Political News

క‌మ్మ‌ల‌ను బాబుకు దూరం చేద్దాం.. బీజేపీ వ్యూహం!

ఏ పార్టీకైనా పుంజుకునేందుకు కొన్ని ఆయుధాలు ఉండాలి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న వారు.. అధికార పార్టీలోని లోపాల‌ను వెతుకుతారు. వాటిని ఆధారంగా చేసుకుని.. ప్ర‌జ‌ల్లోకి వెళ్తారు. త‌మ త‌మ పార్టీల‌ను బ‌లోపేతం చేసుకుంటారు. అయితే.. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ వ్యూహం మ‌రో మార్గంలో ప‌య‌నిస్తోందని తెలుస్తోంది. తాజాగా ఏపీలో ప‌ర్య‌టించిన కేంద్ర బీజేపీ అగ్ర‌నాయ‌కుడు.. అమిత్ షా.. రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌కు కొన్ని సూచ‌న‌లు చేశారు. వీటిలో ప్ర‌ధానంగా.. బీజేపీని.. సామాజిక వ‌ర్గాల వారీగా.. అభివృద్ధి చేయాలని..! అంతేకాదు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి వెన్నుద‌న్నుగా ఉన్న కీల‌క‌మైన‌.. క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని బీజేపీకి చేరువ చేయాల‌ని కూడా షా దిశానిర్దేశం కూడా చేసిన‌ట్టు తెలిసింది.

చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో ఎందుకు ఓడిపోయార‌నే విష‌యం ఈ సంద‌ర్భంగా అమిత్ షా దృష్టికి వ‌చ్చింది. దీనిపై ఆయ‌న ఒక సుదీర్ఘ ప్ర‌సంగమే చేశారు. తాజాగా రాష్ట్ర నేత‌ల‌తో భేటీ అయిన‌.. షా.. “చంద్ర‌బాబుకు క‌మ్మ సామాజిక వ‌ర్గం అండ ఉంద‌ని అంటున్నారు. అయితే.. ఆ వ‌ర్గ‌మే అండ ఉంటే.. ఆయ‌న ఎందుకు ఓడిపోయారు? అంటే.. ఆ వ‌ర్గంలోనూ చంద్ర‌బాబును వ్య‌తిరేకించే నాయ‌కులు ఉన్నారు. అదేవిధంగా ప్ర‌జ‌ల్లోనూ ఉన్నారు. సో.. ఇప్పుడు వారిని మ‌నం చేర‌దీద్దాం. వారికి ఏం కావాలో ఏం కోరుకుంటున్నారో.. చూడండి. నాకు త్వ‌ర‌లోనే నివేదిక ఇవ్వండి. అంతా నేను చూసుకుంటాను” అని షా తేల్చి చెప్పిన‌ట్టు బీజేపీ వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ న‌డుస్తోంది.

అంతేకాదు.. క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని చేర‌దీసే బాధ్య‌త‌ను పురందేశ్వ‌రి స‌హా.. కొంద‌రు క‌మ్మ నాయ‌కుల‌కు అమిత్ షా అప్ప‌గించార‌ని స‌మాచారం. అదే స‌మ‌యంలో క‌మ్మ వ‌ర్గాన్ని ఆక‌ర్షించేందుకు అనుస‌రించా ల్సిన వ్యూహాన్ని కూడా సిద్ధం చేయాల‌ని.. త‌ద్వారా.. ప్ర‌తిప‌క్షం ఓటు బ్యాంకును స‌గం వ‌ర‌కు మ‌నం లాగేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని.. కూడా షా అభిప్రాయ‌ప‌డ్డార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే పురందేశ్వ‌రి పార్టీలో జాతీయ స్థాయిలో కీల‌కంగా ఉన్నారు. అదే క‌మ్మ వ‌ర్గానికి చెందిన వెంక‌య్య నాయుడుకు ఏకంగా ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వి ఇచ్చారు. ఇక కంభ‌పాటి హ‌రిబాబుకు మిజోరం గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇచ్చారు. ఇవ‌న్నీ కూడా ఆ వ‌ర్గంలోకి బ‌లంగా తీసుకు వెళ్లాల‌ని కూడా షా ఆదేశాలు జారీ చేశార‌ట‌. అదే స‌మ‌యంలో నాయ‌కులు స‌ఖ్య‌త‌తో ఉండి పార్టీ కోసం ప‌నిచేయాల‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ నిత్యం యాక్టివ్‌గా ఉండాల‌ని.. సొంత వ్యాపారాల‌ను ప‌క్క‌న పెట్టి.. పార్టీ ప‌టిష్ట‌త‌పై దృష్టి పెట్టాల‌ని.. కూడా సూచించార‌ట‌. వ‌చ్చే రెండేళ్లు ఒక ప‌రీక్షా కాలంగా నాయ‌కులు భావించాల‌ని కూడా షా దిశానిర్దేశం చేసిన‌ట్టు బీజేపీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 17, 2021 9:41 am

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

3 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

5 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

5 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

5 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

7 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

10 hours ago