Political News

టీడీపీ ముందు జాగ్రత్త పడుతోందా ?

స్ధానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ముందు జాగ్రత్త పడుతున్నట్లే ఉంది. నామినేషన్లు వేయబోయే తమ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని స్టేట్ ఎలక్షన్ కమీషన్ కు కొన్ని సూచనలు చేసింది. ఇందులో ప్రధానమైనది ఏమిటంటే ఆన్ లైన్లో నామినేషన్లు సబ్మిట్ చేసే సౌకర్యం కల్పించటం. ఆ మధ్య జరిగిన స్ధానిక ఎన్నికల్లో కొన్నిచోట్ల తమ అభ్యర్థులను అధికార వైసీపీ నేతలు నామినేషన్లు కూడా వేయనీయలేదని ఆరోపించింది. కొందరు నేతలతో కొందరు అధికారులు కుమ్మక్కైనందు వల్లే తమ అభ్యర్ధులు ఇబ్బందులు పడినట్లు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కమీషన్ కు లేఖ రాశారు.

నిజంగా టీడీపీ చేసిన ఈ సూచన చాలా మంచిదే. నామినేషన్లు సమర్పిచే సమయంలో అధికారంలో ఉన్న కొందరు నేతలు ప్రత్యర్ధులను ఇబ్బందులు పెట్టే అవకాశాలున్నాయి. కాబట్టి ఆన్ లైన్లో నామినేషన్లను సబ్మిట్ చేసే సౌకర్యం కల్పించంటం మంచిదే. కుల ధృవీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన వెంటనే ఇచ్చేలా అధికారులకు కమీషన్ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నామినేషన్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.

అభ్యర్ధుల నామినేషన్ పత్రాలపై ప్రతి పేజీలోను అధికారులు సంతకాలు చేసి అభ్యర్ధులకు ఎక్నాలెడ్జిమెంట్ ఇవ్వాలని అడిగారు. బెదిరింపులు, సంతకాల ఫోర్జరీ లేకుండా అభ్యర్ధులే వచ్చి సాక్ష్యుల సమక్షంలో తమ నామినేషన్ను ఉపసంహరించుకునే నిబంధన పాటించాలన్నారు. వాలంటీర్లు ప్రచారం చేస్తే సదరు అభ్యర్ధిని పోటీనుండి డీబార్ చేయాలని డిమాండ్ చేశారు. నామినేషన్ల పరిశీలన అందరి అభ్యర్ధుల ముందే చేయాలన్నారు. కోవిడ్ సమస్యను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచాలని అడిగారు.

టీడీపీ చేసిన సూచనల్లో చాలావరకు ఆచరించదగ్గవనటంలో ఎలాంటి సందేహంలేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఇలాంటి సూచనలేవీ చేయలేదు. తాము అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాల అభ్యర్ధుల నామినేషన్ల సందర్భంగా ఎంత గొడవ చేశామో మరచిపోయినట్లున్నారు.

This post was last modified on November 4, 2021 10:26 pm

Share

Recent Posts

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

13 seconds ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

21 minutes ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

1 hour ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

2 hours ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

2 hours ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

2 hours ago