Political News

సంచ‌ల‌న నిర్ణ‌యం.. మ‌రింత పెరిగిన మోడీ ‘అధికారం’

దేశంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లుగా పేరున్న సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ)ల‌పై ఇటీవ‌ల కాలం లో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కేంద్రం చెప్పుచేతుల్లో ఉన్నాయ‌నే వాద‌న కూడా ఉంది. ముఖ్యంగా త‌మ‌కు ఇష్టంలేని నాయ‌కుల‌పైనా.. త‌మ‌కు ఎదురు మాట్లాడే రాష్ట్రాల‌పైనా.. ఈ సంస్థ‌ల‌ను ప్ర‌యోగిస్తు న్నార‌నే వాద‌న కూడా ఉంది.

గ‌తంలో కాంగ్రెస్ హ‌యాం నుంచే ఈ రెండు సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తున్నార‌నే వాద‌న కోర్టులు సైతం వ్య‌క్తం చేశాయి. అంతేకాదు.,. త‌మ‌కు న‌చ్చిన వారిపై ఒక విధంగా .. న‌చ్చ‌క‌పోతే.. మ‌రో విధంగా ఈ రెండు సంస్థ‌ల‌ను ప్ర‌యోగిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వున్నాయి.

దీనికి దేశంలో అనేక ఉదాహ‌ర‌ణ‌లు కూడా ఉన్నాయి. సీబీఐ డైరెక్ట‌ర్లుగా, ఈడీ అధికారులుగా ఉన్న‌వారిని కేంద్రం మేనేజ్ చేస్తోంద‌ని.. గ‌తంలో ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు.. పాల‌గుమ్మి సాయినాథ్ వంటి వారు కూడా త‌ప్పుబ‌ట్టారు.

పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేయాల్సిన ఈ సంస్థ‌ల‌ను త‌మ సొంత సంస్థ‌లుగా.. రాజ‌కీయ అవ‌స‌రాల‌కు వినియోగించుకునే.. ఇంటి సంస్థ‌లుగా మార్చుకుంటున్నార‌నే వాద‌న ఉంది. అయితే.. ఎవ‌రు ఎలా వాడుకున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు.. సీబీఐ.. ఈడీ డైరెక్ట‌ర్ల విష‌యంలో ఒకింత వెసులుబాటు ఉండేది. వారు రెండేళ్ల కాల‌ప‌రిమితికి మించి.. ఈ ప‌ద‌వుల్లో ఉండే అవ‌కాశం లేదు.

సో.. ఈ క్ర‌మంలో.. ఆయా ప‌ద‌వుల్లోకి వ‌చ్చిన‌వారు.. రెండేళ్ల కాలంలో.. కేంద్రానికి కొంద‌రు సాహో.. అన్న వారు ఉన్నా.. మ‌రికొంద‌రు నిక్క‌చ్చిగా ఉన్న‌వారు కూడా ఉన్నారు. దీంతో అంతో ఇంతో న్యాయం జ‌రిగిన సంద‌ర్భాలు ఉన్నాయి.

అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఏకంగా ఐదేళ్లకు పెంచుతూ న‌రేంద్ర మోడీ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. ఇది నిజంగా సంచ‌ల‌నమే. ఎందుకంటే.. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వీటి ప‌ద‌వీ కాలం.. రెండేళ్లే.

రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప్ర‌త్యేక ప్రాతిప‌దిక కూడా ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఈ ప‌ద‌వీ కాలాన్ని.. మూడేళ్లు పెంచేస్తూ.. నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక‌.. డైరెక్ట‌ర్ల‌ను త‌మ చెప్పు చేత‌ల్లో పెట్టుకునే వ్యూహానికి మ‌రింత ప‌దును పెట్టే అవ‌కాశం ఉంద‌ని.. విశ్లేష‌కులు.. భావిస్తున్నారు.

ప్రస్తుతం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం ప్రకారం రెండేళ్ల పదవీకాలంతో కొనసాగుతున్న సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌లకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. సో.. దీనిని బ‌ట్టి.. మోడీ అధికారాలు మ‌రింత విస్తృతం.. కానున్నాయ‌న‌డంలో సందేహం లేద‌ని అంటున్నారు. మ‌రి ఇలాంటి పోక‌డ‌లు న్యాయ బ‌ద్ధంగా నిలుస్తాయా? ఎవ‌రైనా.. కోర్టుకు వెళ్తే.. ఏం స‌మాధానం చెబుతారు? అస‌లు ఎందుకు పెంచాల్సి వ‌చ్చింది? అనే ప్ర‌శ్న‌ల‌కు ఇప్పుడు స‌మాధానం రాబ‌ట్టాల్సి ఉంది.

This post was last modified on November 15, 2021 7:33 am

Share

Recent Posts

సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ…

2 hours ago

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

4 hours ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

5 hours ago

దేవిలో ఇది గొప్ప లక్షణం

టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…

7 hours ago

రోమియో ఫిక్సయ్యాడు… ఓజి లేటవుతాడు

నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…

7 hours ago