Political News

శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు


ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏపీ, కర్నాటక సరిహద్దు వివాదం తేలేంతవరకూ తనపై ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసుపై దర్యాప్తును నిలిపివేయాలని శ్రీలక్ష్మి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణను తొమ్మిదేళ్లుగా సీబీఐ సాగదీస్తుందంటూ ఆమె తరపు న్యాయవాది రంజిత్ కుమార్ వాదించారు. అదనపు చార్జిషీట్లు దాఖలు చేయాలని సీబీఐ జాప్యం చేస్తుందని కోర్టు దృష్టికి న్యాయవాది తెచ్చారు. వాదనలు విన్న కోర్టు శ్రీలక్ష్మి పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఇటీవల జగన్‌ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మిపై నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. దాల్మియా సిమెంట్స్‌ కేసులో విచారణకు తరచూ హాజరు కాకపోవడంతో శ్రీలక్ష్మిపై న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దాల్మియా కేసులో శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. కోర్టు విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు గైర్హాజరయ్యారు. దీంతో న్యాయస్థానం ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 1988 బ్యాచ్‌కు చెందిన శ్రీలక్ష్మి, ఓబుళాపురం గనుల కేసులో అరెస్టయి, సస్పెన్షన్‌కు గురయ్యారు.

తెలంగాణ కేడర్ కు చెందిన శ్రీలక్ష్మికి ఏపీ ప్రభుత్వం 2021 జనవరి 18న ఆమెకు ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఆమెపై పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల్లో తీర్పునకు లోబడి ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. శ్రీలక్ష్మి 2026 జూన్‌ 30 వరకూ ఆమె సర్వీసులో ఉంటారు. ముందుగా ఆమెకు ఏపీ సచివాలయంలో పురపాలక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అదే శాఖలో ఆమెకు ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు.

This post was last modified on November 13, 2021 8:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

31 minutes ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

1 hour ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

1 hour ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

1 hour ago

రెండు విషయాల్లో ఉస్తాదే కరెక్ట్

ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…

2 hours ago

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…

5 hours ago