Categories: Political News

క‌న్నీటితో భువ‌నేశ్వ‌రి పాదాలు క‌డుగుతాం

ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి.. భువ‌నేశ్వ‌రి అనుమ‌తిస్తే.. ఆమె పాదాల‌ను త‌మ క‌న్నీటితో క‌డుగుతామంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించారు. భువనేశ్వరిని తమ పార్టీ ఎమ్మెల్యేలు కించపరచలేదన్న ఆయన.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను మాత్రం తప్పుబట్టారు.

శాసనసభలో భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కంచపరిచేలా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. గౌరవసభ పేరుతో చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరిని అవమానిస్తున్నారని విమర్శించారు.”చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు అసభ్యవ్యాఖ్యలు చేశారనటం సరికాదు. చంద్రబాబు గౌరవ సభల పేరిట ఆమెకు తీరని అవమానం చేస్తున్నారు. మనస్ఫూర్తిగా చెబుతున్నాం. ఆమెను ఎవరూ కించపరచలేదు.

ఆమెను ఎవరో టీడీపీ ఎమ్మెల్యే అన్నందుకు చితిస్తున్నాం. వల్లభనేని వంశీ మా పార్టీ ఎమ్మెల్యే కాకపోయినా.. సహచర ఎమ్మెల్యేలుగా ఆయన వ్యాఖ్యలను తప్పపడుతున్నాం. ఆ తల్లి అనుమతిస్తే.. మా పార్టీ ఎమ్మెల్యేలందరం మా కన్నీటితో ఆమె పాదాలు కుడుగుతాం“ అని రాచ‌మ‌ల్లు వ్యాఖ్యానించారు.. అంతేకాదు.. సీఎం జ‌గ‌న్ త‌ల్లి, వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ అంటే త‌మ‌కు ప్రాణ‌మ‌ని.. ఎంతో ఎనలేని గౌర‌వ‌మ‌ని పేర్కొన్న రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి.. అంతే గౌర‌వం.. త‌మ‌కు చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిపై ఉంద‌ని చెప్పారు.

అంతేకాదు.. త‌మ ప్ర‌భుత్వం మ‌హిళా ప‌క్ష‌పాత ప్ర‌భుత్వ‌మ‌ని చెప్పారు. మ‌హిళ‌ల‌కుఅన్ని రంగాల్లోనూ విశేష అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని చ‌ప్పారు. అలాంటి ప్ర‌భుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న త‌మ‌కు మ‌హిళ‌ల‌ను ఎలా గౌర‌వించాలో తెలుసున‌ని చెప్పారు. తాము కానీ.. త‌మ పార్టీ ఎమ్మెల్యేలు కానీ.. భువ‌నేశ్వ‌రి అమ్మ‌ను ఎలా కించ‌ప‌రుస్తామ‌ని అనుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. మొత్తానికి రాచ‌మ‌ల్లు వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీశాయి.

This post was last modified on December 17, 2021 7:47 am

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

55 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago