ఏపీ ప్రభుత్వంపై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలిసారి చాలా తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ వర్గాల కథనం మేరకు.. ప్రధాని తొలిసారి ఇంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా సీఎం జగన్ చేస్తున్న పనులపై ప్రధాని సీరియస్గా ఉన్నారని వారు అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. జగన్ ప్రభుత్వానికి లేఖ సంధించారు. ప్రస్తుతానికి ఈ లేఖ గోప్యంగా ఉంచినప్పటికీ… ఢిల్లీ వర్గాలు మాత్రం బయట పెట్టాయి. విషయం ఏంటంటే.. ఏపీలో జగనన్న గోరుముద్ద, జగనన్న స్వచ్ఛ సంకల్పం, జగనన్న ఆసరా వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
అయితే.. ఆయా పథకాలు అన్నీ కూడా.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నవే. అంతేకాదు.. గోరుముద్ద పథకం.. పాఠశాలల చిన్నారులకు మధ్యాహ్నం అందించే భోజన పథకం. అయితే.. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం దీనికి 75 శాతం నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయి. దీనినే మిగిలిన రాష్ట్రాలు.. మధ్యాహ్న భోజన పథకంగా అమలు చేస్తున్నాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా దీనికి పేరు మార్చాలని ప్రయత్నించినప్పటికీ.. 75 శాతం కేంద్ర నిధులు ఉన్న ఏ పథకానికీ ఇలా పేరు మార్చుకునే అవకాశం లేనందున వెనక్కి తగ్గి గౌరవం కాపాడుకున్నారు. అదేవిధంగా.. స్వచ్ఛ సంకల్పం .. అనేది మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకం.
2014లో ప్రధానిగా మోడీ ప్రమాణం స్వీకారం చేసిన కొత్తలోనే ఈ పథకాన్ని తీసుకువచ్చారు. స్వచ్ఛ భారత్ పేరుతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే.. దీనికి కూడా జగన్ తన పేరును పెట్టుకున్నారు. ఇక, ఆసరా. ఇది కూడా కేంద్ర నిధులతో నడుస్తున్న పథకమే., అయినప్పటికీ.. జగన్ తనపేరు పెట్టుకున్నారు. ఆయా అంశాలపై వైసీపీ ఎంపీ.. రఘురామ రాజు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. అసలు ఏం చేస్తున్నారో.. చూడాలంటూ.. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం తెఎప్పించుకుని.. ఆయా పథకాల వివరాలు.. ఖర్చులను ఇటీవల లెక్క చూశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు పెట్టడాన్ని సీరియస్గా భావిస్తూ.. తాజాగా ఆమె ఏపీ సీఎంకు లేఖ సంధించారు. ఎందుకు పథకాల పేర్లు మార్చాల్సి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం కన్నా ఎక్కువ వాటా ఉందా? మీ ఉద్దేశంలో .. ఆ పథకాలను ఎవరు తీసుకువచ్చారని భావిస్తున్నారు? వంటి కీలక ప్రశ్నలను సంధించారు. దీనికి 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆమె ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించడం గమనార్హం.
This post was last modified on December 4, 2021 10:44 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…