Political News

సంచలనం- 2200 మంది తబ్లిగి సభ్యులపై నిషేధం

భారతదేశంలో కరోనా సూపర్ స్ప్రెడర్ లా మారిన తబ్లిగి సంస్థపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. ఈ సంస్థకు చెందిన 2200 మంది సభ్యులపై పదేళ్ల పాటు ఇండియాలో పర్యటించడాన్ని నిషేధించింది. దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చడానికి తబ్లిగి జమాతే ప్రధాన కారణంగా భారత ప్రభుత్వం భావించింది. పర్యాటక వీసాపై వచ్చి నిబంధనలకు విరుద్ధంగా మత సమావేశాలకు హాజరైన తబ్లిగీలపై కేంద్రం కఠినంగా వ్యవహరించింది.

మర్కజ్ తబ్లిగి ఘటన బయటపడక ముందు చాలా త్వరగా కరోనా వ్యాప్తిని గుర్తించి ఇండియాలో లాక్ డౌన్ పెట్టడంపై ప్రపంచమంతటా ఇండియాను ప్రశంసించింది. అయితే… సడెన్ గా తబ్లిగి జమాత్ తెరపైకి రావడంతో సమీకరణాలే మారిపోయాయి. ఒక్కసారిగా ఇండియాలో కేసులు పెరగడం మొదలైంది. అప్పటి నుంచి నేటి వరకు ఇక కేసులు పెరగడమే కానీ తగ్గడం కనిపించలేదు.

మార్చి తొలి రెండు వారాల్లో ఢిల్లీలోని నిజాముద్దీన్ లో తబ్లిగి జమాత్ సమావేశం జరిగింది. వివిధ దేశాల నుంచి కరోనాతో దీనికి అయిన హాజరైన వందలాది విదేశీ తబ్లిగీల ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన భారతీయులకు ఇది సోకింది. పెద్ద సంఖ్యలో హాజరైన వారికి సరైన మౌలిక వసతులు లేకపోవడంతో ఎక్కువ మందికి ఈ సమావేశంలో కరోనా సోకింది. వారు అక్కడి నుంచి అన్ని రాష్ట్రాలకు తిరిగి వెళ్లారు. చాలా మందికి పది రోజుల తర్వాత గాని తమకు కరోనా ఉన్న విషయం తెలియని పరిస్థితి.

విదేశాల నుంచి వచ్చిన వారు కేవల ఢిల్లీ సమావేశంలో పాల్గొనడమే కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాల్లోని మసీదులకు వెళ్లి సమావేశాలు పెట్టారు. మొత్తంగా ఈ విదేశీ తబ్లిగీలు పెద్ద సంఖ్యలో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి కారణం అయ్యారు. వారందరని రకరకాల కోణాల్లో పరిశోధించి పట్టుకున్న కేంద్రం వారిని బ్లాక్ లిస్టులో పెట్టింది. పదేళ్లు వాళ్లు ఇండియాలో పర్యటించడానికి వీలు లేకుండా నిషేధిం విధించింది.

This post was last modified on June 5, 2020 2:13 am

Share
Show comments
Published by
suman

Recent Posts

స్టాలిన్ కు ఇచ్చి పడేసిన పవన్

జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…

1 hour ago

ఛావాకు రెండో బ్రేక్ పడింది

మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…

2 hours ago

ఖైదీ 2 ఎప్పుడు రావొచ్చంటే

సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…

2 hours ago

దాశరథి, గద్దర్, శ్రీపతి రాములు.. ఎందరెందరో..?

జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…

4 hours ago

భయం లేదు కాబట్టే… బద్దలు కొట్టాం: పవన్ కల్యాణ్

భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…

4 hours ago

11వ ఆవిర్భావం పూర్తి.. 11 స్థానాల‌కు ప‌రిమితం!: ప‌వ‌న్ కల్యాణ్‌

భార‌త దేశానికి బ‌హుభాషే మంచిద‌ని జ‌న‌సేన అధినేత, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జ‌రిగిన…

4 hours ago