Political News

అమ‌రావ‌తే గెలిచింది.. రైతుల‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ ప్ర‌భుత్వానికి అడుగ‌డుగునా.. అనేక ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఇక్క‌డ భూముల వ్యాపారం జ‌రిగింద‌ని.. ఓ సామాజిక వ‌ర్గానికే మేలు జ‌రిగేలా నిర్ణ‌యం తీసుకున్నార‌ని.. గ‌త టీడీపీ ప్ర‌భుత్వంపై వైసీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసి.. మూడు రాజ‌ధానుల‌కు రెడీ అయ్యారు. అయితే.. ఈ నిర్ణ‌యాల‌ను.. ఆరోప‌ణ‌ల‌ను.. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వ‌ర‌కు కొట్టేశాయి. తాజాగా.. అమ‌రావ‌తి మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకుంది. రాజ‌ధాని రైతుల‌కు హైకోర్టు నుంచి భారీ ఊర‌ట ల‌భించింది.

అమరావతి రైతులు త‌ల‌పెట్టిన మ‌హా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రైతులు నవంబర్‌ 1 నుంచి ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర’ కార్యక్రమాన్ని తలపెట్టారు. మొత్తం నాలుగు జిల్లాలు.. గుంటూరు, ప్ర‌కాశం, నెల్లూరు, చిత్తూరుల్లో రాజ‌దాని గ‌ళం వినిపించి.. శ్రీవారిని ద‌ర్శించుకుని.. ఆయ‌న‌కు మొర‌పెట్టుకునేందుకు రెడీ అయ్యారు. అయితే.. ఈ యాత్ర‌కు రాష్ట్ర ప్ర‌బుత్వం శాంతిభద్రతల పేరుతో మోకాల‌డ్డేందుకు ప్ర‌య‌త్నం చేసింది. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను బూచిగా చూపిస్తూ.. పాదయాత్రకు అనుమతి లేదని డీజీపీ ప్రకటించారు.అయితే..దీనిపై అమరావతి అన్న‌దాత‌ల జేఏసీ.. హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. రైతుల మహా పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పాద‌యాత్ర‌కు ఎలాగూ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌ద‌ని ముందుగానేఊహించిన రైతులు.. గ‌తంలోనే హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే.. పోలీసులు అనుమ‌తులు ఇవ్వ‌క‌పోతే.. కోర్టుకురావ‌చ్చ‌ని తెలిపింది. దీంతో నేతలు మ‌రోసారి హైకోర్టు ను ఆశ్రయించారు. అమరావతి రైతులు తలపెట్టిన పాదయాత్రకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో… జేఏసీ నేత‌లు హైకోర్టులో లంచ్‌ మోషన్ పిటిషన్ వేశారు. అమరావతి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేసేందుకు.. నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 17 వరకు పాదయాత్ర చేపట్టాలని రైతు జేఏసీ, అమరావతి పరిరక్షణ సమితి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర పేరిట కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారు.

డీజీపీకి మ‌రో దెబ్బ‌!

తాజా హైకోర్టు తీర్పుతో.. డీజీపీ గౌతం స‌వాంగ్‌కు మ‌రో భారీ దెబ్బ‌త‌గిలిన‌ట్టు అయింది. అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టిన మహా పాదయాత్ర వల్ల ఘర్షణలు, విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్ అన్నారు. అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు, ఇతర సమస్యలు తలెత్తకుండా చూసేందుకు దీనికి అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుదారైన అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు ఈ మేరకు లేఖ రాశారు. పార్టీల పరంగా చీలిపోయిన గ్రామాల మీదుగా ఈ యాత్ర సాగినప్పుడు అక్కడి పరిణామాలు ఘర్షణలకు దారితీయొచ్చని, అప్పుడు శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని ఆ లేఖలో తెలిపారు. అయితే.. ఈ పోలీసుల వాద‌న‌ను హైకోర్టు తోసిపుచ్చి.. పాద‌యాత్ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

This post was last modified on October 29, 2021 8:57 pm

Share

Recent Posts

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

42 minutes ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

2 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

3 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

4 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

4 hours ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

5 hours ago