Political News

సింగర్ హరిణి ఫ్యామిలీ మిస్సింగ్.. రైల్వే ట్రాక్ మీద తండ్రి డెడ్ బాడీ

షాకింగ్ ఉదంతం బయటకు వచ్చింది. ప్రముఖ ప్లేబాక్ సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద రీతిలో మరణించారు. హైదరాబాద్ నివాసి అయిన ఆయన.. వారం నుంచి కనిపించకుండా పోయారు. తాజాగా ఆయన డెడ్ బాడీ బెంగళూరు రైల్వే ట్రాక్ మీద పోలీసులు గురించారు. ఏకే రావు కుటుంబ సభ్యుల ఫోన్లు పని చేయటం లేదని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీకి చెందిన వారి ఫ్యామిలీ మెంబర్లు వారం రోజులుగా కనిపించటం లేదు.

నిజానికి వారం నుంచి సింగర్ హరిణి కుటుంబం మొత్తం మిస్ అయినప్పటికీ ఆ సమాచారం బయటకు రాలేదు.కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన సందర్భంలోనే.. ఆయన డెడ్ బాడీ అక్కడెక్కడో బెంగళూరులో కనిపించటం.. అది కూడా రైల్వే ట్రాక్ మీద అనుమానాస్పద రీతిలో ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకు కనిపించకుండా పోయిన ఏకే రావు కుటుంబం బెంగళూరు వెళ్లారా? లేదంటే.. ఎవరైనా అక్కడకు తీసుకెళ్లారా? అన్నది మిస్టరీగా మారింది.

షాకింగ్ అంశం ఏమంటే.. అనుమానాస్పద రీతిలో మరణించిన ఏకే రావు.. ప్రముఖ రాజకీయ నాయకుడు.. రాజ్యసభ సభ్యుడైన సుజనా చౌదరికి చెందిన సుజనా ఫౌండేషన్ కు సీఈవోగా పని చేస్తుంటారు. తెలుగు.. తమిళ.. కన్నడ.. మలయాళం.. హిందీ సినిమాలకు సంబంధించి ఎన్నో పాటలు పాడిన సింగర్ హరిణి మంచి గుర్తింపు పొందారు. దాదాపు 3500కు పైగా పాటలుపాడారు.

మురారి.. గుండుబా శంకర్.. నేను మీకు తెలుసా.. ఘర్షణ.. సైనికుడు.. 100% లవ్.. లెజెండ్.. స్పైడర్.. నిశ్శబద్దం లాంటి పలు సినిమాలకు ఆమె పాటలు పాడారు. 42 ఏళ్ల హరిణికి పెళ్లై.. భర్త ఉన్నారు. సింగర్ గా మాత్రమే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఆమె సుపరిచితురాలు. క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఇదిలా ఉంటే.. ఏకే రావు మరణాన్ని అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కనిపించకుండా పోయిన ఏకే రావు కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఏకే రావు.. సుజనా ఫౌండేషన్ సీఈవోగా మాత్రమే కాదు.. సుజనా గ్రూప్స్ లీగల్ అడ్వైజర్ గా కూడా పని చేస్తున్నారు. ఇప్పుడీ ఉదంతం షాకింగ్ గా మారింది.

This post was last modified on November 25, 2021 1:46 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

6 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

7 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

10 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

10 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

11 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

11 hours ago