Political News

మిమ్మ‌ల్ని వ‌దులుకోం.. జ‌గ‌న్‌కు షా హామీ..

“మిమ్మ‌ల్ని మేం వ‌దులుకోం! మీ స‌మ‌స్య‌లు మీవి కాదు.. మావి!” .. ఈ మాట అన్న‌ది ఎవ‌రో కాదు.. కేంద్ర హోం శాఖ మంత్రి, కేంద్రంలో నెంబ‌ర్ 2 నాయ‌కుడు.. అమిత్ షా. అది కూడా ఎవ‌రి గురించో కాదు.. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గురించే. ప్ర‌స్తుతం తిరుప‌తి కేంద్రంగా జ‌రిగిన ద‌క్షిణ ప్రాంతీయ మండ‌లి స‌మావేశం ముగిసింది. అయితే.. ఈ స‌మావేశానికి సీఎం హోదాలో.. జ‌గ‌న్ నాయ‌క‌త్వం వ‌హించారు. మండ‌లి స‌మావేశానికి చైర్మ‌న్‌గా.. అమిత్ షానే ఉన్నా.. సీఎం హోదాలో జ‌గ‌న్ నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. తొలి ప్ర‌సంగం కూడా ఆయ‌నే చేశారు.

అయితే.. దీనికి ముందే.. షా.. రాష్ట్రంలో అడుగు పెట్టిన నాటి నుంచి చివ‌రి నిముషం వ‌ర‌కు కూడా సీఎం.. జ‌గ‌న్ అన్నీతానై, ఆయ‌న‌కు అతిధి మ‌ర్యాదలు చేశారు. ఈ క్ర‌మంలో అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ.. రాష్ట్ర స‌మ‌స్య‌లు వెల్ల‌డించారు. ప్ర‌ధానంగా.. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం.. రెండు తెలుగు రాష్ట్రాల సంబంధాల‌ను జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. దీంతో ఆయా స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్‌తో ప‌ర్స‌న‌ల్‌గా మాట్లాడిన‌(స‌మావేశానికి ముందు 5 నిముషాలు) షా.. జ‌గ‌న్‌కు అభ‌యం ఇచ్చార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అనంత‌రం.. స‌మావేశంలో మాట్లాడిన షా.. మ‌రోసారి.. జ‌గ‌న్ విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు రెండు రాష్ట్రాలవే కాదని.. ఇవి జాతీయ అంశాలని షా పేర్కొన్నారు. అంతేకాదు.. జగన్ ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని.. తప్పకుండా వీటన్నింటికీ పరిష్కారం చూపుతామని ఈ సభాముఖంగా అమిత్‌ షా హామీ ఇచ్చారు. ఇక‌, ర‌హ‌స్యంగా మాట్లాడిన రెండు మూడు నిమిషాల్లోనూ.. జ‌గ‌న్ త‌మ‌కు అత్యంత కావాల్సిన నాయ‌కుడ ని.. యువ‌త‌ను ప్రోత్స‌హించేందుకు .. మోడీ కంక‌ణం క‌ట్టుకున్నార‌ని.. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ విష‌యంలో మోడీ సానుకూలంగా ఉన్నార‌ని.. కూడా షా .. స్వ‌యంగా జ‌గ‌న్ చెప్పార‌ని తెలుస్తోంది.

“మీరు మా మ‌నిషి” అని జ‌గ‌న్‌తో షా అన్నార‌ని తెలిసింది. ఇక‌, ఈ స‌మావేశంలో జ‌గ‌న్‌.. రాష్ట్రానికి సంబంధించి.. అనేక అంశాల‌ను ప్ర‌స్తావించారు. ‘ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయాలి.. విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలుకాలేదు” అని జ‌గ‌న్ వివ‌రించారు.

అంతేకాదు.. “ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే. రీసోర్స్‌ గ్యాప్‌నూ భర్తీ చేయలేదు. తెలంగాణ నుంచి విద్యుత్‌ బకాయిలను ఇప్పించాలి. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వాలి. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలి. రేషన్‌ లబ్ధిదారుల గుర్తింపుపై కేంద్రం ప్రక్రియలో హేతుబద్ధత లేదు. దీనిపై వెంటనే సవరణలు చేయాలి’ అని సమావేశంలో కీలక అంశాలను జగన్‌ ప్రస్తావించారు. ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు షా.. మొగ్గు చూప‌డం విశేషం.

This post was last modified on November 15, 2021 7:27 am

Share

Recent Posts

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

51 minutes ago

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

1 hour ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

1 hour ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

5 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

5 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

5 hours ago