Political News

ఎయిడెడ్ స్థ‌లాల‌పై జ‌గ‌న్ క‌న్ను.. నారా లోకేష్ ఫైర్‌

జ‌గ‌న్ పాల‌న‌లో విద్యార్థుల భ‌విష్య‌త్తు నాశ‌నం అయిపోతోంద‌ని.. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. నారా లోకేష్‌.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అనంతపురంలో ఎయిడెడ్ పాఠశాలల కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం ప్ర‌క‌టించిన లోకేష్‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. జ‌గ‌న్ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. ఎయిడెడ్‌ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తును.. సీఎం జగన్ అగమ్యగోచరంగా మార్చారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు.. ఒక మాట‌.. త‌ర్వాత‌.. ఒక చేత అన్న‌ట్టుగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. నిప్పులు చెరిగారు.

ప్రభుత్వ పథకాలన్నింటికీ జగన్‌ పేరు పెట్టడమేంటని నారా లోకేశ్ అనంతపురం పర్యటనలో అన్నారు. జగన్‌ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు.. కేవలం విధ్వంసం మాత్రమే నడుస్తోందని విమర్శించారు. ఎయిడె డ్‌ కళాశాల భూములపై సీఎం జగన్‌ కన్నేశారని ఆరోపించారు. ఎలాగైనా స‌రే.. ఆయా ఆస్తుల‌ను భూములను కూడా వ‌శ‌ప‌రుచుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఇప్ప‌టికే చాలా భూముల‌ను అధికార పార్టీ నేత‌లు ఆక్ర‌మించుకున్నార‌ని.. లోకేష్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎయిడెడ్‌ కళాశాల నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు వచ్చారని నారా లోకేశ్ వివరించారు.

2 వేలకు పైగా ఎయిడెడ్‌ పాఠశాలల్లో 2 లక్షల మంది, 182 జూనియర్ కళాశాలల్లో 71 వేల మంది విద్యార్థులున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎయిడెడ్‌ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా లోకేష్‌తో విద్యార్థులు ముఖాముఖి మాట్లాడారు. అందరికీ ఉచిత విద్య అంటూ సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏమైందని వారు.. నిలదీశారు. విద్యను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రైవేటుపరం చేస్తే వేలకు వేలు ఫీజులు ఎలా కట్టాలని ప్రశ్నించారు. దీనికి స‌మాధానం సీఎం జ‌గ‌నే చెప్పాల‌ని.. విద్యార్తులు నిల‌దీశారు.

మ‌రోవైపు.. లోకేష్ ప‌ర్య‌ట‌న‌కు ఎనలేని స్పంద‌న ల‌భించింది. అనంత‌పురం ప‌ర్య‌ట‌న‌లో అనేక మంది నాయ‌కులు.. విద్యార్థి సంఘాలు.. లోకేష్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికాయి. విద్యార్థులు.. పెద్ద ఎత్తున నినాదాల‌తో లోకేష్‌కు స్వాగ‌తం ప‌లికారు. కార్యక్రమంలో పయ్యావుల కేశవ్, కాలవ శ్రీనివాసులు, పరిటాల శ్రీరామ్ హాజరయ్యారు. వీరితోపాటుగా పలు విద్యార్థి సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.

This post was last modified on November 10, 2021 3:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి.. దీదీ కోటలో బీజేపీ మ్యాజిక్!

పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…

15 minutes ago

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…

60 minutes ago

‘టైగర్ తమ్ముళ్ల’ ఆశలు మళ్లీ చిగురించాయి

లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…

1 hour ago

JD చక్రవర్తిని ఇలాగేనా వాడుకోవడం

శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…

1 hour ago

విజ‌య్‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే వాళ్ళ కొంప ముంచిందా?

త‌మిళ‌నాట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ విజ‌య‌దుందుభి మోగించారు. ఏక‌ప‌క్షంగా 110 స్థానాల్లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా…

1 hour ago

జాక్ పాట్ కొట్టిన జన నాయకుడు

నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…

2 hours ago