Political News

టీడీపీ ముందు జాగ్రత్త పడుతోందా ?

స్ధానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ముందు జాగ్రత్త పడుతున్నట్లే ఉంది. నామినేషన్లు వేయబోయే తమ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని స్టేట్ ఎలక్షన్ కమీషన్ కు కొన్ని సూచనలు చేసింది. ఇందులో ప్రధానమైనది ఏమిటంటే ఆన్ లైన్లో నామినేషన్లు సబ్మిట్ చేసే సౌకర్యం కల్పించటం. ఆ మధ్య జరిగిన స్ధానిక ఎన్నికల్లో కొన్నిచోట్ల తమ అభ్యర్థులను అధికార వైసీపీ నేతలు నామినేషన్లు కూడా వేయనీయలేదని ఆరోపించింది. కొందరు నేతలతో కొందరు అధికారులు కుమ్మక్కైనందు వల్లే తమ అభ్యర్ధులు ఇబ్బందులు పడినట్లు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కమీషన్ కు లేఖ రాశారు.

నిజంగా టీడీపీ చేసిన ఈ సూచన చాలా మంచిదే. నామినేషన్లు సమర్పిచే సమయంలో అధికారంలో ఉన్న కొందరు నేతలు ప్రత్యర్ధులను ఇబ్బందులు పెట్టే అవకాశాలున్నాయి. కాబట్టి ఆన్ లైన్లో నామినేషన్లను సబ్మిట్ చేసే సౌకర్యం కల్పించంటం మంచిదే. కుల ధృవీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన వెంటనే ఇచ్చేలా అధికారులకు కమీషన్ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నామినేషన్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.

అభ్యర్ధుల నామినేషన్ పత్రాలపై ప్రతి పేజీలోను అధికారులు సంతకాలు చేసి అభ్యర్ధులకు ఎక్నాలెడ్జిమెంట్ ఇవ్వాలని అడిగారు. బెదిరింపులు, సంతకాల ఫోర్జరీ లేకుండా అభ్యర్ధులే వచ్చి సాక్ష్యుల సమక్షంలో తమ నామినేషన్ను ఉపసంహరించుకునే నిబంధన పాటించాలన్నారు. వాలంటీర్లు ప్రచారం చేస్తే సదరు అభ్యర్ధిని పోటీనుండి డీబార్ చేయాలని డిమాండ్ చేశారు. నామినేషన్ల పరిశీలన అందరి అభ్యర్ధుల ముందే చేయాలన్నారు. కోవిడ్ సమస్యను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచాలని అడిగారు.

టీడీపీ చేసిన సూచనల్లో చాలావరకు ఆచరించదగ్గవనటంలో ఎలాంటి సందేహంలేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఇలాంటి సూచనలేవీ చేయలేదు. తాము అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాల అభ్యర్ధుల నామినేషన్ల సందర్భంగా ఎంత గొడవ చేశామో మరచిపోయినట్లున్నారు.

This post was last modified on November 4, 2021 10:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

థియేటర్ల ఆకలి తీర్చే ఆహారం ఎక్కడ

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…

23 minutes ago

MRP టీజర్ – వినోదంతో నిండిన వినూత్నమైన కథ!

https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…

1 hour ago

పెద్ది అయోమయం… సంయుక్తనా శృతినా

జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…

2 hours ago

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు ఇక లేరు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…

2 hours ago

వైసీపీ అనంతబాబు కథ ముగిసినట్టేనా?

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…

3 hours ago

నయనతార ఛాయిస్ ఎందుకు మారింది

ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…

4 hours ago