ఏ పార్టీకైనా పుంజుకునేందుకు కొన్ని ఆయుధాలు ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్న వారు.. అధికార పార్టీలోని లోపాలను వెతుకుతారు. వాటిని ఆధారంగా చేసుకుని.. ప్రజల్లోకి వెళ్తారు. తమ తమ పార్టీలను బలోపేతం చేసుకుంటారు. అయితే.. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ వ్యూహం మరో మార్గంలో పయనిస్తోందని తెలుస్తోంది. తాజాగా ఏపీలో పర్యటించిన కేంద్ర బీజేపీ అగ్రనాయకుడు.. అమిత్ షా.. రాష్ట్ర బీజేపీ నాయకులకు కొన్ని సూచనలు చేశారు. వీటిలో ప్రధానంగా.. బీజేపీని.. సామాజిక వర్గాల వారీగా.. అభివృద్ధి చేయాలని..! అంతేకాదు.. ప్రధాన ప్రతిపక్షానికి వెన్నుదన్నుగా ఉన్న కీలకమైన.. కమ్మ సామాజిక వర్గాన్ని బీజేపీకి చేరువ చేయాలని కూడా షా దిశానిర్దేశం కూడా చేసినట్టు తెలిసింది.
చంద్రబాబు గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారనే విషయం ఈ సందర్భంగా అమిత్ షా దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన ఒక సుదీర్ఘ ప్రసంగమే చేశారు. తాజాగా రాష్ట్ర నేతలతో భేటీ అయిన.. షా.. “చంద్రబాబుకు కమ్మ సామాజిక వర్గం అండ ఉందని అంటున్నారు. అయితే.. ఆ వర్గమే అండ ఉంటే.. ఆయన ఎందుకు ఓడిపోయారు? అంటే.. ఆ వర్గంలోనూ చంద్రబాబును వ్యతిరేకించే నాయకులు ఉన్నారు. అదేవిధంగా ప్రజల్లోనూ ఉన్నారు. సో.. ఇప్పుడు వారిని మనం చేరదీద్దాం. వారికి ఏం కావాలో ఏం కోరుకుంటున్నారో.. చూడండి. నాకు త్వరలోనే నివేదిక ఇవ్వండి. అంతా నేను చూసుకుంటాను” అని షా తేల్చి చెప్పినట్టు బీజేపీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది.
అంతేకాదు.. కమ్మ సామాజిక వర్గాన్ని చేరదీసే బాధ్యతను పురందేశ్వరి సహా.. కొందరు కమ్మ నాయకులకు అమిత్ షా అప్పగించారని సమాచారం. అదే సమయంలో కమ్మ వర్గాన్ని ఆకర్షించేందుకు అనుసరించా ల్సిన వ్యూహాన్ని కూడా సిద్ధం చేయాలని.. తద్వారా.. ప్రతిపక్షం ఓటు బ్యాంకును సగం వరకు మనం లాగేసేందుకు అవకాశం ఉంటుందని.. కూడా షా అభిప్రాయపడ్డారని చర్చ జరుగుతోంది.
ఇప్పటికే పురందేశ్వరి పార్టీలో జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్నారు. అదే కమ్మ వర్గానికి చెందిన వెంకయ్య నాయుడుకు ఏకంగా ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చారు. ఇక కంభపాటి హరిబాబుకు మిజోరం గవర్నర్ పదవి ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆ వర్గంలోకి బలంగా తీసుకు వెళ్లాలని కూడా షా ఆదేశాలు జారీ చేశారట. అదే సమయంలో నాయకులు సఖ్యతతో ఉండి పార్టీ కోసం పనిచేయాలని.. ప్రతి ఒక్కరూ నిత్యం యాక్టివ్గా ఉండాలని.. సొంత వ్యాపారాలను పక్కన పెట్టి.. పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలని.. కూడా సూచించారట. వచ్చే రెండేళ్లు ఒక పరీక్షా కాలంగా నాయకులు భావించాలని కూడా షా దిశానిర్దేశం చేసినట్టు బీజేపీలో చర్చ సాగుతుండడం గమనార్హం.
This post was last modified on November 17, 2021 9:41 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…