Political News

మోడీ నిర్ణ‌యం ఖ‌రీదు.. 1114 కోట్లు.. త‌ల‌ప‌ట్టుకున్న ఏపీ!

పెట్రోల్ ధ‌ర‌లు, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించాలంటూ.. టీడీపీ స‌హా బీజేపీలు.. భారీ ఎత్తున రాష్ట్రంలో ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. కేంద్రం పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గించిన నేప‌థ్యంలో రాష్ట్రంలోనూ త‌గ్గించాల‌నే డిమాండ్లు వినిపించాయి. అయితే.. ఇది ఒక బాధ అయితే.. మ‌రోవైపు.. ఏపీ అధికారులు.. ప్ర‌భుత్వం.,. ఓ వాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. కేంద్రంలోని మోడీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం.. కార‌ణంగా ఏపీకి భారీ దెబ్బ త‌గిలింద‌ని.. తాజాగా వెల్ల‌డించారు. కేంద్రం ఇటీవ‌ల పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ.. నిర్ణ‌యం తీసుకుంది.

అప్ప‌టి వ‌ర‌కు పెంచ‌డ‌మే త‌ప్ప‌.. త‌గ్గించ‌డం తెలియ‌ని కేంద్రం.. ఒక్క‌సారిగా.. పెట్రోల్‌పై రూ.5 డీజీల్ పై రూ.10 చొప్పున త‌గ్గించింది. దీంతో దేశ‌వ్యాప్తంగా ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయితే.. దీనికి సంబంధించి కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని త‌గ్గించింది. అయితే.. ఈ త‌గ్గింపుతో త‌మ ఆదాయం కూడా పోయింద‌ని.. రాష్ట్రం ఇప్పుడు గ‌గ్గోలు పెడుతోంది. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ డ్యూటీతో రాష్ట్రంలోనూ తగ్గిన వ్యాట్ కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ డ్యూటీ కారణంగా..రాష్ట్రం ఆదాయంలో భారీగా కోత పడుతోందని అధికారులు తెలిపారు. ఏడాదికి వేయి కోట్ల రూపాయలకుపైగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోనుందన్నారు.

పెట్రోలు, డీజిల్‌పై ఐదు, పది రూపాయల చొప్పున కేంద్రం తగ్గింపు వల్ల..ఆ మేరకు రాష్ట్రంలో పెట్రోలు లీటరుపై రూపాయి 51పైసలు, డీజిల్పై 2రూపాయల 22 పైసల మేర వ్యాట్ తగ్గిందని పేర్కొన్నారు. ఏడాదికి డీజిల్పై 888 కోట్ల రూపాయలు, పెట్రోలుపై 226కోట్ల మేర వ్యాట్ ఆదాయం తగ్గనుంద‌న్నారు. కేంద్రం తగ్గించిన ఎక్సైజు పన్నుతో వ్యాట్ మూలధరలో వచ్చిన మార్పుల కారణంగా మొత్తంగా ఏడాదికి 1114 కోట్ల రూపాయల మేర వ్యాట్ ఆదాయంలో తగ్గుదల నమోదు కానుందని అధికారులు అంచనా వేశారు. సో.. ఒక‌వైపు.. టీడీపీ, బీజేపీలు.. ధ‌ర‌లు త‌గ్గించ‌మంటే.. ప్ర‌భుత్వం మాత్రం త‌మ‌కు న‌ష్టం వ‌చ్చింద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై విప‌క్షాలు ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తాయో చూడాలి.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

7 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

8 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

10 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

10 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

11 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

11 hours ago