టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారిలో కొందరికి ఇప్పటికే పదవులు దక్కాయి. వారిలో తూర్పుగోదావరికి చెందిన తోట త్రిమూర్తులు, అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు వంటివారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు. ఇక, ఎమ్మెల్సీలుగా ఉండి కూడా రిజైన్ చేసి.. వైసీపీలోకి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్.. సహా.. పోతుల సునీతలు కూడా టీడీపీకి రిజైన్ చేసి.. మధ్యంతరంగా.. ఎమ్మెల్సీలను వదులకుని వైసీపీ జెండా పట్టుకున్నారు. అయితే.. వీరు పార్టీలోకి రాగానే జగన్.. వీరిని మళ్లీ ఎమ్మెల్సీలను చేశారు. ఇప్పుడు ఈ వరుసలో కీలక నాయకుడు.. మాజీ మంత్రి పేరు కూడా వినిపిస్తోంది. ఆర్థికంగా బలంగా ఉండడం.. వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం.. ఇప్పుడు ఆయనకు ప్లస్ అవుతున్నాయని అంటున్నారు.
ఆయనే.. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కమ్ మంత్రి శిద్దా రాఘవరావు. గత 2014 ఎన్నికల్లో ఈయన దర్శి నుంచి విజయం దక్కించుకుని చంద్రబాబు కేబినెట్లో మంత్రి అయ్యారు. ఆరోపణలు లేని నాయకుడిగా.. ప్రజల్లో మంచి పేరు తెచ్చు కున్నారు. అంతేకాదు.. ఐదేళ్లూ పూర్తిగా ఆయన మంత్రిగా కొనసాగారు. ఈ క్రమంలో.. గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి.. ఓడిపోయారు. అయితే.. ఓడిపోయిన తర్వాత కొద్దికాలంలోనే ఆయన.. టీడీపీకి బై చెప్పి.. వైసీపీలోకి వచ్చారు.
అయితే.. ఆయన పార్టీ మారి.. రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది. ఇదే విషయం.. ప్రకాశం జిల్లాలోని వైశ్య సామాజిక వర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇక, శిద్దా కూడా ఇటీవల.. తన ప్రతిపాదనను సీఎం జగన్కు మెయిల్ చేశారని దర్శి టాక్. అంటే.. తనకు ఏదైనా గౌరవ ప్రదమైన పదవి ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. ఇక, ఇదే విషయంపై చర్చించిన జగన్ కూడా శిద్దా విషయంలో సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్సీల జాబితాను తెప్పించుకున్నారని.. పరిశీలించారని.. శిద్దాకు ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల.. పార్టీకి.. ప్రభుత్వానికి కూడా ఉపయోగం ఉంటుందని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
శిద్దాకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా.. వచ్చే ఎన్నికల్లో ఆయనను పోటీ నుంచి తప్పించవచ్చు. అదే సమయంలో ఇప్పటి వరకు ఆగ్రహంతో ఉన్న వైశ్య సామాజిక వర్గాన్ని తనవైపు పూర్తిగా తిప్పుకొనే అవకాశం ఉంటుందనికూడా జగన్ భావిస్తున్నట్టు వైసీపీలో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ సీటును కన్ఫర్మ్ చేశారని అంటున్నారు.
This post was last modified on November 10, 2021 3:39 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ…
పుష్ప 2 ది రూల్ విడుదల ఇంకో నాలుగు నెలల్లోనే ఉన్నా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా…
రాయ్ బరేలీ నుండి ప్రియాంక, అమేథి నుండి రాహుల్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతారని కాంగ్రెస్ అభిమానులు ఆశిస్తున్న నేపథ్యంలో…
క్రేజ్ పరంగా నిర్మాణంలో ఉన్న సీక్వెల్స్ పుష్ప, సలార్ లతో పోటీపడే స్థాయిలో బజ్ తెచ్చుకున్న కాంతార 2 షూటింగ్…
టీడీపీ, జనసేన మేనిఫెస్టోను ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్…
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా…