Political News

ఓటీఎస్…రూ.4800 కోట్లకు జగన్ స్కెచ్ వేశారంటోన్న టీడీపీ నేత

ఏపీలో ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 1983-2011 మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వ హౌసింగ్‌ కార్పొరేషన్ ద్వారా ఇళ్లు నిర్మించుకొని బకాయి ఉన్నవారిని ప్రబుత్వం గుర్తించింది. వారంతా వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) ద్వారా ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. కానీ, తమ ఇళ్లకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ పట్టాలున్నాయని, మరోసారి రిజిస్ట్రేషన్ అవసరం లేదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ పథకంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకంతో పేదలను జగన్ మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేదల ఇళ్లను వారికే రిజిస్ట్రేషన్ చేసిచ్చే హక్కు ప్రభుత్వానికి లేదని అన్నారు. అంతేకాదు, ఈ పథకం కింద 46 లక్షల మంది పేదల నుంచి రూ. 4,800 కోట్లు రాబట్టేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని ఆయన ఆరోపించారు. ఓటీఎస్ పేరుతో పేదలను ప్రభుత్వం ఒత్తిడికి గురి చేస్తోందని ఆరోపించారు.

కొన్ని చోట్ల వలంటీర్లు బెదిరింపులకు దిగుతున్నారని, డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేసుకుంటామని, ఓటీఎస్ చేయని వారి ఇంట్లో పెన్షన్లను నిలిపివేస్తామని నోటీసులిస్తున్నారని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో జగన్ కు ఈ 46 లక్షల పేద కుటుంబాలు ఉద్వాసన పలుకుతాయని జోస్యం చెప్పారు. మాట తప్పితే ప్రాణం తీయాలని అసెంబ్లీ జగన్ అన్నారని, కానీ, ఇపుడు మాట తప్పుతున్నారని గుర్తు చేశారు. ఓటీఎస్ పేరుతో పేదలకు నోటీసులివ్వడాన్ని టీడీపీ ఖండిస్తోందని చెప్పారు.

కాగా, ఓటీఎస్ సెటిల్మెంట్ నేపథ్యంలో వలంటీరుకు ఓ వృద్ధుడు వేసిన ప్రశ్న తాలూకు వీడియో వైరల్ అయింది. ఆల్రెడీ పట్టా ఉన్న ఇంటికి మళ్లీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నా పెళ్లాన్ని మళ్లీ నాకే ఇచ్చి పెళ్లి చేస్తామన్నట్టు’ ప్రభుత్వ తీరు ఉందని ఆయన సెటైర్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

This post was last modified on December 1, 2021 3:19 pm

Share
Show comments
Published by
news Content

Recent Posts

కూటమి మేనిఫెస్టో విడుదల.. తొలి సంతకం ఆ ఫైలుపైనే

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా…

11 mins ago

అన్న‌ను కార్న‌ర్ చేసిన ష‌ర్మిల‌.. జ‌గ‌న్ చుట్టూ చిక్కులు!

ఒక్కొక్క‌సారి కొన్నికొన్ని విష‌యాల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే మంచిది. అలా ప‌ట్టించుకుంటే.. మ‌న‌కేదో మేలు జ‌రుగుతుంద‌ని అనుకుంటే.. అదే పెద్ద త‌ప్పిదం అయి…

18 mins ago

సెన్సేషనల్ సినిమా కాపీ కొట్టి తీశారా

మార్చిలో పెద్దగా అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలై మంచి విజయం నమోదు చేసుకున్న బాలీవుడ్ మూవీ 'లాపతా లేడీస్'…

23 mins ago

పవన్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటా

ఏదైనా మాట్లాడితే.. లాజిక్ ఉండాలి. ముఖ్యంగా పాత‌త‌రానికి చెందిన నాయ‌కులు.. ఒక కులాన్ని ప్ర‌భావితం చేస్తార‌ని భావించే నాయ‌కులు ముఖ్యంగా…

32 mins ago

దర్శకుల ఉత్సవంలో ఊహించని మెరుపులు

మే 4 దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని డైరెక్టర్స్ డేని చాలా ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ దిగ్గజాలందరూ…

1 hour ago

వారికి గాజు గ్లాసు గుర్తు ఎలా కేటాయిస్తారు?:  హైకోర్టు సీరియ‌స్‌

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రంలో చిత్ర‌మైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ప్ర‌దాన పార్టీ జ‌న‌సేన‌కు కేటాయించిన గాజు గ్లాసు…

2 hours ago