Political News

మోడీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. మూడు సాగు చ‌ట్టాలు ర‌ద్దు!

దేశంలో రైతే రాజు.. అన్న నినాదం మ‌రోసారి నిజ‌మైంది. గ‌డిచిన 9 మాసాలుగా.. దేశ‌వ్యాప్తంగా ఉద్య‌మిస్తు న్న రైతుల‌కు విజ‌యం ద‌క్కింది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన మూడు సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా.. రైతులు ఉద్య‌మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. తాము ఎట్టి ప‌రిస్థితిలోనూ.. ఈ సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకునేది లేద‌ని.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారునిన్న‌టి వ‌ర‌కు చెప్పింది. అంతేకాదు.. ఈ విష‌యంలో రాజ‌కీయంగా కూడా రాజీ ప‌డ‌లేదు. చాలా మంది నాయ‌కులు పార్టీకి రిజైన్ చేశారు. పంజాబ్‌లోని.. మిత్ర ప‌క్షం కూడా బీజేపీకి వ్య‌తిరేకంగా మారిపోయింది. కౌర్ త‌న మంత్రి ప‌ద‌వికి కూడా రిజైన్ చేశారు.

ఇక‌, దేశ వ్యాప్తంగా.. రైతాంగం.. ఉద్య‌మించారు. ముఖ్యంగా పంజాబ్ సరిహ‌ద్దుల్లోని సిక్రీలో ఇప్ప‌టికీ.. రైతు లు ఉద్య‌మిస్తున్నారు. తికాయ‌త్ వంటి కీల‌క నేత‌లు గ‌ళం వినిపించారు. రాష్ట్రాలు కూడా బంద్ పాటించాయి. దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వ‌య్యాయి. పార్ల‌మెంటు కూడా ద‌ద్ద‌రిల్లింది.

అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌ధాని మోడీ కానీ.. కేంద్ర మంత్రులు కానీ.. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై వెన‌క్కి త‌గ్గేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై రాజ్య‌స‌భ అయితే.. వ‌రుసగా వాయిదా ప‌డ‌డంతోపాటు.. స‌భ‌లో జ‌రుగుతున్న గంద‌ర‌గోళంపై ఉప‌రాష్ట్ర‌ప‌తి స‌భ చైర్మ‌న్ వెంక‌య్య ఏకంగా క‌న్నీరు పెట్టుకున్నారు.

ఇక‌, రైతుల‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అనేక రూపాల్లో నిర్బంధాలు విధించారు. అయిన‌ప్ప‌టికీ.. రైతులు వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఉద్య‌మిస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా రైతుల‌కు అండ‌గా ఉంటామ‌ని.. ప్ర‌క‌టించారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కేంద్రంలోని మోడీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

గురునాన‌క్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాని .. రైతు చ‌ట్టాల‌ను పూర్తిగా ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో దేశంలో రైతే రాజు.. అని మ‌రో సారి నిరూపిత‌మైన‌ట్టు.. నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

This post was last modified on November 19, 2021 10:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

1 hour ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

2 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

4 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

6 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

7 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

7 hours ago