Political News

షా ఎఫెక్ట్.. కేంద్రం వ్యూహం మారుతుందా…?

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై మ‌న‌సు మార్చుకుంటుందా? ఇప్పటి వ‌ర‌కు ఉన్న విదానానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుందా? అంటే.. విశ్లేష‌కులు.. ఒకింత ఔన‌నే అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం.. ఏపీ రాజ‌ధాని విష‌యంలో ఒక స్ప‌ష్ట‌మైన వైఖ‌రిని తీసుకుంది. త‌మ‌కు సంబంధం లేద‌ని.. అదంతా కూడా రాష్ట్ర‌ప‌రిధిలోదేన‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పింది. అయితే.. దీనికి ఒక కార‌ణం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలోని పెద్ద‌లు ఎవ‌రూ.. ప్ర‌త్య‌క్షంగా రాజ‌ధాని వివాదం చూడ‌లేదు. పైగా.. రాష్ట్ర బీజేపీ నేత‌లు కూడా ఎవ‌రూ పెద్ద‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.

ఒక‌వేళ వివ‌రించినా.. ఉద్య‌మం తొలిరోజుల్లో మాత్ర‌మే కొంద‌రు వెళ్లి.. క‌లిసి వ‌చ్చారు. ఆ త‌ర్వాత‌.. ఎంతో తీవ్రంగా ఉద్య‌మం సాగినా.. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌జ‌లు నిలిచిన సంద‌ర్భాల్లోనూ ఎవ‌రూ కేంద్రంలోని బీజేపీ దృష్టికి తీసుకువెళ్ల‌లేదు.

అయితే.. ఇటీవ‌ల రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌.. కేంద్రంలోని అగ్ర‌నాయ‌కుడు అమిత్‌షాకు.. బీజేపీలోని ఒక సామాజిక వ‌ర్గం నాయ‌కులు.. ఈ విష‌యాన్ని ఆయ‌న‌కు వివ‌రించారు. “సార్ ఇది ఓటు బ్యాంకుతో కూడుకున్న వ్య‌వ‌హారం. మ‌న వాళ్లు లైట్ తీసుకుంటున్నారు. మీరు ఒక‌సారి ఆలోచించండి. ఇక్క‌డ మ‌నం మ‌ద్ద‌తు ఇస్తే.. పార్టీ పుంజుకుంటుంది” అని చెప్పార‌ట‌.

ఇదేస‌మ‌యంలో రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌. ఇంత‌కు ముందు.. జ‌రిగిన ఉద్య‌మం దీక్ష‌లు వంటివాటి వీడియోలు, ఫొటోల‌ను కూడా ఆయ‌న‌కు చూపించార‌ట‌. వీటిని చూసిన షా.. వెంట‌నే అవాక్క‌యి.. ఇంత జ‌రుగుతుంటే మీరేం చేస్తున్నారంటూ.. రాష్ట్ర పార్టీ నేత‌ల‌కు హిత‌బోధ చేయ‌డంతోపాటు.. వెంట‌నే వారిని పాద‌యాత్ర‌లో పాల్గొనాలని సూచించారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు కేంద్రంలో నెంబ‌ర్ 2గా ఉన్న అమిత్ షాపై రైతుల్లో ఆశ‌లు పెరిగాయి. ఆయ‌న త‌లుచుకుంటే.. ఇప్పుడు ఇక్క‌డ జ‌రుగుతున్న ఉద్య‌మం విష‌యాన్ని ప్ర‌ధానికి వివ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌గ‌ల‌ర‌ని అనుకుంటున్నారు.

ఇదే జ‌రిగితే.. త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని.. కూడా విశ్వసిస్తున్నారు. ఇంకా ఈవిష‌యం కోర్టులో ఉన్న నేప‌థ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని అమ‌రావ‌తినే రాజ‌ధానిగా గుర్తించామ‌ని కానీ.. లేదా.. తాజాగా జ‌రుగుతున్న హైకోర్టు విష‌యంలో కానీ.. ప‌ట్టుద‌ల‌గా వ్య‌వ‌హ‌రిస్తే.. త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో రైతులు.. త్వ‌ర‌లోనే అమిత్ షాను క‌లిసే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు.. అమ‌రావ‌తి వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిని బ‌ట్టి రాజ‌కీయ ప్ర‌యోజ‌నం దృష్ట్యా అయినా.. బీజేపీ త‌న మాట మార్చుకుంటుంద‌ని అంటున్నారు.

This post was last modified on November 21, 2021 8:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

2 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

2 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

3 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

3 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

4 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

5 hours ago