Political News

టీడీపీ మాజీ మంత్రికి జగన్ పదవిస్తాడా?

టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన వారిలో కొంద‌రికి ఇప్ప‌టికే ప‌ద‌వులు ద‌క్కాయి. వారిలో తూర్పుగోదావ‌రికి చెందిన తోట త్రిమూర్తులు, అమలాపురం మాజీ ఎంపీ పండుల ర‌వీంద్ర‌బాబు వంటివారికి ఎమ్మెల్సీలుగా అవ‌కాశం ఇచ్చారు. ఇక‌, ఎమ్మెల్సీలుగా ఉండి కూడా రిజైన్ చేసి.. వైసీపీలోకి వ‌చ్చిన డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌.. స‌హా.. పోతుల సునీత‌లు కూడా టీడీపీకి రిజైన్ చేసి.. మ‌ధ్యంత‌రంగా.. ఎమ్మెల్సీల‌ను వ‌దుల‌కుని వైసీపీ జెండా ప‌ట్టుకున్నారు. అయితే.. వీరు పార్టీలోకి రాగానే జ‌గ‌న్‌.. వీరిని మ‌ళ్లీ ఎమ్మెల్సీల‌ను చేశారు. ఇప్పుడు ఈ వ‌రుస‌లో కీల‌క నాయ‌కుడు.. మాజీ మంత్రి పేరు కూడా వినిపిస్తోంది. ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం.. వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డం.. ఇప్పుడు ఆయ‌న‌కు ప్ల‌స్ అవుతున్నాయ‌ని అంటున్నారు.

ఆయనే.. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే క‌మ్ మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో ఈయ‌న ద‌ర్శి నుంచి విజ‌యం ద‌క్కించుకుని చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రి అయ్యారు. ఆరోప‌ణ‌లు లేని నాయ‌కుడిగా.. ప్ర‌జ‌ల్లో మంచి పేరు తెచ్చు కున్నారు. అంతేకాదు.. ఐదేళ్లూ పూర్తిగా ఆయ‌న మంత్రిగా కొన‌సాగారు. ఈ క్ర‌మంలో.. గ‌త ఎన్నిక‌ల్లో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి.. ఓడిపోయారు. అయితే.. ఓడిపోయిన త‌ర్వాత కొద్దికాలంలోనే ఆయ‌న‌.. టీడీపీకి బై చెప్పి.. వైసీపీలోకి వ‌చ్చారు.

అయితే.. ఆయ‌న పార్టీ మారి.. రెండేళ్లు అవుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది. ఇదే విష‌యం.. ప్ర‌కాశం జిల్లాలోని వైశ్య సామాజిక వ‌ర్గంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక‌, శిద్దా కూడా ఇటీవ‌ల‌.. త‌న ప్ర‌తిపాద‌న‌ను సీఎం జ‌గ‌న్‌కు మెయిల్ చేశార‌ని ద‌ర్శి టాక్‌. అంటే.. త‌న‌కు ఏదైనా గౌర‌వ ప్ర‌ద‌మైన ప‌ద‌వి ఇవ్వాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించారు. ఇక‌, ఇదే విష‌యంపై చ‌ర్చించిన జ‌గ‌న్ కూడా శిద్దా విష‌యంలో సానుకూలంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ప్ర‌కాశం జిల్లా నుంచి ఇప్పటి వ‌ర‌కు ఉన్న ఎమ్మెల్సీల జాబితాను తెప్పించుకున్నార‌ని.. ప‌రిశీలించార‌ని.. శిద్దాకు ఎమ్మెల్సీ ఇవ్వ‌డం వ‌ల్ల‌.. పార్టీకి.. ప్ర‌భుత్వానికి కూడా ఉపయోగం ఉంటుంద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

శిద్దాకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను పోటీ నుంచి త‌ప్పించ‌వ‌చ్చు. అదే స‌మ‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆగ్ర‌హంతో ఉన్న వైశ్య సామాజిక వ‌ర్గాన్ని త‌న‌వైపు పూర్తిగా తిప్పుకొనే అవ‌కాశం ఉంటుంద‌నికూడా జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు వైసీపీలో చ‌ర్చ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు ఎమ్మెల్సీ సీటును క‌న్ఫ‌ర్మ్ చేశార‌ని అంటున్నారు.

This post was last modified on November 10, 2021 3:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏడు ఫ్లాపుల తర్వాతైనా హిట్టు వరించేనా

ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…

10 minutes ago

ప్యారడైజ్ పరుగులు పెట్టాల్సిందే

పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…

1 hour ago

రజినీకాంత్ భయపడ్డాడా? జాగ్రత్తపడ్డాడా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…

3 hours ago

వాషింగ్టన్ డీసీని… మనమ్మాయి శాసిస్తుందా?

ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…

3 hours ago

పార్టీ పేరుతో పాటు గుర్తుతోనూ స్ట్రోక్ ఇవ్వనున్న కవిత?

బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌విత త‌న దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వ‌రలోనే…

3 hours ago

భానుప్రియ మతిస్థిమితం కోల్పోయిందా?

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…

4 hours ago