ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి కూడా నెలకు దాదాపు వెయ్యి రూపాయల కరెంటు బిల్లు రావడంతో జనానికి షాక్ తగిలినట్లయింది. ఇలా హఠాత్తుగా కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ ఎందుకు కొడుతోందని అడిగితే…ట్రూ ఆప్ ఛార్జీలంటూ ఏపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో, తడిసి మోపెడవుతున్న కరెంటు బిల్లులు కట్టలేక…చేసేదేమీ లేక జనం నానా తిప్పలు పడ్డారు.
ఈ వ్యవహారంలో జగన్ సర్కార్ పై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తాజాగా విద్యుత్ వినియోగదారులకు ఏపీఈఆర్ సీ ఊరటనిచ్చింది. ట్రూఅప్ ఛార్జీల కింద సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వసూలు చేసిన మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది. నవంబర్లో వాడుకున్న విద్యుత్ కు సంబంధించి డిసెంబరులో ఇస్తున్న బిల్లులో ఆ చార్జీలను సర్దుబాటు చేస్తున్నారు. తాజాగా వినియోగదారులకు ఇస్తున్న విద్యుత్ బిల్లులలో ఈ విషయం వెల్లడైంది.
వాస్తవానికి, గత రెండు నెలలుగా కరెంటు బిల్లుల మోత మోగుతోందంటూ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. 2014–15 నుంచి 2018–19 మధ్యకాలానికి రూ.7,224 కోట్ల ట్రూ అప్ ఛార్జీల పిటిషన్లను విద్యుత్ సంస్థలు దాఖలు చేశారు. దీంతో, 2020 ఆగష్టు 27న రూ.3,669 కోట్ల ట్రూ అప్ ఛార్జీల వసూలుకు ఏపీఈఆర్సీ అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే ఏపీఎస్పీడీసీఎల్ రూ.3,060 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ రూ.609 కోట్ల మొత్తాన్ని 8 నెలల్లో వసూలు చేయాలని నిర్ణయించుకున్నాయి.
మొదటి రెండు నెలల్లో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్ బిల్లులలో ట్రూ ఆప్ చార్జీలను బిల్లులో వడ్డించారు. అయితే, ఈ వ్యవహారంపై న్యాయపరమైన చిక్కులు రావడంతో ఏపీఈఆర్సీ వెనక్కి తగ్గింది. ఈ క్రమంలోనే తాజాగా నవంబరు నెల బిల్లులో ట్రూఅప్ ఛార్జీలను కలపలేదు. అంతేకాదు, ఆ రెండు నెలలకు వసూలు చేసిన ట్రూ అప్ చార్జీలను కూడా నవంబర్ నెల బిల్లు నుంచి వెనక్కి చెల్లిస్తూ సర్దుబాటు చేస్తున్నారు. దీంతో, వినియోగదారులకు ఊరట లభించింది.
This post was last modified on December 6, 2021 1:28 pm
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…