సుమారు మూడు నెలల తర్వాత హైదరాబాదు రోడ్లపై సిటీ బస్సులు పరుగెట్టనున్నాయి. ఇప్పటికే రెండున్నర నెలలుగా సిటీ బస్సులు ఆగిపోయాయి. కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఇక ప్రజారవాణాను ప్రారంభించడానికే తెలంగాణ సిద్ధమైంది.
జూన్ 8 నుంచి హైదరాబాద్ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. అయితే మునుపటి లాంటి ప్రయాణం ఉండదు. రద్దీగా తిరిగే బస్సులు కనపడవు. సీట్ల వరకే మనుషులు పరిమితం. ఒకప్పుడు కిక్కిరిసి తిరిగిన బస్సులు ఇప్పట్లో అలా కానరావు.
తాజాగా ఈరోజు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రం సడలింపులతో ఇప్పటికే ఆఫీసులన్నీ తెరుచుకున్నాయి. ప్రైవేటు వాహనాలు మినహా పబ్లిక్ ట్రాన్స్ పోర్టు లేకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా ప్రారంభించడానికి తెలంగాణ సర్కారు సిద్ధమైంది.
కరోనా ముందు నగరంలో రోజుకు దాదాపు 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు. ఇపుడు ప్రత్యేక నిబంధనలతో ఆ సంఖ్య గణనీయంగా పడిపోనుంది. బస్సుల్లేక షేర్ ఆటోలు పోలీసుల కళ్లు గప్పి తిప్పుతున్నారు. ఇద్దరిని ఎక్కించాల్సిన ఆటోలు నలుగురు ఐదుగురిని ఈ పరిస్థితుల్లో కూడా ఎక్కిస్తున్నారు.
This post was last modified on June 3, 2020 9:29 pm
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంటే..అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని…
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…