Political News

పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వనున్న ఏపీ సర్కారు.. ఎవరికంటే?

అవసరానికి తగ్గట్లు నిర్ణయం తీసుకోవటం.. అది కూడా సమయానికి తగ్గట్లుగా ఉండటం చాలా తక్కువమంది చేసే పని. తాజాగా అలాంటి నిర్ణయాన్ని తీసుకుంది ఏపీ సర్కారు.

ఏపీ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తూ తీసుకున్న తాజా నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు సెల్ ఫోన్లు.. ట్యాబులు.. ల్యాప్ టాప్ అవసరం బాగా పెరిగినట్లే. ఆ విద్యార్థి.. ఈ విద్యార్థి అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆన్ లైన్ క్లాసుల దిశగా.. స్కూళ్లు ప్లాన్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీల్లో చదువుకునే విద్యార్థులకు సెల్ ఫోన్లను ఉచితంగా ఇవ్వాలని డిసైడ్ చేశారు. నిరుపేద విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు.. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో చదువుకునే తొమ్మిది నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా సెల్ ఫోన్ ఇవ్వనున్నారు. దాదాపు 60 వేల మంది వరకు ఈ పథకంలో భాగంగా లబ్థిదారులు కానున్నారు. ఒక్కో విద్యార్థికి ఐదారు వేల రూపాయిలు విలువ చేసే స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ఇవ్వనున్నారు.

రానున్న రోజుల్లో ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండటం.. ఆ కార్యక్రమాన్ని ఫాలో కావాలంటే స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. దీంతో.. రాష్ట్రంలోని 60వేల మంది విద్యార్థులకు సెల్ ఫోన్లు అందించాలని నిర్ణయించారు. అంతేకాదు.. నెలకు ఒక్కో పాఠశాలకు 300 సోడియం హైపోక్లోరైట్.. 150 లీటర్ల సోప్ లిక్విడ్ సరఫరా చేయటంతో పాటు.. 189 గురుకులాల్లో ఇంగ్లిషు ల్యాబులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముందుచూపుతో తీసుకునే ఈ తరహా నిర్ణయాల్ని తెలంగాణ సర్కారు అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on June 6, 2020 11:33 am

Share
Show comments
Published by
satya

Recent Posts

జ‌గ‌న్‌లో ఓట‌మి భ‌యానికిది సంకేత‌మా?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకో వార‌మే స‌మ‌యం ఉంది. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అటు ప్ర‌తిప‌క్ష…

4 hours ago

ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…

5 hours ago

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

9 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

12 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

13 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

14 hours ago