Political News

సంచ‌ల‌న నిర్ణ‌యం.. మ‌రింత పెరిగిన మోడీ ‘అధికారం’

దేశంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లుగా పేరున్న సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ)ల‌పై ఇటీవ‌ల కాలం లో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కేంద్రం చెప్పుచేతుల్లో ఉన్నాయ‌నే వాద‌న కూడా ఉంది. ముఖ్యంగా త‌మ‌కు ఇష్టంలేని నాయ‌కుల‌పైనా.. త‌మ‌కు ఎదురు మాట్లాడే రాష్ట్రాల‌పైనా.. ఈ సంస్థ‌ల‌ను ప్ర‌యోగిస్తు న్నార‌నే వాద‌న కూడా ఉంది.

గ‌తంలో కాంగ్రెస్ హ‌యాం నుంచే ఈ రెండు సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తున్నార‌నే వాద‌న కోర్టులు సైతం వ్య‌క్తం చేశాయి. అంతేకాదు.,. త‌మ‌కు న‌చ్చిన వారిపై ఒక విధంగా .. న‌చ్చ‌క‌పోతే.. మ‌రో విధంగా ఈ రెండు సంస్థ‌ల‌ను ప్ర‌యోగిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వున్నాయి.

దీనికి దేశంలో అనేక ఉదాహ‌ర‌ణ‌లు కూడా ఉన్నాయి. సీబీఐ డైరెక్ట‌ర్లుగా, ఈడీ అధికారులుగా ఉన్న‌వారిని కేంద్రం మేనేజ్ చేస్తోంద‌ని.. గ‌తంలో ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు.. పాల‌గుమ్మి సాయినాథ్ వంటి వారు కూడా త‌ప్పుబ‌ట్టారు.

పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేయాల్సిన ఈ సంస్థ‌ల‌ను త‌మ సొంత సంస్థ‌లుగా.. రాజ‌కీయ అవ‌స‌రాల‌కు వినియోగించుకునే.. ఇంటి సంస్థ‌లుగా మార్చుకుంటున్నార‌నే వాద‌న ఉంది. అయితే.. ఎవ‌రు ఎలా వాడుకున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు.. సీబీఐ.. ఈడీ డైరెక్ట‌ర్ల విష‌యంలో ఒకింత వెసులుబాటు ఉండేది. వారు రెండేళ్ల కాల‌ప‌రిమితికి మించి.. ఈ ప‌ద‌వుల్లో ఉండే అవ‌కాశం లేదు.

సో.. ఈ క్ర‌మంలో.. ఆయా ప‌ద‌వుల్లోకి వ‌చ్చిన‌వారు.. రెండేళ్ల కాలంలో.. కేంద్రానికి కొంద‌రు సాహో.. అన్న వారు ఉన్నా.. మ‌రికొంద‌రు నిక్క‌చ్చిగా ఉన్న‌వారు కూడా ఉన్నారు. దీంతో అంతో ఇంతో న్యాయం జ‌రిగిన సంద‌ర్భాలు ఉన్నాయి.

అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఏకంగా ఐదేళ్లకు పెంచుతూ న‌రేంద్ర మోడీ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. ఇది నిజంగా సంచ‌ల‌నమే. ఎందుకంటే.. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వీటి ప‌ద‌వీ కాలం.. రెండేళ్లే.

రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప్ర‌త్యేక ప్రాతిప‌దిక కూడా ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఈ ప‌ద‌వీ కాలాన్ని.. మూడేళ్లు పెంచేస్తూ.. నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక‌.. డైరెక్ట‌ర్ల‌ను త‌మ చెప్పు చేత‌ల్లో పెట్టుకునే వ్యూహానికి మ‌రింత ప‌దును పెట్టే అవ‌కాశం ఉంద‌ని.. విశ్లేష‌కులు.. భావిస్తున్నారు.

ప్రస్తుతం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం ప్రకారం రెండేళ్ల పదవీకాలంతో కొనసాగుతున్న సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌లకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. సో.. దీనిని బ‌ట్టి.. మోడీ అధికారాలు మ‌రింత విస్తృతం.. కానున్నాయ‌న‌డంలో సందేహం లేద‌ని అంటున్నారు. మ‌రి ఇలాంటి పోక‌డ‌లు న్యాయ బ‌ద్ధంగా నిలుస్తాయా? ఎవ‌రైనా.. కోర్టుకు వెళ్తే.. ఏం స‌మాధానం చెబుతారు? అస‌లు ఎందుకు పెంచాల్సి వ‌చ్చింది? అనే ప్ర‌శ్న‌ల‌కు ఇప్పుడు స‌మాధానం రాబ‌ట్టాల్సి ఉంది.

This post was last modified on November 15, 2021 7:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

3 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

7 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

9 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

9 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

11 hours ago

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి…

11 hours ago