సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో పలు పరిణామాలు వివాదాస్పదమవ్వడం చర్చనీయాంశమైంది. ఓ పక్క టీటీడీని మరింత అభివృద్ధి చేసేందుకు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ నూతన పాలక మండలి కసరత్తు చేస్తుండగా…..మరో పక్క వరుస వివాదాలు టీటీడీని వెంటాడుతున్నాయి.
తిరుమలలో ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం మొదలుకొని…టీటీడీ భూముల వేలంపాట, సప్తగిరి మాసపత్రికలో లవకుశ కథ వరకు పలు వివాదాలు టీటీడీని చుట్టుముట్టాయి.
ఇక, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ సినీ నటుడు పృథ్వీ ఆడియోటేపు వ్యవహారం పెను దుమారం రేపింది. టీటీడీకి చెందిన ఆస్తుల వేలం వ్యవహారం వివాదాస్పదం కావడంతో….టీటీడీ ఆస్తుల వేలంపై ఏకంగా నిషేధం విధించాల్సి వచ్చింది. దీంతోపాటు, లడ్డూ ప్రసాద విక్రయం వివాదం….చర్చనీయాంశమైంది.
మరోవైపు, జగన్ అధికారం చేపట్టిన తర్వాత వరుసగా టీటీడీలో వివాదాలు చెలరేగడంతో జగన్ ప్రభుత్వం హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నడుచుకుంటోందని పలువురు విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీటీడీలో జరుగుతున్న పరిణామాలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో కొంతమంది కోవర్టులుగా పనిచేస్తున్నారన్న అనుమానాలను వైవీ వ్యక్తం చేస్తున్నారు. లవకుశ కథ వివాదం తాజాగా ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా పలువురు రామ భక్తుల మనోభావాలను ఆ కథ దెబ్బతీసింది.
దీంతో, ఆ విషయంపై ఆగ్రహంతో ఉన్న వైవీ….ఆ కథ వ్యవహారంలో చర్యలకు ఆదేశించారు. సంబంధిత ఎడిటర్పై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతర్గతంగా దేవాలయ ప్రతిష్ఠను కించపరిచేందుకు, హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు కారణమవుతున్న వారిపై చర్యలకు ప్రత్యేక కమిటీ వేశామని చెప్పారు. కొంతమంది కావాలనే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని, వారిపై ఫోకస్ చేస్తున్నామని చెప్పారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించబోమని,చెప్పారు.
This post was last modified on June 4, 2020 1:29 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…