ఏ పార్టీకైనా పుంజుకునేందుకు కొన్ని ఆయుధాలు ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్న వారు.. అధికార పార్టీలోని లోపాలను వెతుకుతారు. వాటిని ఆధారంగా చేసుకుని.. ప్రజల్లోకి వెళ్తారు. తమ తమ పార్టీలను బలోపేతం చేసుకుంటారు. అయితే.. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ వ్యూహం మరో మార్గంలో పయనిస్తోందని తెలుస్తోంది. తాజాగా ఏపీలో పర్యటించిన కేంద్ర బీజేపీ అగ్రనాయకుడు.. అమిత్ షా.. రాష్ట్ర బీజేపీ నాయకులకు కొన్ని సూచనలు చేశారు. వీటిలో ప్రధానంగా.. బీజేపీని.. సామాజిక వర్గాల వారీగా.. అభివృద్ధి చేయాలని..! అంతేకాదు.. ప్రధాన ప్రతిపక్షానికి వెన్నుదన్నుగా ఉన్న కీలకమైన.. కమ్మ సామాజిక వర్గాన్ని బీజేపీకి చేరువ చేయాలని కూడా షా దిశానిర్దేశం కూడా చేసినట్టు తెలిసింది.
చంద్రబాబు గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారనే విషయం ఈ సందర్భంగా అమిత్ షా దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన ఒక సుదీర్ఘ ప్రసంగమే చేశారు. తాజాగా రాష్ట్ర నేతలతో భేటీ అయిన.. షా.. “చంద్రబాబుకు కమ్మ సామాజిక వర్గం అండ ఉందని అంటున్నారు. అయితే.. ఆ వర్గమే అండ ఉంటే.. ఆయన ఎందుకు ఓడిపోయారు? అంటే.. ఆ వర్గంలోనూ చంద్రబాబును వ్యతిరేకించే నాయకులు ఉన్నారు. అదేవిధంగా ప్రజల్లోనూ ఉన్నారు. సో.. ఇప్పుడు వారిని మనం చేరదీద్దాం. వారికి ఏం కావాలో ఏం కోరుకుంటున్నారో.. చూడండి. నాకు త్వరలోనే నివేదిక ఇవ్వండి. అంతా నేను చూసుకుంటాను” అని షా తేల్చి చెప్పినట్టు బీజేపీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది.
అంతేకాదు.. కమ్మ సామాజిక వర్గాన్ని చేరదీసే బాధ్యతను పురందేశ్వరి సహా.. కొందరు కమ్మ నాయకులకు అమిత్ షా అప్పగించారని సమాచారం. అదే సమయంలో కమ్మ వర్గాన్ని ఆకర్షించేందుకు అనుసరించా ల్సిన వ్యూహాన్ని కూడా సిద్ధం చేయాలని.. తద్వారా.. ప్రతిపక్షం ఓటు బ్యాంకును సగం వరకు మనం లాగేసేందుకు అవకాశం ఉంటుందని.. కూడా షా అభిప్రాయపడ్డారని చర్చ జరుగుతోంది.
ఇప్పటికే పురందేశ్వరి పార్టీలో జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్నారు. అదే కమ్మ వర్గానికి చెందిన వెంకయ్య నాయుడుకు ఏకంగా ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చారు. ఇక కంభపాటి హరిబాబుకు మిజోరం గవర్నర్ పదవి ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆ వర్గంలోకి బలంగా తీసుకు వెళ్లాలని కూడా షా ఆదేశాలు జారీ చేశారట. అదే సమయంలో నాయకులు సఖ్యతతో ఉండి పార్టీ కోసం పనిచేయాలని.. ప్రతి ఒక్కరూ నిత్యం యాక్టివ్గా ఉండాలని.. సొంత వ్యాపారాలను పక్కన పెట్టి.. పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలని.. కూడా సూచించారట. వచ్చే రెండేళ్లు ఒక పరీక్షా కాలంగా నాయకులు భావించాలని కూడా షా దిశానిర్దేశం చేసినట్టు బీజేపీలో చర్చ సాగుతుండడం గమనార్హం.
This post was last modified on November 17, 2021 9:41 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…