Political News

ఉప ఎన్నికల దెబ్బేనా ?

దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాల దెబ్బ నరంద్ర మోడిపై బాగానే పనిచేసినట్లుంది. పెట్రోలుపై లీటరుకు రు. 5, డీజిల్ పై లీటరుకు రు. 10 తగ్గించటమంటే మామూలు విషయం కాదు. నిజానికి తగ్గించింది చాలా తక్కువనే చెప్పాలి. అయినప్పటికీ ఈ తగ్గింపు కూడా తగ్గించటానికి నరేంద్ర మోడి ఏమాత్రం ఇష్టపడలేదు. దేశవ్యాప్తంగా జరిగిన 29 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 22 నియోజకవర్గాల్లో ఓడిపోయింది. అలాగే 3 పార్లమెంటు సీట్లలో రెండు చోట్ల ఓడిపోయింది.

కమలం పార్టీ ఓడిపోయిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ సిట్టింగ్ సీట్లు కూడా ఉన్నాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పటికీ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఓడిపోయింది. ఇదే సమయంలో వచ్చే మార్చిలోగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా జనాల్లో మోడి పాలనపై వ్యతిరేకత పెరిగిపోతోందన్నది వాస్తవం. గడచిన ఏడాది నుండి పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించమని జనాలు ఎంత మొత్తుకున్నా మోడీ ఏ మాత్రం పట్టించుకోలేదు.

ఉపఎన్నికల ఫలితాల్లో ఓడిపోయిన వెంటనే పెట్రోల్, డీజల్ ధరలను కేంద్రం తగ్గించిందంటేనే ఉపఎన్నికల దెబ్బ ఏ స్ధాయిలో పడిందో అర్ధమవుతోంది. పైగా తగ్గించిన ధరలు దీపావళి కానుకంటు ఊదరగొడుతోంది. దీపావళి పండగకన్నా ముందు చాలా పండగలు వచ్చినా మోడీ ఆ పండగలను ఏమాత్రం పట్టించుకోలేదు. కేంద్రం తాజా నిర్ణయం వల్ల పెట్రోల్ ఎక్సైజ్ డ్యూటీ రు. 27.90కి తగ్గింది. అలాగే డీజిల్ ఎక్సైజ్ డ్యూటీ రు. 21.80కి తగ్గింది.

ఇంధనాల మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గడం వల్ల నెలకు రు. 8700 కోట్లు, ఏడాదికి సుమారు లక్ష కోట్ల రూపాయల ఆదాయం తగ్గినట్లయ్యింది. మరి కేంద్రం తగ్గింపుకు రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గిస్తే పెట్రోల్, డీజల్ ధరలు ఇంకా తగ్గుతాయనటంలో సందేహంలేదు. కేంద్రం నిర్ణయం వెలుగుచూడగానే త్రిపుర, గోవా, కర్ణాటక, అస్సాం, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని వ్యాట్ ను కాస్త తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించాయి కాబట్టి మిగిలిన రాష్ట్రాలు కూడా తగ్గించే అవకాశం ఉంది.

మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ధరలు పెంచటమే కానీ తగ్గించటమంటు లేదు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ లీటరు ధరలు సెంచరీ దాటేశాయి. ఇంధనాల ధరలు తగ్గించిన కారణంగా రైతులుకు, మామూలు జనాలకు బాగా ప్రయోజనముంటుంది. ఎలాగంటే ఇంధనం ధరలు తగ్గించడం వల్ల వస్తురవాణా తదితరాల ఖర్చులన్నీ తగ్గుతాయి. దీనివల్ల అంతిమంగా ప్రజలకు ఉపయోగమే అని అందరికీ తెలిసిందే. కాకపోతే అంతర్జాతీయంగా పెట్రోల్, డీజల్ బ్యారెల్ ధరలతో పోల్చితే మనదేశంలోని ధరలు చాలా చాలా ఎక్కువగానే ఉంటున్నాయి.

This post was last modified on November 4, 2021 10:43 pm

Share

Recent Posts

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

10 minutes ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

1 hour ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

3 hours ago

ర‌వితేజ‌కు పుత్రికోత్సాహం

స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మార‌డం మామూలే. అమ్మాయిలు మాత్రం హీరోయిన్లు కావ‌డం అరుదు. ఐతే సినీ…

4 hours ago

అర్జున్ రెడ్డిని ఆదుకున్న మామిడి తోట‌

న‌టుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ద‌ర్శ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్ల‌ను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్ట‌ర్ అనే…

7 hours ago

ఆర్జీవీకి శివ నిర్వాణ కూలర్ బాయ్

ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…

8 hours ago