ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి మండిపడ్డారు. జగన్ సర్కార్ విధానాలను ఎప్పటికప్పుడు పవన్ తూర్పారపడుతున్నారు. ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా? అంటూ విరుచుకపడ్డారు. రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తుంటే ఇసుక అమ్ముతానని ప్రభుత్వం ప్రకటించడం పవన్ ను ఆగ్రహానికి గురిచేసింది.
వరదల భీభత్సం రాష్ట్రాన్ని కుదిపేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు-వాకిళ్లు, పశు నష్టం – పంట నష్టం జరిగిందని తెలిపారు. పచ్చటి- పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే.. ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం ‘ఇసుక అమ్ముతాం’ అన్న ప్రకటనలు ఇస్తున్నారని మండిపడ్డారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా? అని పవన్ ప్రశ్నించారు.
కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలో వరదలు, భారీ వర్షాలతో ప్రజా జీవితం కడగండ్ల పాలైందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా నిలిచి సాయం అందిచాల్సిన ప్రభుత్వాన్ని కోరారు. కష్టకాలంలో ప్రభుత్వం ప్రజల కోసం ప్రభుత్వం నిడబడిందనే భావన కూడా ప్రజల్లో కల్పించలేకపోతోందని తప్పుబట్టారు. జనసేన ఆధ్వర్యంలో రెండు విడుతలుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తామని పవన్ ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగేవరకు అండగా ఉంటామని తెలిపారు.
“ప్రకృతి విపత్తులు చాలా ఇబ్బందికరమైనవి. విపత్తులను ఆపలేం.. కానీ స్పందించే తీరు మాత్రం ప్రభావవంతంగా ఉండాలి. దురదృష్టం ఏమిటంటే ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువయింది. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. తిత్లీ తుఫాను వల్ల శ్రీకాకుళం జిల్లాలో 10 లక్షల మంది ప్రజలు రోడ్డున పడితే.. నాడు పక్క జిల్లా విజయనగరంలో పాదయాత్ర చేస్తున్న అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్ కన్నెత్తి కూడా చూడలేదు. ఇది వారి ఆలోచన విధానాన్ని తెలియజేస్తోంది” జనసేన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
ఒక్కసారిగా విరుచుకుపడిన వరదల్లో గల్లంతైన వారు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉండాలని పవన్ ఆకాంక్షించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా పవన్ కోరుకున్నారు. రాయలసీమ ప్రాంతలో 100 ఏళ్లల్లో రికార్డు కానంత వరద ప్రవాహం వచ్చిందని తెలిపారు. ఆస్తి నష్టం, పశు నష్టం, విలువైన వస్తువులు, వాహనాలు నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించలేకపోతున్నామని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
This post was last modified on November 21, 2021 7:15 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…