తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత.. విషయంలో ఎప్పటికప్పుడు.. ఆశ్చర్యకర సంఘటన లు జరుగుతూనే ఉన్నాయి. ఆమె మరణించి.. ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ.. కొన్ని కొన్ని విషయాలు జయ చుట్టూనే గిరిగిర లాడుతున్నాయి. ముఖ్యంగా వేల కోట్ల రూపాయల జయ సంపదను.. సొంతం చేసుకు నేందుకు పలువురు ప్రయత్నించిన ఉదంతాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమెకు నేనే కుమార్తెనంటూ.. ఇప్పటికే పలువురు తెరమీదికి వచ్చారు. వీరిలో ఒకరు ఏకంగా ఆధారాలు సమర్పిస్తే.. మరొకరు.. వీలునా మా.. అంటూ.. గత ఏడాది హడావుడి చేశారు.
అయితే.. ఇవన్నీ.. కూడా కోర్టు విచారణలో వీగిపోయాయి. అయితే.. తాజాగా ఇన్నాళ్లకు మరో మహిళ.. నేనే జయలలిత కుమార్తెనంటూ..తెరమీదకి వచ్చారు. చెన్నైలోని పల్లావరం ప్రాంతానికి చెందిన ఆమె.. తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ.. చూపించారు. తన పేరు ప్రేమ అని, పల్లావరం ప్రాంతంలో ఉంటున్నా నని.. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు తాను కుమార్తెనని చెప్పుకొచ్చారు. తొలుత.. మెరినాలోని జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన ఆమె.. అనంతరం.. మీడియాతోనూ మాట్లాడారు.
నేను మైసూరులో పుట్టాను. చెన్నైలో 30 ఏళ్లకు పైగానే ఉంటున్నాను. నేను జయలలిత కుమార్తెను అని చెప్పడానికి నా దగ్గర చాలానే ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు.. వాటిని బయట పెడతా అని చెప్పుకొచ్చారు. త్వరలోనే తాను జయ సన్నిహితురాలు.. శశికళను కలుస్తానని చెప్పారు. తనను పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులు.. మృతి చెందినట్టు తెలిపారు. జయ లలిత తనను బేబీ అని పిలిచేదని.. అపోలో ఆసుపత్రిలో జయలలితం చికిత్స పొందుతున్న సమయంలో తాను.. ఆసుపత్రి వెనుక మార్గం నుంచి వెళ్లి.. ఆమెను పరామర్శించినట్టు ప్రేమ తెలిపింది.
అంతేకాదు.. జయలలిత సహాయకుడు.. ముత్తు స్వామికి ఈ విషయాలు తెలుసునని ఆమె పేర్కొంది. ఆ సమయంలో జయ తనకు ముద్దు కూడా పెట్టినట్టు ప్రేమ తెలిపింది. అంతేకాదు.. జయ కోరిక మేరకు ఒకసారి తాను పోయెస్ గార్డెన్కు కూడా వెళ్లినట్టు ప్రేమ చెప్పడం గమనార్హం. అయితే.. ప్రస్తుతం ఇప్పటికే ఇద్దరి నుంచి ముగ్గురు.. జయ తమ తల్లే అంటూ.. రావడం.. కోర్టుకు కూడా వెళ్లడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ప్రేమ వ్యవహారం.. ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on November 8, 2021 11:23 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…