Political News

సంచలనం- 2200 మంది తబ్లిగి సభ్యులపై నిషేధం

భారతదేశంలో కరోనా సూపర్ స్ప్రెడర్ లా మారిన తబ్లిగి సంస్థపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. ఈ సంస్థకు చెందిన 2200 మంది సభ్యులపై పదేళ్ల పాటు ఇండియాలో పర్యటించడాన్ని నిషేధించింది. దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చడానికి తబ్లిగి జమాతే ప్రధాన కారణంగా భారత ప్రభుత్వం భావించింది. పర్యాటక వీసాపై వచ్చి నిబంధనలకు విరుద్ధంగా మత సమావేశాలకు హాజరైన తబ్లిగీలపై కేంద్రం కఠినంగా వ్యవహరించింది.

మర్కజ్ తబ్లిగి ఘటన బయటపడక ముందు చాలా త్వరగా కరోనా వ్యాప్తిని గుర్తించి ఇండియాలో లాక్ డౌన్ పెట్టడంపై ప్రపంచమంతటా ఇండియాను ప్రశంసించింది. అయితే… సడెన్ గా తబ్లిగి జమాత్ తెరపైకి రావడంతో సమీకరణాలే మారిపోయాయి. ఒక్కసారిగా ఇండియాలో కేసులు పెరగడం మొదలైంది. అప్పటి నుంచి నేటి వరకు ఇక కేసులు పెరగడమే కానీ తగ్గడం కనిపించలేదు.

మార్చి తొలి రెండు వారాల్లో ఢిల్లీలోని నిజాముద్దీన్ లో తబ్లిగి జమాత్ సమావేశం జరిగింది. వివిధ దేశాల నుంచి కరోనాతో దీనికి అయిన హాజరైన వందలాది విదేశీ తబ్లిగీల ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన భారతీయులకు ఇది సోకింది. పెద్ద సంఖ్యలో హాజరైన వారికి సరైన మౌలిక వసతులు లేకపోవడంతో ఎక్కువ మందికి ఈ సమావేశంలో కరోనా సోకింది. వారు అక్కడి నుంచి అన్ని రాష్ట్రాలకు తిరిగి వెళ్లారు. చాలా మందికి పది రోజుల తర్వాత గాని తమకు కరోనా ఉన్న విషయం తెలియని పరిస్థితి.

విదేశాల నుంచి వచ్చిన వారు కేవల ఢిల్లీ సమావేశంలో పాల్గొనడమే కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాల్లోని మసీదులకు వెళ్లి సమావేశాలు పెట్టారు. మొత్తంగా ఈ విదేశీ తబ్లిగీలు పెద్ద సంఖ్యలో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి కారణం అయ్యారు. వారందరని రకరకాల కోణాల్లో పరిశోధించి పట్టుకున్న కేంద్రం వారిని బ్లాక్ లిస్టులో పెట్టింది. పదేళ్లు వాళ్లు ఇండియాలో పర్యటించడానికి వీలు లేకుండా నిషేధిం విధించింది.

This post was last modified on June 5, 2020 2:13 am

Share
Show comments
Published by
suman

Recent Posts

మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో నిర్మాత?

టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…

2 hours ago

ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…

4 hours ago

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

5 hours ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

6 hours ago

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

7 hours ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

7 hours ago