Political News

చంద్రబాబు అస్త్రాన్ని రెడీ చేసుకున్నారా ?

ఇపుడిదే ప్రశ్న తెలుగుదేశంపార్టీ, తెలుగుమీడియాతో పాటు మామూలు జనాల్లో కూడా విస్తృతంగా వినిపిస్తోంది. ఈ ప్రశ్న ఇపుడు ఎందుకు వినిపిస్తోంది ? ఎందుకంటే ఇదే ప్రశ్నను చంద్రబాబే వచ్చే ఎన్నికల్లో జనాలను అడగాలని అనుకున్నారు కాబట్టి. చంద్రబాబు మాటల్లోనే ‘మీకు నా అవసరం ఉందనుకుంటే నన్ను గెలిపించుకోండి..లేకపోతే మీ ఇష్టం’ అని జనాలను డైరెక్టుగా అడగబోతున్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ తాజా వ్యాఖ్యలు విన్న తర్వాత రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నికల నినాదం ఏమిటో అర్ధమైపోతోంది.

రెండు రోజుల క్రితం తన భార్యను అసెంబ్లీలో వైసీపీ సభ్యులు అవమానించారని ఆరోపించిన చంద్రబాబు ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో భోరున ఏడ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. తన భార్యతో పాటు కుటుంబసభ్యులను కించపరచటం ద్వారా అందరినీ రోడ్డున పడేశారంటు చంద్రబాబు బాధపడ్డారు. చంద్రబాబుకు మద్దతుగా ఇతర పార్టీల నేతలు, నందమూరి బాలకృష్ణతో పాటు ఎన్టీయార్ కుటుంబసభ్యులందరు అసెంబ్లీలో ఘటనను తప్పు పడుతున్నారు.

మాధవరెడ్డి పేరును అంబటి ఎత్తగానే చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయి తన భార్యను కించపరుస్తారా అంటు రెచ్చిపోయారు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే చంద్రబాబుకు వైసీపీలోనూ సైలెంట్ గా మద్దతుగా కొందరు నిలబడితే మరికొందరు బహిరంగంగా తప్పుపడుతున్నారు. ప్రజల్లో అయితే అసెంబ్లీ సంఘటన నేపథ్యంలో చంద్రబాబుపై సానుభూతి చూపుతున్నట్లే సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో కనిపిస్తోంది.

ఈ నేపధ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జనాలను డైరెక్టుగా ఒకమాట అడగబోతున్నట్లు చంద్రబాబు చెప్పారు. తన అవసరం ఉందనుకుంటే మద్దుతివ్వాలని అడగబోతున్నారు. అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే జనాలపైకి చంద్రబాబు సెంటిమెంటు అస్త్రాన్ని సంధించబోతున్నారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు ఎదుర్కోలేకపోతున్నారని మంత్రులంటున్నారు. అసెంబ్లీలో మెజారిటి ఉండటం, కౌన్సిల్లో కూడా తమకే ఫుల్లు మెజారిటి వచ్చిన సమయంలోనే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవటంతో చంద్రబాబు మానసికంగా దెబ్బతిన్నారని మంత్రులంటున్నారు. అందుకనే ఏమో సెంటిమెంటు అస్త్రాన్ని రెడీ చేసుకున్నారు.

ఈ వయసులో పనికిమాలిన వారితో అందరితో మాటలు పడటం అవసరమా? ఎన్నికల్లో గెలిస్తే ఏపీలో అభివృద్ధి చేసి చరిత్రలో నిలచిపోదాం అని, లేదంటే ప్రశాంతంగా రిటైరవుదాం… అభివృద్ధిపై ఫోకస్ పెట్టే తనను వచ్చే ఎన్నికల్లో కూడా జనమే అవసరం లేదనుకుంటే మనకెందుకు తాపత్రయం ప్రశాంతంగా రిటైరవుదాం… వారు కోరుకుంటే చరిత్రలో నిలిచిపోయేలా ఏపీని మారుస్తాను అని సీనియర్ నేతలతో ఆంతరంగికంగా చంద్రబాబు చర్చించినట్లు సమాచారం.

This post was last modified on November 21, 2021 11:11 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

6 mins ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

1 hour ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

2 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

3 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

3 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

4 hours ago