2020 మీద ఎన్నో మంచి అంచనాలు పెట్టుకుంటే.. చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని విషాదాల్ని మిగులుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో విస్తరించడం మొదలుపెట్టిన కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని ఎలా గడగడలాడిస్తోందో తెలిసిందే. బహుశా ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఎక్కువ మందిని ప్రభావితం చేసిన అంశం ఇదే కావచ్చు.
దీని బారి నుంచి ఎప్పుడు బయటపడుతామో తెలియట్లేదు. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీని వల్ల వందల కోట్ల మంది నష్టం చవిచూస్తున్నారు. ఈ బాధ చాలదన్నట్లు.. కరోనా ప్రభావంతో జరుగుతున్న వేరే ఉదంతాలు కూడా ప్రపంచ దేశాల్ని కష్టపెడుతున్నాయి. నష్టాల పాలు చేస్తున్నాయి. మన విశాఖపట్నంలో గ్యాస్ లీక్కు కారణం కూడా పరోక్షంగా కరోనానే.
ఈ మహమ్మారి కారణంగా రెండు నెలలు మూత పడి.. ఆ తర్వాత తెరుచుకున్న ఎల్జీ పాలిమర్స్ సంస్థలో మెయింటైనెన్స్ లోపం వల్ల స్టెరీన్ గ్యాస్ లీక్ అయింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది అనారోగ్యం పాలయ్యారు.
ఇప్పుడు రష్యాలో ఇంతకుమించిన విషాదం చోటు చేసుకుంది. అక్కడ నోరిల్స్క్ అనే నగరంలో ఓ పవర్ ప్లాంటులో మెయింటైనెన్స్ లోపం వల్ల ఫ్యూయల్ ట్యాంక్ బద్దలైంది. దాన్నుంచి 20 వేల టన్నుల ఆయిల్ లీక్ అయింది. అది మొత్తం సమీపంలోని అంబర్నాయా నదిలో కలిసిపోయింది. ప్లాంటు నుంచి ఏడు కిలోమీటర్ల దూరం ఆ ఆయిల్ విస్తరించింది. 20 వేల టన్నుల ఆయిల్ లీక్ అంటే.. ఆషామాషీ విషయం కాదు.
ఈ ఆయిల్ లీక్ చుట్టు పక్కల జీవరాశిపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. నష్టం అంచనాలకు అందని విధంగా ఉంటుందని అంటున్నారు పర్యావరణ వేత్తలు. మళ్లీ ఈ ప్రాంతంలో పర్యావరణం పూర్వ స్థితికి చేరడానికి పదేళ్లకు పైగా పడుతుందని.. ఆ లోపు అనేక దుష్పరిణామాలు చూస్తామని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. నార్వేలో ఆల్టా అనే ప్రాంతంలో సముద్ర తీరంలో ఉన్న ఇళ్ల కింద ఉన్న భూభాగం అంతా కదిలిపోయి.. ఇళ్లతో సహా వెళ్లి సముద్రంలోకి కలిసిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇవన్నీ చూసి 2020 మానవాళిపై ఇంతగా పగబట్టేసిందేంటూ ఆందోళన చెందుతున్నారు జనం.
This post was last modified on June 5, 2020 2:31 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…