టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారిలో కొందరికి ఇప్పటికే పదవులు దక్కాయి. వారిలో తూర్పుగోదావరికి చెందిన తోట త్రిమూర్తులు, అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు వంటివారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు. ఇక, ఎమ్మెల్సీలుగా ఉండి కూడా రిజైన్ చేసి.. వైసీపీలోకి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్.. సహా.. పోతుల సునీతలు కూడా టీడీపీకి రిజైన్ చేసి.. మధ్యంతరంగా.. ఎమ్మెల్సీలను వదులకుని వైసీపీ జెండా పట్టుకున్నారు. అయితే.. వీరు పార్టీలోకి రాగానే జగన్.. వీరిని మళ్లీ ఎమ్మెల్సీలను చేశారు. ఇప్పుడు ఈ వరుసలో కీలక నాయకుడు.. మాజీ మంత్రి పేరు కూడా వినిపిస్తోంది. ఆర్థికంగా బలంగా ఉండడం.. వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం.. ఇప్పుడు ఆయనకు ప్లస్ అవుతున్నాయని అంటున్నారు.
ఆయనే.. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కమ్ మంత్రి శిద్దా రాఘవరావు. గత 2014 ఎన్నికల్లో ఈయన దర్శి నుంచి విజయం దక్కించుకుని చంద్రబాబు కేబినెట్లో మంత్రి అయ్యారు. ఆరోపణలు లేని నాయకుడిగా.. ప్రజల్లో మంచి పేరు తెచ్చు కున్నారు. అంతేకాదు.. ఐదేళ్లూ పూర్తిగా ఆయన మంత్రిగా కొనసాగారు. ఈ క్రమంలో.. గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి.. ఓడిపోయారు. అయితే.. ఓడిపోయిన తర్వాత కొద్దికాలంలోనే ఆయన.. టీడీపీకి బై చెప్పి.. వైసీపీలోకి వచ్చారు.
అయితే.. ఆయన పార్టీ మారి.. రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది. ఇదే విషయం.. ప్రకాశం జిల్లాలోని వైశ్య సామాజిక వర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇక, శిద్దా కూడా ఇటీవల.. తన ప్రతిపాదనను సీఎం జగన్కు మెయిల్ చేశారని దర్శి టాక్. అంటే.. తనకు ఏదైనా గౌరవ ప్రదమైన పదవి ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. ఇక, ఇదే విషయంపై చర్చించిన జగన్ కూడా శిద్దా విషయంలో సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్సీల జాబితాను తెప్పించుకున్నారని.. పరిశీలించారని.. శిద్దాకు ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల.. పార్టీకి.. ప్రభుత్వానికి కూడా ఉపయోగం ఉంటుందని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
శిద్దాకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా.. వచ్చే ఎన్నికల్లో ఆయనను పోటీ నుంచి తప్పించవచ్చు. అదే సమయంలో ఇప్పటి వరకు ఆగ్రహంతో ఉన్న వైశ్య సామాజిక వర్గాన్ని తనవైపు పూర్తిగా తిప్పుకొనే అవకాశం ఉంటుందనికూడా జగన్ భావిస్తున్నట్టు వైసీపీలో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ సీటును కన్ఫర్మ్ చేశారని అంటున్నారు.
This post was last modified on November 10, 2021 3:39 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…