Political News

మోడీ నుంచి ఏపీకి ఘాటు లేఖ.. ఏం జ‌రిగింది?

ఏపీ ప్ర‌భుత్వంపై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం తొలిసారి చాలా తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. ప్ర‌ధాని తొలిసారి ఇంత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ చేస్తున్న ప‌నులపై ప్ర‌ధాని సీరియ‌స్‌గా ఉన్నార‌ని వారు అంటున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి లేఖ సంధించారు. ప్ర‌స్తుతానికి ఈ లేఖ గోప్యంగా ఉంచిన‌ప్ప‌టికీ… ఢిల్లీ వ‌ర్గాలు మాత్రం బ‌య‌ట పెట్టాయి. విష‌యం ఏంటంటే.. ఏపీలో జ‌గ‌న‌న్న గోరుముద్ద‌, జ‌గ‌న‌న్న స్వ‌చ్ఛ సంక‌ల్పం, జ‌గ‌న‌న్న ఆస‌రా వంటి కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు.

అయితే.. ఆయా ప‌థ‌కాలు అన్నీ కూడా.. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న‌వే. అంతేకాదు.. గోరుముద్ద ప‌థ‌కం.. పాఠ‌శాల‌ల చిన్నారుల‌కు మ‌ధ్యాహ్నం అందించే భోజ‌న ప‌థ‌కం. అయితే.. ఇది పూర్తిగా కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కం దీనికి 75 శాతం నిధులు కేంద్రం నుంచే వ‌స్తున్నాయి. దీనినే మిగిలిన రాష్ట్రాలు.. మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కంగా అమ‌లు చేస్తున్నాయి. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా దీనికి పేరు మార్చాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. 75 శాతం కేంద్ర‌ నిధులు ఉన్న ఏ ప‌థ‌కానికీ ఇలా పేరు మార్చుకునే అవ‌కాశం లేనందున వెన‌క్కి త‌గ్గి గౌర‌వం కాపాడుకున్నారు. అదేవిధంగా.. స్వ‌చ్ఛ సంక‌ల్పం .. అనేది మోడీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కం.

2014లో ప్ర‌ధానిగా మోడీ ప్ర‌మాణం స్వీకారం చేసిన కొత్త‌లోనే ఈ ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చారు. స్వ‌చ్ఛ భార‌త్ పేరుతో కేంద్రం ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. అయితే.. దీనికి కూడా జ‌గ‌న్ త‌న పేరును పెట్టుకున్నారు. ఇక‌, ఆస‌రా. ఇది కూడా కేంద్ర నిధుల‌తో న‌డుస్తున్న ప‌థ‌క‌మే., అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ త‌న‌పేరు పెట్టుకున్నారు. ఆయా అంశాల‌పై వైసీపీ ఎంపీ.. ర‌ఘురామ రాజు ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ రాశారు. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న కేంద్రం.. అసలు ఏం చేస్తున్నారో.. చూడాలంటూ.. కేంద్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని ఆదేశించింది.

ఈ నేప‌థ్యంలో ఆమె రాష్ట్ర ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి స‌మాచారం తెఎప్పించుకుని.. ఆయా ప‌థ‌కాల వివ‌రాలు.. ఖర్చుల‌ను ఇటీవ‌ల లెక్క చూశారు. ఈ క్ర‌మంలో కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం పేరు పెట్ట‌డాన్ని సీరియ‌స్‌గా భావిస్తూ.. తాజాగా ఆమె ఏపీ సీఎంకు లేఖ సంధించారు. ఎందుకు ప‌థ‌కాల పేర్లు మార్చాల్సి వ‌చ్చింది? కేంద్ర ప్ర‌భుత్వం క‌న్నా ఎక్కువ వాటా ఉందా? మీ ఉద్దేశంలో .. ఆ ప‌థ‌కాల‌ను ఎవరు తీసుకువ‌చ్చార‌ని భావిస్తున్నారు? వంటి కీల‌క ప్ర‌శ్న‌ల‌ను సంధించారు. దీనికి 15 రోజుల్లోగా స‌మాధానం చెప్పాల‌ని ఆమె ఏపీ ప్ర‌భుత్వాన్ని ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 4, 2021 10:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

19 ఏళ్ల త‌ర్వాత‌.. అయేషా అంత్య‌క్రియ‌లు.. ఏం జరిగింది?

అయేషా మీరా. ఉమ్మ‌డి ఏపీలో 2007లో ఓ వ్య‌క్తి కామ దాహానికి బ‌లి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…

2 hours ago

ప్రభాస్ మాట సాయం… కపుల్ నడకలో వేగం

గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…

2 hours ago

ఆహా… కనులవిందుగా కమల్ & రజిని

గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…

2 hours ago

ట్రంప్ నకు సుప్రీం షాక్.. భారత్ కు లాభమా? నష్టమా?

అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…

2 hours ago

వరలక్ష్మి రిస్కు ఫలితమిస్తే మంచిదే

చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…

3 hours ago

‘అన్ని శాఖలు రేవంత్ తీసుకుంటే ఎలా?’

చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…

3 hours ago