బోసిడీకే.. ఇప్పుడీ పదం ఎక్కడ లేని ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి అర్థమేంటో తెలియకుండానే ఎప్పట్నుంచో తెలుగు జనాలు తెగ వాడేస్తున్నారు. సరదాగా తిట్టాల్సి వచ్చినపుడు ఈ మాటను ఉపయోగిస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం నేత పట్టాభిరామ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మాట అనడంతో పెద్ద దుమారమే రేగింది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ కార్యాలయాలు, అలాగే పట్టాభిరామ్ ఇంటిపై వైసీపీ శ్రేణులు భయానక రీతిలో దాడులు చేయడంతో.. ఆ తర్వాత టీడీపీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆందోళనలు చేపట్టడం.. మరోవైపు పట్టాభిరామ్ను పోలీసులు అరెస్టు చేయడం.. ఇలా చాలా పరిణామాలే చోటు చేసుకున్నాయి గత కొన్ని రోజుల్లో.
వైసీపీ వర్గాల దాడులు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా జగన్.. తననుద్దేశించి పట్టాభిరామ్ అన్న ‘బోసిడీకే’ అనే పదానికి ‘లం.. కొడుకు’ అనే అర్థం అంటూ ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమం మధ్యలో స్టేజ్ మీద చెప్పడం చర్చనీయాంశం అయింది.
జగన్ నోట ఈ పదం విన్నాక నిజంగా ఆ మాటకు ఆ అర్థం వస్తుందా అని ఇంటర్నెట్లో తెలుగు జనాలు ఆ పదానికి అసలర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా జగన్ అన్న అర్థమే వస్తుందనే సమాచారం అయితే ఇంటర్నెట్లో కనిపించడం లేదన్నది నెటిజన్లు చెబుతున్న మాట.
పైగా ఒక హిందీ పాట వీడియోలో ఈ పదాన్ని విరివిగా వాడటం గురించి ప్రస్తావిస్తున్నారు. నిజంగా అంత బూతు పదమే అయితే ఈ పాటలో అన్నిసార్లు ఆ పదాన్ని వాడేవాళ్లా.. ఇదొక తిట్టే అయ్యుండొచ్చు తప్ప, జగన్ అన్న అర్థం మాత్రం రాదు అంటూ కొందరు నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. ఈ పదం వాడిన హిందీ పాట మాత్రం సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది.
ఇంతకీ ‘బోసిడీకే’ అనే పదానికి అర్థం ఏంటన్నది హిందీ కూడా బాగా వచ్చిన వాళ్లు నిర్మాణాత్మకంగా వివరించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఈ పదానికి అర్థమేంటన్న దాన్ని బట్టి పట్టాభిరామ్ మీద కేసు నిలబడే అవకాశముంది.
This post was last modified on October 23, 2021 2:43 pm
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…