సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో పలు పరిణామాలు వివాదాస్పదమవ్వడం చర్చనీయాంశమైంది. ఓ పక్క టీటీడీని మరింత అభివృద్ధి చేసేందుకు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ నూతన పాలక మండలి కసరత్తు చేస్తుండగా…..మరో పక్క వరుస వివాదాలు టీటీడీని వెంటాడుతున్నాయి.
తిరుమలలో ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం మొదలుకొని…టీటీడీ భూముల వేలంపాట, సప్తగిరి మాసపత్రికలో లవకుశ కథ వరకు పలు వివాదాలు టీటీడీని చుట్టుముట్టాయి.
ఇక, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ సినీ నటుడు పృథ్వీ ఆడియోటేపు వ్యవహారం పెను దుమారం రేపింది. టీటీడీకి చెందిన ఆస్తుల వేలం వ్యవహారం వివాదాస్పదం కావడంతో….టీటీడీ ఆస్తుల వేలంపై ఏకంగా నిషేధం విధించాల్సి వచ్చింది. దీంతోపాటు, లడ్డూ ప్రసాద విక్రయం వివాదం….చర్చనీయాంశమైంది.
మరోవైపు, జగన్ అధికారం చేపట్టిన తర్వాత వరుసగా టీటీడీలో వివాదాలు చెలరేగడంతో జగన్ ప్రభుత్వం హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నడుచుకుంటోందని పలువురు విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీటీడీలో జరుగుతున్న పరిణామాలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో కొంతమంది కోవర్టులుగా పనిచేస్తున్నారన్న అనుమానాలను వైవీ వ్యక్తం చేస్తున్నారు. లవకుశ కథ వివాదం తాజాగా ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా పలువురు రామ భక్తుల మనోభావాలను ఆ కథ దెబ్బతీసింది.
దీంతో, ఆ విషయంపై ఆగ్రహంతో ఉన్న వైవీ….ఆ కథ వ్యవహారంలో చర్యలకు ఆదేశించారు. సంబంధిత ఎడిటర్పై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతర్గతంగా దేవాలయ ప్రతిష్ఠను కించపరిచేందుకు, హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు కారణమవుతున్న వారిపై చర్యలకు ప్రత్యేక కమిటీ వేశామని చెప్పారు. కొంతమంది కావాలనే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని, వారిపై ఫోకస్ చేస్తున్నామని చెప్పారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించబోమని,చెప్పారు.
This post was last modified on June 4, 2020 1:29 pm
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…