Political News

తమ్ముళ్ళకే శీల పరీక్ష పెట్టారా ?

చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో నేతలకే శీలపరీక్ష పెట్టినట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు. చాలా కాలంగా పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు పెద్దగా క్రియాశీలకంగా లేరు. సీనియర్లంటే మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇలా చాలామంది ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా బాగా పెత్తనం చేసిన వారిలో చాలామంది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పెద్దగా కనబడటం లేదన్నది వాస్తవం.

ఎంతసేపు చంద్రబాబు లేకపోతే లోకేష్ కాకపోతే అచ్చెన్న, బుచ్చయ్య చింతకాయల లాంటి అతికొద్దిమంది నేతలు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. చెప్పుకోవటానికి వందలాది మంది సీనియర్లు ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకని పోరాటాలు చేయటం లేదో ఎవరికీ అర్థం కావటం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్ని పిలుపులిచ్చినా ఒక్కసారి కూడా సక్సెస్ కాలేదన్న విషయం చంద్రబాబును బాగా కలచివేస్తోందట.

సరే హఠాత్తుగా పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి వివాదం మొదలైంది. జగన్ను పార్టీ నేత నోటికొచ్చినట్లు తిట్టడంతో మండిపోయిన వైసీపీ నేతలు పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ దాడులకు ప్రతిగా చాలామంది తమ్ముళ్ళ నుంచి పెద్దగా స్పందన కనబడలేదు. దాంతో ఇక లాభం లేదనుకుని చంద్రబాబు రాష్ట్ర బంద్ కు పిలుపిచ్చారు. అసలు బంద్ కు పిలుపిచ్చింది ఎందుకంటే పార్టీలోని నేతల్లో ఎంతమంది యాక్టివ్ గా పాల్గొంటారో చూడటం కోసమేనట.

అయితే ఇక్కడ కూడా చంద్రబాబు అంచనా తప్పినట్లు అర్ధమైపోయింది. చాలామంది సీనియర్లు తమ నియోజకవర్గాల్లో కనబడలేదు. సీనియర్ల సంగతిని వదిలేస్తే మెజారిటి ఎంఎల్ఏలు కూడా అడ్రస్ కనబడకపోవటంతో చంద్రబాబు మండిపోతున్నారట. రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి అచ్చెన్నాయుడు, రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ బుచ్చయ్య చౌదరి లాంటి ఒకరిద్దరు తప్ప చాలామంది బంద్ సందర్భంగా కూడా రోడ్లపైకి రాలేదని అర్ధమైపోయిందట.

దాంతో నేతలపై మండిపోయిన చంద్రబాబు వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదని అర్ధం చేసుకున్నారు. అందుకనే హఠాత్తుగా 36 గంటల నిరసన దీక్షకు దిగారు. తాను దీక్ష చేస్తే అన్నా తమ్ముళ్ళు నియోజకవర్గాల్లో సంఘీభావంగా దీక్షలకు కూర్చుంటారేమో అని చంద్రబాబు అనుకున్నారట. మరి ఎంతమంది తమ్ముళ్ళు తమ నియోజకవర్గాల్లో దీక్షలకు కూర్చున్నారనే విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలోని బాధ్యులు ఆరాలు మొదలుపెట్టారు. మొత్తానికి చంద్రబాబు తమ్ముళ్ళకే శీలపరీక్ష పెట్టారట.

This post was last modified on October 22, 2021 4:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

2 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

3 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

4 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

4 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

5 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

7 hours ago