ఏపీ ప్రభుత్వంపైనా.. సీఎం జగన్ నిర్ణయాలపైనా ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు భగ్గుమన్నారు. ఇదేం ప్రభుత్వం అంటూ.. ఆయన నిలదీశారు. జగనన్న ఓటీఎస్-ఉరితాడు పథకాన్ని తీసుకువచ్చారంటూ.. ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. ఇళ్లకు ఓటీఎస్.. పేదల మెడకు ఉరితాడుగా మారుతోందని చంద్రబాబు ఆరోపించారు. తప్పనిసరి కాదంటూనే ఓటీఎస్ కోసం ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. బలవంతంగా ఓటీఎస్ పేరుతో సొమ్ము వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతపు వసూళ్లను విమర్శిస్తే.. కేసులు పెడతారా? అని నిలదీశారు.
ఛీటింగ్ కేసులు.. 420 కేసులు ఈ ప్రభుత్వంపై పెట్టాలని దుయ్యబట్టారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇళ్లకు ఓటీఎస్ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా అని ప్రశ్నించారు. బలవంతంగా వసూలు చేస్తూ… స్వచ్ఛందమంటారా? అని చంద్రబాబు నిలదీశారు. ఇప్పుడున్న సీఎం భూమి, రుణం, నిర్మాణ ఖర్చు ఇచ్చారా..? ఎన్టీఆర్ కట్టించిన ఇళ్లకు ఇప్పుడు వసూలు చేస్తారా? ఇంటి రుణం మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పారు. ఇచ్చిన మాట తప్పారు.. మడమ తిప్పారు. ఇప్పటికే జగన్ బయట తిరగలేకపోతున్నారు.
వైద్యానికి దాచుకున్న సొమ్ము ఓటీఎస్ కోసం వసూలు చేస్తారా? అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్లు కూడా చట్టవిరుద్ధమే అని అభిప్రాయపడ్డారు. రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లే చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరుపడితే వాళ్లు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని తేల్చి చెప్పా రు. ఇష్టానుసారం చేస్తూ డాక్యుమెంట్లను వైసీపీ పతకాం రంగుల్లో ఇస్తారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ద్రోహిగాఈ ప్రభుత్వం మిగులుతుందని చంద్రబాబు దుయ్యబట్టారు.
“మాట తప్పడం.. మడమ తిప్పడం జగన్కు అలవాటైంది. కేసులు మాపై కాదు… మీపై ఛీటింగ్ కేసు పెట్టాలి. తప్పుడు కేసులు పెడితే భయపడతారు అనుకుంటున్నారా?. డబ్బులు కట్టకపోతే పథకాలు రద్దవుతాయని బెదిరిస్తారా?. ఆడబిడ్డలకు ఒక్క రూపాయి తీసుకోకుండా మేం రిజిస్ట్రేషన్ చేయించాం. తప్పులను ప్రశ్నించే హక్కు మాకు లేదా? చట్ట ఉల్లంఘన చేసే వ్యక్తులకు శిక్ష తప్పదు. తప్పుడు కేసులకు భయపడి పోరాటాలు ఆపేది లేదు.“ అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీ ఎస్ పథకంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. పలు వీడియోలను ప్రదర్శించి చూపారు.
This post was last modified on December 6, 2021 6:20 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…