టీఆర్ఎస్ భయమే నిజమైంది. హుజురాబాద్ ఉప ఎన్నిక తొలిరౌండ్లో టీఆర్ఎస్కు ఇండిపెండెంట్ అభ్యర్థి షాక్ ఇచ్చారు. కారు గుర్తును పోలిన రొట్టెలపీట గుర్తుకు 112 ఓట్లు పోలయ్యాయి.
కారు గుర్తును పోలి ఉండటం కారణంగా తమకు నష్టం జరిగినట్లు టీఆర్ఎస్ నేతలు వాపోతున్నారు. అటు హుజురాబాద్ తొలి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలిరౌండ్లో ఈటెల రాజేందర్ 166 ఓట్లతో ముందజలో కొనసాగుతున్నారు.
ఉప ఎన్నిక ముందు టీఆర్ఎస్ రొట్టెల పీట, రోడ్డు రోలర్ను గుర్తులను చూసి భయపడింది. ఆ భయం నిజమైంది. రొట్టెపీట గుర్తుకు 112 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్లో బీజేపీ 166 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రొట్టెల పీట, రోడ్డు రోలర్ గుర్తులు గత ఎంపీ ఎన్నికల్లో, దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యాయి. హుజురాబాద్ మొదటి రౌండ్ లోనే రొట్టెల పీటకు 112 ఓట్లు వస్తే మిగతా రౌండ్స్ లో రొట్టెల పీట ప్రభావం ఎంత ఉంటుందో అని టీఆర్ఎస్ ఆందోళన చెందుతున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ 503 ఓట్లతో ఆధిక్యంలో నిలిచింది. మొదటి రౌండ్లో హుజురాబాద్ మండల ఓట్లను లెక్కించారు. ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు, 14 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పూర్తి ఫలితం వెలువడుతుందని అధికారులు చెబుతున్నారు.
This post was last modified on November 2, 2021 11:52 am
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ…
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…