ఆ ఎమ్మెల్యే సీఎం జగన్ తర్వాత అత్యంత మెజార్టీతో విజయం సాధించారు. దీన్ని బట్టి సహజంగా మనం అక్కడ వైసీపీకి బలమైన పునాదులున్నాయని అనుకుంటాం. పార్టీకి బలమైన కేడర్ ఉంది అనుకుంటాం. కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యింది.
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ముతుమల అశోక్రెడ్డిపై వైసీపీ అభ్యర్థి అన్న రాంబాబుపై అక్షరాల 81520 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జగన్ తర్వాత వైసీపీకి అత్యధిక మెజారిటీ వచ్చింది ఇక్కడే. ఇలాంటి చోట టీడీపీకి వ్యతిరేకంగా ప్రజాగ్రహ దీక్ష నిర్వహిస్తే భారీ స్పందన సంగతి తర్వాత.. అసలు సగం కుర్చీలు కూడా నిండలేదు. జనం లేక వెలవెల పోయింది. దీక్ష కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. కానీ పట్టుమని పదిమంది కూడా దీక్షలో పాల్గొన లేదు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై జరిగిన దాడులకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. పోటీగా అధికార పార్టీ నేతలు కూడా ప్రజాగ్రహ దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షలకు కొన్ని ప్రాంతాల్లో మద్దతు వస్తోంది. కానీ చాలా ప్రాంతాల్లో జనం లేక వేదికలు బోసిపోతున్నాయి. మిగతా చోట్ల సరే. కానీ ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం భారీ మెజార్టీ వచ్చిన చోట ఇలా ఎందుకు జరిగిందని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
అక్కడి ఎమ్మెల్యే తీరే దీనికి కారణమా? లేక ప్రజల్లో మార్పు వచ్చిందా? లేకపోతే ప్రజాగ్రహ దీక్ష కాదు అది వైసీపీ రాజకీయ దీక్ష అని ప్రజలు అనుకున్నారా అన్నది తెలియడం లేదు. దీక్షలో ఖాళీ కుర్చీలు కనిపించడంతో పార్టీ నేతలు ఇన్ సల్ట్ గా ఫీలయ్యారు. ఈ కార్యక్రమ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
This post was last modified on October 23, 2021 10:50 am
జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా చాలా మంచి పేరు సంపాదించింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. లోకల్ హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం…
మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్తరాది అమ్మాయి పాయల్ రాజ్పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయల్…
ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…
ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన…
అక్కినేని నాగార్జున ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న తన వందో సినిమా కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. తమిళ దర్శకుడు…