తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత.. విషయంలో ఎప్పటికప్పుడు.. ఆశ్చర్యకర సంఘటన లు జరుగుతూనే ఉన్నాయి. ఆమె మరణించి.. ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ.. కొన్ని కొన్ని విషయాలు జయ చుట్టూనే గిరిగిర లాడుతున్నాయి. ముఖ్యంగా వేల కోట్ల రూపాయల జయ సంపదను.. సొంతం చేసుకు నేందుకు పలువురు ప్రయత్నించిన ఉదంతాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమెకు నేనే కుమార్తెనంటూ.. ఇప్పటికే పలువురు తెరమీదికి వచ్చారు. వీరిలో ఒకరు ఏకంగా ఆధారాలు సమర్పిస్తే.. మరొకరు.. వీలునా మా.. అంటూ.. గత ఏడాది హడావుడి చేశారు.
అయితే.. ఇవన్నీ.. కూడా కోర్టు విచారణలో వీగిపోయాయి. అయితే.. తాజాగా ఇన్నాళ్లకు మరో మహిళ.. నేనే జయలలిత కుమార్తెనంటూ..తెరమీదకి వచ్చారు. చెన్నైలోని పల్లావరం ప్రాంతానికి చెందిన ఆమె.. తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ.. చూపించారు. తన పేరు ప్రేమ అని, పల్లావరం ప్రాంతంలో ఉంటున్నా నని.. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు తాను కుమార్తెనని చెప్పుకొచ్చారు. తొలుత.. మెరినాలోని జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన ఆమె.. అనంతరం.. మీడియాతోనూ మాట్లాడారు.
నేను మైసూరులో పుట్టాను. చెన్నైలో 30 ఏళ్లకు పైగానే ఉంటున్నాను. నేను జయలలిత కుమార్తెను అని చెప్పడానికి నా దగ్గర చాలానే ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు.. వాటిని బయట పెడతా అని చెప్పుకొచ్చారు. త్వరలోనే తాను జయ సన్నిహితురాలు.. శశికళను కలుస్తానని చెప్పారు. తనను పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులు.. మృతి చెందినట్టు తెలిపారు. జయ లలిత తనను బేబీ అని పిలిచేదని.. అపోలో ఆసుపత్రిలో జయలలితం చికిత్స పొందుతున్న సమయంలో తాను.. ఆసుపత్రి వెనుక మార్గం నుంచి వెళ్లి.. ఆమెను పరామర్శించినట్టు ప్రేమ తెలిపింది.
అంతేకాదు.. జయలలిత సహాయకుడు.. ముత్తు స్వామికి ఈ విషయాలు తెలుసునని ఆమె పేర్కొంది. ఆ సమయంలో జయ తనకు ముద్దు కూడా పెట్టినట్టు ప్రేమ తెలిపింది. అంతేకాదు.. జయ కోరిక మేరకు ఒకసారి తాను పోయెస్ గార్డెన్కు కూడా వెళ్లినట్టు ప్రేమ చెప్పడం గమనార్హం. అయితే.. ప్రస్తుతం ఇప్పటికే ఇద్దరి నుంచి ముగ్గురు.. జయ తమ తల్లే అంటూ.. రావడం.. కోర్టుకు కూడా వెళ్లడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ప్రేమ వ్యవహారం.. ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on November 8, 2021 11:23 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…