యాయవాదులు కోరారు. జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని వాదించారు. పదేళ్లయినా ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయని తెలిపారు.

హాజరు మినహాయింపు ఇస్తే విచారణలో మరింత జాప్యం జరుగుతుందని హైకోర్టుకు సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది సురేంద్ర తెలిపారు. గతంలో కూడా ఇదే తరహాలో జగన్ చేసిన ఇదే అభ్యర్థనను కోర్టులు తోసిపుచ్చాయని వెల్లడించారు. అయితే, సీఎం హాదాలో ఉన్న జగన్ బిజీగా ఉంటారని, కాబట్టి ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని జగన్ తరఫు న్యాయవాదులు కోరు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు…తీర్పును రిజర్వ్ చేసింది.

This post was last modified on December 6, 2021 6:28 pm

Share
Show comments

Recent Posts

ఏప్రిల్ 25 – విష్ణు VS మనోజ్ ?

వ్యక్తిగత జీవితంలో నువ్వా నేనా అంటూ వివాదాలు, గొడవల్లో ఉంటున్న మంచు సోదరులు విష్ణు, మనోజ్ బాక్సాఫీస్ వద్ద కూడా…

1 hour ago

కూలీ వేగం….నేర్చుకోవాల్సిన పాఠం

రజనీకాంత్ లాంటి పెద్ద సూపర్ స్టార్. టాలీవుడ్ సీనియర్ మోస్ట్ అగ్ర హీరో నాగార్జున ప్రత్యేక పాత్ర. కన్నడలోనే బిజీగా…

2 hours ago

రాజా సాబ్ కోసం తమన్ కొత్త ప్రయోగం

మాములుగా ఏదైనా పెద్ద సినిమాకు పాటల రికార్డింగ్ జరిగిపోయాక వాటిని ఎప్పుడు షూట్ చేస్తారు, ఎంత టైంలో విడుదలవుతుందనేది మ్యూజిక్…

3 hours ago

అసలు నాగ్‌పూర్‌లో ఏం జరుగుతోంది?

ఇటీవల విడుదలైన ఛావా సినిమాలో శంబాజి మహరాజ్ సీన్స్ చాలామందిని కదిలించాయి. ముఖ్యంగా ఔరంగజేబు క్యారెక్టర్ శంబాజిని అతి క్రూరంగా…

4 hours ago

పాక్ క్రికెట్.. ఒక్క దెబ్బతో ఆవిరైన 869 కోట్లు

పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటుండగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ మరింత కష్టాల్లోకి నెట్టేసింది. భారత్…

9 hours ago

ఖలిస్తానీ గ్రూప్‌పై రాజ్‌నాథ్ గురి.. అమెరికా ఎలా స్పందిస్తుందో?

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) పై కఠిన చర్యలు…

11 hours ago