సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సైడ్ చేసినట్లేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇన్చార్జిగా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును చంద్రబాబునాయుడు నియమించారు. జిల్లాలో ఎంతోమంది సీనియర్లుండగా, సోమిరెడ్డి యాక్టివ్ గానే ఉన్నప్పటికీ ప్రత్యేకించి అచ్చెన్నను ఇన్చార్జిగా నియమించాల్సిన అవసరం ఏమిటి ?
నిజానికి అచ్చెన్న నెల్లూరు జిల్లాలో చేయగలిగింది కూడా ఏమీలేదు. స్ధానిక నేతలు సోమిరెడ్డి, బీద రవిచంద్రయాదవ్ లాంటి అనేకమంది సీనియర్లున్నారు. వీరంతా పార్టీ అధికారంలో ఉన్నపుడు అపరిమితమైన అధికారాలను అనుభవించినవారే. అలాంటిది ఇపుడు హఠాత్తుగా అచ్చెన్నను ఎందుకు నియమించారంటే నెల్లూరు కార్పొరేషన్ను గెలిచి తీరాలన్న పట్టుదల వల్లే అని చెప్పవచ్చు. పట్టుదలుంటే ఎన్నికలో గెలవటం సాధ్యం కాదు. అందుకు తగ్గ వ్యూహాలను అమలు చేయాలి.
ఏ పార్టీకైనా క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతును కూడగట్టుకున్నపుడు మాత్రమే గెలుపు అవకాశాలుంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే జిల్లాలోని పదికి పది అసెంబ్లీ సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. నెల్లూరు ఎంపీ సీటును కూడా అధికారపార్టీయే గెలిచింది. అప్పటినుండి జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా వైసీపీదే ఆధిపత్యం. పంచాయితీలు, పరిషత్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కూడా దాదాపు స్వీప్ చేసినట్లే. ఈ ఎన్నికల్లో మొత్తం సోమిరెడ్డే బాధ్యతలు తీసుకున్నారు.
అయితే ఏ ఎన్నికల్లో కూడా సోమిరెడ్డి ప్రభావం కనబడలేదు. దాంతో సోమిరెడ్డి నాయకత్వం మీద చంద్రబాబుకు నమ్మకం పోయినట్లుంది. అందుకనే ప్రత్యేకించి అచ్చెన్నాయుడును నెల్లూరు ఎన్నికకు ఇన్చార్జిగా నియమించారు. మరి అచ్చెన్న ఏమి చేయగలరు ? అచ్చెన్నను ఇన్చార్జిగా నియమించినంత మాత్రాన టీడీపీ తలరాత మారిపోతుందా ? ఏమో చెప్పలేము. ముందు తమ్ముళ్ళల్లో ఐకమత్యం సాధించాలి.
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చాలా జిల్లాల్లో తమ్ముళ్ళల్లో ఆధిపత్య గొడవలు జరుగుతునే ఉన్నాయి. ముందు ఆ గొడవలన్నింటినీ సర్దుబాటు చేసి ఏకతాటిపైకి తేవాలి. ఇక నెల్లూరు జిల్లా నేతలు ఏ మేరకు అచ్చెన్న మాటను ఏమి వింటారు ? ఈ పరిస్దితుల్లో నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.…
వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…
కొలువులు అడిగితే యువతను పోలీసులతో కొట్టిస్తున్నారని.. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి…