Political News

క‌మ్మ‌ల‌ను బాబుకు దూరం చేద్దాం.. బీజేపీ వ్యూహం!

ఏ పార్టీకైనా పుంజుకునేందుకు కొన్ని ఆయుధాలు ఉండాలి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న వారు.. అధికార పార్టీలోని లోపాల‌ను వెతుకుతారు. వాటిని ఆధారంగా చేసుకుని.. ప్ర‌జ‌ల్లోకి వెళ్తారు. త‌మ త‌మ పార్టీల‌ను బ‌లోపేతం చేసుకుంటారు. అయితే.. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ వ్యూహం మ‌రో మార్గంలో ప‌య‌నిస్తోందని తెలుస్తోంది. తాజాగా ఏపీలో ప‌ర్య‌టించిన కేంద్ర బీజేపీ అగ్ర‌నాయ‌కుడు.. అమిత్ షా.. రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌కు కొన్ని సూచ‌న‌లు చేశారు. వీటిలో ప్ర‌ధానంగా.. బీజేపీని.. సామాజిక వ‌ర్గాల వారీగా.. అభివృద్ధి చేయాలని..! అంతేకాదు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి వెన్నుద‌న్నుగా ఉన్న కీల‌క‌మైన‌.. క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని బీజేపీకి చేరువ చేయాల‌ని కూడా షా దిశానిర్దేశం కూడా చేసిన‌ట్టు తెలిసింది.

చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో ఎందుకు ఓడిపోయార‌నే విష‌యం ఈ సంద‌ర్భంగా అమిత్ షా దృష్టికి వ‌చ్చింది. దీనిపై ఆయ‌న ఒక సుదీర్ఘ ప్ర‌సంగమే చేశారు. తాజాగా రాష్ట్ర నేత‌ల‌తో భేటీ అయిన‌.. షా.. “చంద్ర‌బాబుకు క‌మ్మ సామాజిక వ‌ర్గం అండ ఉంద‌ని అంటున్నారు. అయితే.. ఆ వ‌ర్గ‌మే అండ ఉంటే.. ఆయ‌న ఎందుకు ఓడిపోయారు? అంటే.. ఆ వ‌ర్గంలోనూ చంద్ర‌బాబును వ్య‌తిరేకించే నాయ‌కులు ఉన్నారు. అదేవిధంగా ప్ర‌జ‌ల్లోనూ ఉన్నారు. సో.. ఇప్పుడు వారిని మ‌నం చేర‌దీద్దాం. వారికి ఏం కావాలో ఏం కోరుకుంటున్నారో.. చూడండి. నాకు త్వ‌ర‌లోనే నివేదిక ఇవ్వండి. అంతా నేను చూసుకుంటాను” అని షా తేల్చి చెప్పిన‌ట్టు బీజేపీ వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ న‌డుస్తోంది.

అంతేకాదు.. క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని చేర‌దీసే బాధ్య‌త‌ను పురందేశ్వ‌రి స‌హా.. కొంద‌రు క‌మ్మ నాయ‌కుల‌కు అమిత్ షా అప్ప‌గించార‌ని స‌మాచారం. అదే స‌మ‌యంలో క‌మ్మ వ‌ర్గాన్ని ఆక‌ర్షించేందుకు అనుస‌రించా ల్సిన వ్యూహాన్ని కూడా సిద్ధం చేయాల‌ని.. త‌ద్వారా.. ప్ర‌తిప‌క్షం ఓటు బ్యాంకును స‌గం వ‌ర‌కు మ‌నం లాగేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని.. కూడా షా అభిప్రాయ‌ప‌డ్డార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే పురందేశ్వ‌రి పార్టీలో జాతీయ స్థాయిలో కీల‌కంగా ఉన్నారు. అదే క‌మ్మ వ‌ర్గానికి చెందిన వెంక‌య్య నాయుడుకు ఏకంగా ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వి ఇచ్చారు. ఇక కంభ‌పాటి హ‌రిబాబుకు మిజోరం గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇచ్చారు. ఇవ‌న్నీ కూడా ఆ వ‌ర్గంలోకి బ‌లంగా తీసుకు వెళ్లాల‌ని కూడా షా ఆదేశాలు జారీ చేశార‌ట‌. అదే స‌మ‌యంలో నాయ‌కులు స‌ఖ్య‌త‌తో ఉండి పార్టీ కోసం ప‌నిచేయాల‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ నిత్యం యాక్టివ్‌గా ఉండాల‌ని.. సొంత వ్యాపారాల‌ను ప‌క్క‌న పెట్టి.. పార్టీ ప‌టిష్ట‌త‌పై దృష్టి పెట్టాల‌ని.. కూడా సూచించార‌ట‌. వ‌చ్చే రెండేళ్లు ఒక ప‌రీక్షా కాలంగా నాయ‌కులు భావించాల‌ని కూడా షా దిశానిర్దేశం చేసిన‌ట్టు బీజేపీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 17, 2021 9:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

1 hour ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

4 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago