అవసరానికి తగ్గట్లు నిర్ణయం తీసుకోవటం.. అది కూడా సమయానికి తగ్గట్లుగా ఉండటం చాలా తక్కువమంది చేసే పని. తాజాగా అలాంటి నిర్ణయాన్ని తీసుకుంది ఏపీ సర్కారు.
ఏపీ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తూ తీసుకున్న తాజా నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు సెల్ ఫోన్లు.. ట్యాబులు.. ల్యాప్ టాప్ అవసరం బాగా పెరిగినట్లే. ఆ విద్యార్థి.. ఈ విద్యార్థి అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆన్ లైన్ క్లాసుల దిశగా.. స్కూళ్లు ప్లాన్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీల్లో చదువుకునే విద్యార్థులకు సెల్ ఫోన్లను ఉచితంగా ఇవ్వాలని డిసైడ్ చేశారు. నిరుపేద విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు.. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో చదువుకునే తొమ్మిది నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా సెల్ ఫోన్ ఇవ్వనున్నారు. దాదాపు 60 వేల మంది వరకు ఈ పథకంలో భాగంగా లబ్థిదారులు కానున్నారు. ఒక్కో విద్యార్థికి ఐదారు వేల రూపాయిలు విలువ చేసే స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ఇవ్వనున్నారు.
రానున్న రోజుల్లో ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండటం.. ఆ కార్యక్రమాన్ని ఫాలో కావాలంటే స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. దీంతో.. రాష్ట్రంలోని 60వేల మంది విద్యార్థులకు సెల్ ఫోన్లు అందించాలని నిర్ణయించారు. అంతేకాదు.. నెలకు ఒక్కో పాఠశాలకు 300 సోడియం హైపోక్లోరైట్.. 150 లీటర్ల సోప్ లిక్విడ్ సరఫరా చేయటంతో పాటు.. 189 గురుకులాల్లో ఇంగ్లిషు ల్యాబులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముందుచూపుతో తీసుకునే ఈ తరహా నిర్ణయాల్ని తెలంగాణ సర్కారు అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…