క‌న్నీటితో భువ‌నేశ్వ‌రి పాదాలు క‌డుగుతాం

ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి.. భువ‌నేశ్వ‌రి అనుమ‌తిస్తే.. ఆమె పాదాల‌ను త‌మ క‌న్నీటితో క‌డుగుతామంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించారు. భువనేశ్వరిని తమ పార్టీ ఎమ్మెల్యేలు కించపరచలేదన్న ఆయన.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను మాత్రం తప్పుబట్టారు.

శాసనసభలో భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కంచపరిచేలా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. గౌరవసభ పేరుతో చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరిని అవమానిస్తున్నారని విమర్శించారు.”చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు అసభ్యవ్యాఖ్యలు చేశారనటం సరికాదు. చంద్రబాబు గౌరవ సభల పేరిట ఆమెకు తీరని అవమానం చేస్తున్నారు. మనస్ఫూర్తిగా చెబుతున్నాం. ఆమెను ఎవరూ కించపరచలేదు.

ఆమెను ఎవరో టీడీపీ ఎమ్మెల్యే అన్నందుకు చితిస్తున్నాం. వల్లభనేని వంశీ మా పార్టీ ఎమ్మెల్యే కాకపోయినా.. సహచర ఎమ్మెల్యేలుగా ఆయన వ్యాఖ్యలను తప్పపడుతున్నాం. ఆ తల్లి అనుమతిస్తే.. మా పార్టీ ఎమ్మెల్యేలందరం మా కన్నీటితో ఆమె పాదాలు కుడుగుతాం“ అని రాచ‌మ‌ల్లు వ్యాఖ్యానించారు.. అంతేకాదు.. సీఎం జ‌గ‌న్ త‌ల్లి, వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ అంటే త‌మ‌కు ప్రాణ‌మ‌ని.. ఎంతో ఎనలేని గౌర‌వ‌మ‌ని పేర్కొన్న రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి.. అంతే గౌర‌వం.. త‌మ‌కు చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిపై ఉంద‌ని చెప్పారు.

అంతేకాదు.. త‌మ ప్ర‌భుత్వం మ‌హిళా ప‌క్ష‌పాత ప్ర‌భుత్వ‌మ‌ని చెప్పారు. మ‌హిళ‌ల‌కుఅన్ని రంగాల్లోనూ విశేష అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని చ‌ప్పారు. అలాంటి ప్ర‌భుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న త‌మ‌కు మ‌హిళ‌ల‌ను ఎలా గౌర‌వించాలో తెలుసున‌ని చెప్పారు. తాము కానీ.. త‌మ పార్టీ ఎమ్మెల్యేలు కానీ.. భువ‌నేశ్వ‌రి అమ్మ‌ను ఎలా కించ‌ప‌రుస్తామ‌ని అనుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. మొత్తానికి రాచ‌మ‌ల్లు వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీశాయి.

This post was last modified on December 17, 2021 7:47 am

Share
Show comments
Published by
Satya
Tags: TDP

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

15 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

45 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago