Political News

వెంకయ్య రాజీనామా చేస్తానంటే వద్దన్నారా ?

ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసి రాజకీయాలనుండి తప్పుకుని పూర్తిగా ప్రజా సేవ చేయాలని వెంకయ్య నాయుడు అనుకుంటే ఎవరైనా వద్దన్నారా ? ఇపుడిదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. నెల్లూరు పర్యటనలో ఉన్న వెంకయ్య ఓ సమావేశంలో మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పదవికి ఇప్పటికిప్పుడు రాజీనామా చేసేసి ప్రజాసేవలో పాల్గొనాలని ఉన్నట్లు చెప్పారు. జనాల్లో తిరుగుతూ జనాలకు మంచి చేయటంలో ఉన్న ఆనందం తనకు ఉపరాష్ట్రపతి పదవిలో రావటం లేదని బాధపడిపోయారు.

జనాలకు మంచిపనులు చేయటంలో ఉన్న ఆనందం రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉండదని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేంద్రమంత్రిగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న వెంకయ్యను నరేంద్ర మోడీ బలవంతంగా ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఓ సభలో వెంకయ్యే చెప్పారు. తాను కేంద్రమంత్రి పదవిలో ఉంటానని, ఉపరాష్ట్రపదవి వద్దని మోడికి ఎంత చెప్పినా వినకుండా తనను తీసుకెళ్లి రాజ్యాంగబద్దమైన పదవిలో కూర్చోబెట్టారని వెంకయ్య చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.

అప్పటి నుంచి వెంకయ్య చాలా సభలో కాస్త అటుఇటుగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా ఉండటం ఇష్టం లేనప్పుడు రాజీనామా చేసేయొచ్చు. ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసేసి ఏకంగా రాజకీయాల నుండే తప్పుకుంటున్నట్లు వెంకయ్య ప్రకటిస్తే బహుశా వద్దనే వారుండరు. ఒకవైపు ఉపరాష్ట్రపతిగా ఉండటం తనకు ఇష్టంలేదని చెబుతునే తనను రాష్ట్రపతిగా చూడాలని అందరు కోరుకుంటున్నారని చెప్పటం వెంకయ్యకే చెల్లింది.

జనాల్లో స్వేచ్చగా తిరగాలని, ప్రజాసేవలో తరించిపోవాలనే కోరిక అంత బలంగా ఉన్నపుడు వెంటనే రాజీనామా చేసేసి తమ సొంత సంస్థ స్వర్ణభారతి ట్రస్టు నిర్వహణ బాధ్యతలను చేపడితే ఎంతోమంది ప్రజలకు సేవచేసే అవకాశం దక్కుతుంది. రాజకీయాల్లో వెంకయ్య సంపాదించిన అనుభవాన్ని నెల్లూరు జిల్లా, తెలుగురాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగిస్తే జనాలందరు చాలా సంతోషిస్తారు. రాజకీయ జీవితంలో దాదాపు క్లైమాక్స్ కు చేరుకున్న వెంకయ్య చివరిరోజుల్లో అయినా తన మనసుకు నచ్చినట్లు ఉండటానికి మించిన సంతృప్తి ఏముంటుంది ?

This post was last modified on November 13, 2021 11:28 am

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

1 hour ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago