Political News

పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వనున్న ఏపీ సర్కారు.. ఎవరికంటే?

అవసరానికి తగ్గట్లు నిర్ణయం తీసుకోవటం.. అది కూడా సమయానికి తగ్గట్లుగా ఉండటం చాలా తక్కువమంది చేసే పని. తాజాగా అలాంటి నిర్ణయాన్ని తీసుకుంది ఏపీ సర్కారు.

ఏపీ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తూ తీసుకున్న తాజా నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు సెల్ ఫోన్లు.. ట్యాబులు.. ల్యాప్ టాప్ అవసరం బాగా పెరిగినట్లే. ఆ విద్యార్థి.. ఈ విద్యార్థి అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆన్ లైన్ క్లాసుల దిశగా.. స్కూళ్లు ప్లాన్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీల్లో చదువుకునే విద్యార్థులకు సెల్ ఫోన్లను ఉచితంగా ఇవ్వాలని డిసైడ్ చేశారు. నిరుపేద విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు.. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో చదువుకునే తొమ్మిది నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా సెల్ ఫోన్ ఇవ్వనున్నారు. దాదాపు 60 వేల మంది వరకు ఈ పథకంలో భాగంగా లబ్థిదారులు కానున్నారు. ఒక్కో విద్యార్థికి ఐదారు వేల రూపాయిలు విలువ చేసే స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ఇవ్వనున్నారు.

రానున్న రోజుల్లో ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండటం.. ఆ కార్యక్రమాన్ని ఫాలో కావాలంటే స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. దీంతో.. రాష్ట్రంలోని 60వేల మంది విద్యార్థులకు సెల్ ఫోన్లు అందించాలని నిర్ణయించారు. అంతేకాదు.. నెలకు ఒక్కో పాఠశాలకు 300 సోడియం హైపోక్లోరైట్.. 150 లీటర్ల సోప్ లిక్విడ్ సరఫరా చేయటంతో పాటు.. 189 గురుకులాల్లో ఇంగ్లిషు ల్యాబులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముందుచూపుతో తీసుకునే ఈ తరహా నిర్ణయాల్ని తెలంగాణ సర్కారు అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on June 6, 2020 11:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

4 minutes ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

1 hour ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

1 hour ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

2 hours ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

2 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

4 hours ago