Political News

సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తా…చంద్రబాబు షాకింగ్ నిర్ణయం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే, రెండో రోజు సభ సందర్భంగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై వ్య‌క్తిగ‌త విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మ‌ళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ సభలోకి అడుగుడతానంటూ చంద్రబాబు స‌భ‌నుంచి తీవ్ర భావోద్వేగంతో వెళ్లిపోయారు.

గత రెండున్నరేళ్లుగా ఎన్నో అవమానాలు భరించానని, కానీ, ఈ రోజు త‌న‌పై, త‌న కుటుంబంపై కూడా వైసీపీ సభ్యులు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేశారని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన భార్య, తన కుటుంబంపై నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం బాధించింని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను అవమానించి, తన కుటుంబ సభ్యులను రోడ్డుపైకి లాగారని ఉద్వేగానికి లోనయ్యారు.

అయితే, చంద్రబాబు మాట్లాడుతుండగానే స్పీకర్ తమ్మినేని సీతారాం మైక్‌ కట్‌ చేయడంతో చంద్రబాబు మరింత ఆవేదనకు లోనయ్యారు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. చంద్రబాబుతోపాటు టీడీపీ సభ్యులు కూడా వెళ్లారు. ఈ సందర్భంలో జగన్ తో పాటు వైసీపీ సభ్యులు అవహేళనగా నవ్వుతూ ఉన్నారు.

మరోవైపు, బ‌య‌ట‌కు వ‌చ్చిన తర్వాత చంద్ర‌బాబు త‌న ఛాంబ‌ర్లో అత్య‌వ‌స‌రంగా టీడీఎల్పీ స‌మావేశం నిర్వ‌హించారు. టీడీపీ సభ్యులు, ఎమ్మెల్సీలు లోకేష్‌, య‌న‌మ‌ల స‌హా ఇత‌ర ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. స‌భ‌లో వైసీపీ స‌భ్యుల తీరు, విమర్శలు వ్యవహారంపై వారంతా చ‌ర్చించారు. వైసీపీ స‌భ్యులు శృతిమించి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అందరూ అభిప్రాయ‌ప‌డ్డారు. కుటుంబం, మ‌హిళ‌ల వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రిచేలా వైసీపీ స‌భ్యులు కామెంట్లు చేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మరి కాసేపట్లో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

This post was last modified on November 19, 2021 1:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

2 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

5 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

6 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

7 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

7 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

7 hours ago