Political News

వైసీపీ-టీడీపీ విషయంలో బీజేపీ వ్యూహమిదేనా ?

ఇటు క్షేత్రస్ధాయిలోను అటు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లే అనిపిస్తోంది. ఇటు వైసీపీ అటు టీడీపీతో వ్యూహాత్మకంగా సమదూరం పాటించాలన్నదే కమలం పార్టీ వ్యూహంగా కనబడుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ దెబ్బ తిన్న దగ్గర నుండి రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను బీజేపీ అగ్రనేతలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నట్లు సమాచారం.

గడచిన రెండున్నరేళ్ళుగా జగన్ ప్రభుత్వంపై చంద్రబాబునాయుడు ఆయన పార్టీ నేతలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. పార్టీ నేతలు మాత్రమే జగన్ ప్రభుత్వంపై ఎంతగా బురద చల్లిస్తున్నారో అందరు చూస్తున్నదే. ఇది కాకుండా అనేకసార్లు జగన్ ప్రభుత్వంపై టీడీపీ అనేక ఫిర్యాదులు చేసింది. అలాగే వైసీపీ కూడా టీడీపీపై అనేక ఫిర్యాదులు చేసింది.

తాజాగా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజమని, డ్రగ్ స్టేట్ అని చంద్రబాబు ఏకంగా ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వాన్ని రద్దుచేయమని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంగా వైసీపీ ఎంపీలు టీడీపీ గుర్తును రద్దుచేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. తర్వాత ఎంపీ గోరంట్ల మాధవ్ మాజీ సీఎంపై అనేక ఫిర్యాదులు చేశారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే రెండు పార్టీల్లో ఎవరు దేనిపైన ఫిర్యాదు చేసినా కేంద్ర హోంశాఖ అమిత్ షా వింటున్నారంతే.

చంద్రబాబుకు షా అపాయిట్మెంట్ ఇవ్వలేకపోయినా ఫోన్ లో మాట్లాడారు, తర్వాత టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ వైసీపీ ప్రభుత్వంపై చేసిన ఫిర్యాదును విన్నారు. అంటే ఏమర్ధం అవుతున్నదంటే రెండు పార్టీలతో బీజేపీ సమదూరం పాటించటం ద్వారా వైసీపీ-టీడీపీలు ఇంకా బాగా కొట్టుకోవాలని బీజేపీ ఆశిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే ఇపుడు ఏపీలో మూడో పార్టీకి అవకాశమే లేదు. పైగా ఇపుడు బీజేపీని జనాలెవరు పట్టించుకోవటంలేదు. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి పూర్తిగా దెబ్బతింటే కానీ మూడో పార్టీ లేచేందుకు అవకాశం లేదు.

టీడీపీకి తెలంగాణాలో పరిస్ధితే ఏపీలో కూడా రాబోతోందనే సంకేతాలు కనబడతున్నట్లు కమలనాదులు భావిస్తున్నారు. జగన్ చేతిలో టీడీపీ నేలకరవాలని బీజేపీ కోరుకుంటోంది. ఇక భవిష్యత్తులో టీడీపీ లేవదని నిర్ధారణ అయిన తర్వాత ఆ స్ధానాన్ని తాము భర్తీ చేయాలని బీజేపీ ఆశపడుతోంది. అందుకనే చంద్రబాబును దగ్గరకు తీసుకుని మళ్ళీ నిలబెట్టేందుకు ఇష్టపడటంలేదు. మరి బీజేపీ సమదూరం వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సిందే.

This post was last modified on November 6, 2021 6:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సైకో పోయినా… ఆ చేష్టలు మాత్రం పోలేదు

2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో కూటమి పార్టీలకు చెందిన శ్రేణుల నుంచి ఓ వినూత్న నినాదం వినిపించింది. సైకో…

48 minutes ago

మిక్కీ జె మేయర్…. మిస్సయ్యారా ప్లసయ్యారా

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ మీద జరిగిన రివ్యూలు, ఆన్ లైన్ విశ్లేషణలు, సోషల్…

49 minutes ago

మూడోసారి జత కట్టనున్న చిరు నయన్ ?

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే ఎంటర్ టైనర్ కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఏవేవో పేర్లు అనుకుని…

2 hours ago

పోలీసోళ్ల‌కూ చ‌లాన్లు ప‌డ్డాయ్‌.. 68 ల‌క్ష‌లు క‌ట్టాలె!!

"తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ విష‌యంలో క‌ఠినంగా ఉంటారు. ఖ‌చ్చితంగా ఉంటారు."- ఇదీ.. కొన్నిరోజుల కింద‌ట పోలీసు బాస్ చేసిన కామెంట్లు.…

3 hours ago

గుడ్ న్యూస్ : వీరమల్లు రాకకు దారి దొరికింది

ఎదురు చూసి చూసి అభిమానులే అంచనాలు తగ్గించేసుకున్న హరిహర వీరమల్లు గేరు మార్చబోతోందని తాజా సమాచారం. ఈ రోజు నుంచి…

3 hours ago

దిల్ రాజు చెప్పింది దర్శకులు ఆలోచించాలి

నిన్న జరిగిన లార్వెన్ ఏఐ స్టూడియో ప్రారంభోత్సవంలో దర్శకులను ఉద్దేశించి నిర్మాత దిల్ రాజు అన్న మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.…

4 hours ago