Political News

జగన్ కు అంత ధైర్యముందా ?

తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయగలరా ? ఇపుడిదే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. పెట్రోల్, డీజిల్ పై తన స్టాండ్ ఏమిటనే విషయాన్ని కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. పెట్రోలుపై రు. 5, డీజల్ పై రు. 10 తగ్గించిన కేంద్రం ఇదే దామాషాలో రాష్ట్రాలను కూడా తగ్గించాలని చెప్పింది. దాంతో వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. నిజానికి గడచిన ఏడాదికాలంగా ఇంధన ధరలను పెంచేస్తున్న కేంద్రం ఇపుడు తగ్గించింది చాలా తక్కువన్న విషయాలు మరచిపోయాయి.

ఇంధన ధరలను దాదాపు 60 రూపాయలు పెంచి 5, 10 రూపాయలను తగ్గించటమంటే చాలా విచిత్రంగా ఉంది. అయినా సరే కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించటంతో ఆయా రాష్ట్రాల్లో ఇంధన ధరలు సగటున 13 రూపాయలు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కేసీయార్, జగన్ను టార్గెట్ చేసుకుని పెట్రోలు, డీజల్ ధరలు తగ్గించాలంటూ నానా గోల చేస్తున్నాయి. విచిత్రమేమిటంటే పెట్రోలు, డీజల్ ధరలు పెరిగిపోతున్నపుడు ఈ పార్టీల్లో ఒక్కటి కూడా కేంద్రాన్ని నిలదీయలేదు.

ఇదే విషయమై మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీయార్ పెట్రలు, డీజల్ ధరల్లోని మొత్తం సర్ చార్జీలను తీసేయాలంటు డిమాండ్ చేశారు. రాష్ట్రాల నోళ్ళు కొట్టి పన్నుల రూపంలో కేంద్రం సంపాదిస్తోందంటు మండిపోయారు. సంవత్సరాల తరబడి కేంద్రం జనాలను చావగొట్టి అడ్డమైన పన్నులు వేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు ఆరోపించారు. పెట్రో ఉత్పత్తుల మీద తాను ఒక్కపైసా కూడా పెంచలేదు కాబట్టి పెట్రోలు, డీజల్ ధరలు తాను ఎందుకు తగ్గించాలంటూ ప్రతిపక్షాలను ఎదురు ప్రశ్నించారు.

సరిగ్గా ఇక్కడే జగన్ తో పోలిక తెస్తున్నారు జనాలు. నిజానికి జగన్ కు కూడా పెట్రోలు, డీజల్ ధరలు తగ్గించే ఉద్దశ్యం ఉన్నట్లు లేదు. అయితే ఆ విషయాన్ని డైరెక్టుగా మీడియా సమావేశం పెట్టి చెబితే బాగుంటుంది. తాను చెప్పకపోయినా మంత్రులతో అయినా చెప్పించాలి. కానీ జగన్ ఆపని చేయకుండా రెండు దినపత్రికల్లో అనవసరంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. అది కూడా డొంకతిరుగుడుగానే ఉంది. సూటిగా ప్రభుత్వ వాదన ఏమిటి అనేది కేసీయార్ చెప్పినట్లు స్పష్టంగా లేదు.

నిజానికి పెట్రోలు, డీజల్ ధరలు తగ్గించేది లేదని కేసీయార్ చెప్పినట్లుగానే జగన్ కూడా చెప్పవచ్చు. ప్రభుత్వ స్టాండ్ ఏమిటనే విషయాన్ని జనాలకు వివరించి చెప్పటంలో తప్పేలేదు. జగన్ చెప్పదలచుకున్నది జగన్ చెబితే జనాలు అర్ధంచేసుకునేది జనాలు అర్ధం చేసుకుంటారు. పెట్రోలు, డీజల్ ధరలు తగ్గించేది లేదని కేసీయార్ స్పష్టంగా చెప్పినపుడు జగన్ మాత్రం ఎందుకు చెప్పలేరు ? ప్రకటనల రూపంలో ప్రభుత్వం నిధులను వృధా చేసేకన్నా మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలను వివరిస్తే జనాలే అర్ధం చేసుకుంటారు. మరి జగన్ అంత ధైర్యం చేయగలరా ?

This post was last modified on November 8, 2021 7:00 pm

Share

Recent Posts

జగన్ ఎలా అంటే కేటీఆర్ కూడా అలానే

జగన్ ఇటీవ‌ల కాలంలో స‌హ‌నం కోల్పోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న పార్టీ వారిపై కేసులు పెట్టినా.. త‌మ…

2 hours ago

అంజికి ఒడిస్సికి కనెక్షన్ ఏంటి

అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…

2 hours ago

బుట్టబొమ్మకు ఏ ప్రయోజనం లేదు

బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…

3 hours ago

ఏడున్న‌ర గంట‌ల‌పాటు నిల‌బ‌డిన లోకేష్‌

ఒక గంట నిల‌బ‌డేందుకే ఇబ్బంది ప‌డ‌తాం. అలాంటిది ఏకంగా ఏడున్న‌ర‌గంట‌ల పాటు ఏక‌బిగిన నిల‌బ‌డ‌డం అంటే మాట‌లా? ఊహించేందుకే క‌ష్ట‌మైన…

3 hours ago

కనకవర్షం కురవాల్సిందే కనకరాజూ

కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…

4 hours ago

అంబటి నోటి దురుసు తగ్గేలా లేదు

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…

5 hours ago