Political News

మోడీ నిర్ణ‌యం ఖ‌రీదు.. 1114 కోట్లు.. త‌ల‌ప‌ట్టుకున్న ఏపీ!

పెట్రోల్ ధ‌ర‌లు, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించాలంటూ.. టీడీపీ స‌హా బీజేపీలు.. భారీ ఎత్తున రాష్ట్రంలో ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. కేంద్రం పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గించిన నేప‌థ్యంలో రాష్ట్రంలోనూ త‌గ్గించాల‌నే డిమాండ్లు వినిపించాయి. అయితే.. ఇది ఒక బాధ అయితే.. మ‌రోవైపు.. ఏపీ అధికారులు.. ప్ర‌భుత్వం.,. ఓ వాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. కేంద్రంలోని మోడీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం.. కార‌ణంగా ఏపీకి భారీ దెబ్బ త‌గిలింద‌ని.. తాజాగా వెల్ల‌డించారు. కేంద్రం ఇటీవ‌ల పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తూ.. నిర్ణ‌యం తీసుకుంది.

అప్ప‌టి వ‌ర‌కు పెంచ‌డ‌మే త‌ప్ప‌.. త‌గ్గించ‌డం తెలియ‌ని కేంద్రం.. ఒక్క‌సారిగా.. పెట్రోల్‌పై రూ.5 డీజీల్ పై రూ.10 చొప్పున త‌గ్గించింది. దీంతో దేశ‌వ్యాప్తంగా ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయితే.. దీనికి సంబంధించి కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని త‌గ్గించింది. అయితే.. ఈ త‌గ్గింపుతో త‌మ ఆదాయం కూడా పోయింద‌ని.. రాష్ట్రం ఇప్పుడు గ‌గ్గోలు పెడుతోంది. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ డ్యూటీతో రాష్ట్రంలోనూ తగ్గిన వ్యాట్ కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ డ్యూటీ కారణంగా..రాష్ట్రం ఆదాయంలో భారీగా కోత పడుతోందని అధికారులు తెలిపారు. ఏడాదికి వేయి కోట్ల రూపాయలకుపైగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోనుందన్నారు.

పెట్రోలు, డీజిల్‌పై ఐదు, పది రూపాయల చొప్పున కేంద్రం తగ్గింపు వల్ల..ఆ మేరకు రాష్ట్రంలో పెట్రోలు లీటరుపై రూపాయి 51పైసలు, డీజిల్పై 2రూపాయల 22 పైసల మేర వ్యాట్ తగ్గిందని పేర్కొన్నారు. ఏడాదికి డీజిల్పై 888 కోట్ల రూపాయలు, పెట్రోలుపై 226కోట్ల మేర వ్యాట్ ఆదాయం తగ్గనుంద‌న్నారు. కేంద్రం తగ్గించిన ఎక్సైజు పన్నుతో వ్యాట్ మూలధరలో వచ్చిన మార్పుల కారణంగా మొత్తంగా ఏడాదికి 1114 కోట్ల రూపాయల మేర వ్యాట్ ఆదాయంలో తగ్గుదల నమోదు కానుందని అధికారులు అంచనా వేశారు. సో.. ఒక‌వైపు.. టీడీపీ, బీజేపీలు.. ధ‌ర‌లు త‌గ్గించ‌మంటే.. ప్ర‌భుత్వం మాత్రం త‌మ‌కు న‌ష్టం వ‌చ్చింద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై విప‌క్షాలు ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తాయో చూడాలి.

Satya

Recent Posts

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

57 minutes ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

6 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

7 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

9 hours ago

నేను హోమ్ మినిస్టర్ కాకపోవడమే నేరస్తుల అదృష్టం: పవన్

ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…

10 hours ago

సెన్సార్ చిక్కులు చిన్న సినిమాలకేనా

వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…

11 hours ago