Political News

జగన్ తర్వాత సెకండ్ హయ్యెస్ట్… వైసీపీకి జీరో స్పందన ఎందుకిలా?

ఆ ఎమ్మెల్యే సీఎం జగన్ తర్వాత అత్యంత మెజార్టీతో విజయం సాధించారు. దీన్ని బట్టి సహజంగా మనం అక్కడ వైసీపీకి బలమైన పునాదులున్నాయని అనుకుంటాం. పార్టీకి బలమైన కేడర్ ఉంది అనుకుంటాం. కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యింది.

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ముతుమల అశోక్‌రెడ్డిపై  వైసీపీ అభ్యర్థి అన్న రాంబాబుపై అక్షరాల 81520 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జగన్ తర్వాత వైసీపీకి అత్యధిక మెజారిటీ వచ్చింది ఇక్కడే. ఇలాంటి చోట టీడీపీకి వ్యతిరేకంగా ప్రజాగ్రహ దీక్ష నిర్వహిస్తే భారీ స్పందన సంగతి తర్వాత.. అసలు సగం కుర్చీలు కూడా నిండలేదు. జనం లేక వెలవెల పోయింది. దీక్ష కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. కానీ పట్టుమని పదిమంది కూడా దీక్షలో పాల్గొన లేదు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై జరిగిన దాడులకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. పోటీగా అధికార పార్టీ నేతలు కూడా ప్రజాగ్రహ దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షలకు కొన్ని ప్రాంతాల్లో మద్దతు వస్తోంది. కానీ చాలా ప్రాంతాల్లో జనం లేక వేదికలు బోసిపోతున్నాయి. మిగతా చోట్ల సరే. కానీ ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం భారీ మెజార్టీ వచ్చిన చోట ఇలా ఎందుకు జరిగిందని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

అక్కడి ఎమ్మెల్యే తీరే దీనికి కారణమా? లేక ప్రజల్లో మార్పు వచ్చిందా? లేకపోతే ప్రజాగ్రహ దీక్ష కాదు అది వైసీపీ రాజకీయ దీక్ష అని ప్రజలు అనుకున్నారా అన్నది తెలియడం లేదు. దీక్షలో ఖాళీ కుర్చీలు కనిపించడంతో పార్టీ నేతలు ఇన్ సల్ట్ గా ఫీలయ్యారు. ఈ కార్యక్రమ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

This post was last modified on October 23, 2021 10:50 am

Share
Show comments
Published by
satya

Recent Posts

సమీక్ష – ఆ ఒక్కటి అడక్కు

గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…

1 hour ago

మీనమేషాలు లెక్కబెడుతున్న భారతీయుడు 2

లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…

1 hour ago

వివేకా కేసులో సంచ‌ల‌నం.. అవినాష్‌కు ఊర‌ట‌

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డికేసులో తాజాగా సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…

3 hours ago

రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ !

లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…

3 hours ago

ముద్రగ‌డ ఫ్యామిలీలో క‌ల్లోలం.. ప‌వ‌న్‌కు జైకొట్టిన కుమార్తె

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఊహించ‌డం క‌ష్టం. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్తితే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న…

3 hours ago

అందమైన దెయ్యాలను పట్టించుకోవడం లేదే

ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…

4 hours ago