Political News

పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వనున్న ఏపీ సర్కారు.. ఎవరికంటే?

అవసరానికి తగ్గట్లు నిర్ణయం తీసుకోవటం.. అది కూడా సమయానికి తగ్గట్లుగా ఉండటం చాలా తక్కువమంది చేసే పని. తాజాగా అలాంటి నిర్ణయాన్ని తీసుకుంది ఏపీ సర్కారు.

ఏపీ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తూ తీసుకున్న తాజా నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు సెల్ ఫోన్లు.. ట్యాబులు.. ల్యాప్ టాప్ అవసరం బాగా పెరిగినట్లే. ఆ విద్యార్థి.. ఈ విద్యార్థి అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆన్ లైన్ క్లాసుల దిశగా.. స్కూళ్లు ప్లాన్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీల్లో చదువుకునే విద్యార్థులకు సెల్ ఫోన్లను ఉచితంగా ఇవ్వాలని డిసైడ్ చేశారు. నిరుపేద విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు.. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో చదువుకునే తొమ్మిది నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా సెల్ ఫోన్ ఇవ్వనున్నారు. దాదాపు 60 వేల మంది వరకు ఈ పథకంలో భాగంగా లబ్థిదారులు కానున్నారు. ఒక్కో విద్యార్థికి ఐదారు వేల రూపాయిలు విలువ చేసే స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ఇవ్వనున్నారు.

రానున్న రోజుల్లో ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండటం.. ఆ కార్యక్రమాన్ని ఫాలో కావాలంటే స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. దీంతో.. రాష్ట్రంలోని 60వేల మంది విద్యార్థులకు సెల్ ఫోన్లు అందించాలని నిర్ణయించారు. అంతేకాదు.. నెలకు ఒక్కో పాఠశాలకు 300 సోడియం హైపోక్లోరైట్.. 150 లీటర్ల సోప్ లిక్విడ్ సరఫరా చేయటంతో పాటు.. 189 గురుకులాల్లో ఇంగ్లిషు ల్యాబులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముందుచూపుతో తీసుకునే ఈ తరహా నిర్ణయాల్ని తెలంగాణ సర్కారు అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Satya

Recent Posts

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

38 minutes ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

2 hours ago

జగన్.. బాలయ్య సాయం కోరిన వేళ..!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…

2 hours ago

డీఎస్సీపై గగ్గోలు… నీట్‌పై మౌనం..?

"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…

2 hours ago

వంద దేవుళ్ళు తల్లిది పెద్ద టాలెంటే

ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…

3 hours ago

వింటేజ్ హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో

కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…

5 hours ago