Political News

క‌మ్మ‌ల‌ను బాబుకు దూరం చేద్దాం.. బీజేపీ వ్యూహం!

ఏ పార్టీకైనా పుంజుకునేందుకు కొన్ని ఆయుధాలు ఉండాలి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న వారు.. అధికార పార్టీలోని లోపాల‌ను వెతుకుతారు. వాటిని ఆధారంగా చేసుకుని.. ప్ర‌జ‌ల్లోకి వెళ్తారు. త‌మ త‌మ పార్టీల‌ను బ‌లోపేతం చేసుకుంటారు. అయితే.. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ వ్యూహం మ‌రో మార్గంలో ప‌య‌నిస్తోందని తెలుస్తోంది. తాజాగా ఏపీలో ప‌ర్య‌టించిన కేంద్ర బీజేపీ అగ్ర‌నాయ‌కుడు.. అమిత్ షా.. రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌కు కొన్ని సూచ‌న‌లు చేశారు. వీటిలో ప్ర‌ధానంగా.. బీజేపీని.. సామాజిక వ‌ర్గాల వారీగా.. అభివృద్ధి చేయాలని..! అంతేకాదు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి వెన్నుద‌న్నుగా ఉన్న కీల‌క‌మైన‌.. క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని బీజేపీకి చేరువ చేయాల‌ని కూడా షా దిశానిర్దేశం కూడా చేసిన‌ట్టు తెలిసింది.

చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో ఎందుకు ఓడిపోయార‌నే విష‌యం ఈ సంద‌ర్భంగా అమిత్ షా దృష్టికి వ‌చ్చింది. దీనిపై ఆయ‌న ఒక సుదీర్ఘ ప్ర‌సంగమే చేశారు. తాజాగా రాష్ట్ర నేత‌ల‌తో భేటీ అయిన‌.. షా.. “చంద్ర‌బాబుకు క‌మ్మ సామాజిక వ‌ర్గం అండ ఉంద‌ని అంటున్నారు. అయితే.. ఆ వ‌ర్గ‌మే అండ ఉంటే.. ఆయ‌న ఎందుకు ఓడిపోయారు? అంటే.. ఆ వ‌ర్గంలోనూ చంద్ర‌బాబును వ్య‌తిరేకించే నాయ‌కులు ఉన్నారు. అదేవిధంగా ప్ర‌జ‌ల్లోనూ ఉన్నారు. సో.. ఇప్పుడు వారిని మ‌నం చేర‌దీద్దాం. వారికి ఏం కావాలో ఏం కోరుకుంటున్నారో.. చూడండి. నాకు త్వ‌ర‌లోనే నివేదిక ఇవ్వండి. అంతా నేను చూసుకుంటాను” అని షా తేల్చి చెప్పిన‌ట్టు బీజేపీ వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ న‌డుస్తోంది.

అంతేకాదు.. క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని చేర‌దీసే బాధ్య‌త‌ను పురందేశ్వ‌రి స‌హా.. కొంద‌రు క‌మ్మ నాయ‌కుల‌కు అమిత్ షా అప్ప‌గించార‌ని స‌మాచారం. అదే స‌మ‌యంలో క‌మ్మ వ‌ర్గాన్ని ఆక‌ర్షించేందుకు అనుస‌రించా ల్సిన వ్యూహాన్ని కూడా సిద్ధం చేయాల‌ని.. త‌ద్వారా.. ప్ర‌తిప‌క్షం ఓటు బ్యాంకును స‌గం వ‌ర‌కు మ‌నం లాగేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని.. కూడా షా అభిప్రాయ‌ప‌డ్డార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే పురందేశ్వ‌రి పార్టీలో జాతీయ స్థాయిలో కీల‌కంగా ఉన్నారు. అదే క‌మ్మ వ‌ర్గానికి చెందిన వెంక‌య్య నాయుడుకు ఏకంగా ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వి ఇచ్చారు. ఇక కంభ‌పాటి హ‌రిబాబుకు మిజోరం గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇచ్చారు. ఇవ‌న్నీ కూడా ఆ వ‌ర్గంలోకి బ‌లంగా తీసుకు వెళ్లాల‌ని కూడా షా ఆదేశాలు జారీ చేశార‌ట‌. అదే స‌మ‌యంలో నాయ‌కులు స‌ఖ్య‌త‌తో ఉండి పార్టీ కోసం ప‌నిచేయాల‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ నిత్యం యాక్టివ్‌గా ఉండాల‌ని.. సొంత వ్యాపారాల‌ను ప‌క్క‌న పెట్టి.. పార్టీ ప‌టిష్ట‌త‌పై దృష్టి పెట్టాల‌ని.. కూడా సూచించార‌ట‌. వ‌చ్చే రెండేళ్లు ఒక ప‌రీక్షా కాలంగా నాయ‌కులు భావించాల‌ని కూడా షా దిశానిర్దేశం చేసిన‌ట్టు బీజేపీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 17, 2021 9:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…

3 hours ago

చ‌క్క‌ని అవ‌కాశం చేజార్చుకున్న వైసీపీ!

అవ‌కాశాలు.. అదృష్టాలు.. ప‌దే ప‌దే రావ‌ని అంటారు. అవి వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వ్య‌క్తులైనా పార్టీలైనా.. ఎవ‌రైనా స‌రే..…

6 hours ago

ఈసారి కష్టపడి ఓడిన చెన్నై… పంజాబ్ పవర్ఫుల్ గేమ్

ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…

6 hours ago

విజ‌య్‌ని డీగ్రేడ్ చేసేలా పొలిటిక‌ల్ మూవీ?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నపుడు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎలివేష‌న్లు ఇస్తూ సినిమాలు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రు నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ మూవీస్…

6 hours ago

రాజ‌ధానిపై చంద్ర‌బాబు ముందు చూపు… ఇవే కీల‌కం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై సీఎం చంద్ర‌బాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజ‌ధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.…

6 hours ago

రేసు గుర్రం కొంచెం తొందరపడిందేమో

ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…

7 hours ago