సుమారు మూడు నెలల తర్వాత హైదరాబాదు రోడ్లపై సిటీ బస్సులు పరుగెట్టనున్నాయి. ఇప్పటికే రెండున్నర నెలలుగా సిటీ బస్సులు ఆగిపోయాయి. కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఇక ప్రజారవాణాను ప్రారంభించడానికే తెలంగాణ సిద్ధమైంది.
జూన్ 8 నుంచి హైదరాబాద్ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. అయితే మునుపటి లాంటి ప్రయాణం ఉండదు. రద్దీగా తిరిగే బస్సులు కనపడవు. సీట్ల వరకే మనుషులు పరిమితం. ఒకప్పుడు కిక్కిరిసి తిరిగిన బస్సులు ఇప్పట్లో అలా కానరావు.
తాజాగా ఈరోజు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రం సడలింపులతో ఇప్పటికే ఆఫీసులన్నీ తెరుచుకున్నాయి. ప్రైవేటు వాహనాలు మినహా పబ్లిక్ ట్రాన్స్ పోర్టు లేకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా ప్రారంభించడానికి తెలంగాణ సర్కారు సిద్ధమైంది.
కరోనా ముందు నగరంలో రోజుకు దాదాపు 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు. ఇపుడు ప్రత్యేక నిబంధనలతో ఆ సంఖ్య గణనీయంగా పడిపోనుంది. బస్సుల్లేక షేర్ ఆటోలు పోలీసుల కళ్లు గప్పి తిప్పుతున్నారు. ఇద్దరిని ఎక్కించాల్సిన ఆటోలు నలుగురు ఐదుగురిని ఈ పరిస్థితుల్లో కూడా ఎక్కిస్తున్నారు.
టాలీవుడ్ హీరోయిన్లలో సమంత చాలా చాలా స్పెషల్ అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. విజయశాంతిలా, అనుష్కలా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయకపోయినా…
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మికి ఎట్టకేలకు పోస్టింగ్…
సరిగ్గా ఇంకో పదిహేను రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ…
ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యూపీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ సిరీస్.. తొలి…
ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్తో…
తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా…