పట్టాభిరామ్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పేరు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధుల్లో ఒకరిగా కొన్నేళ్లుగా చాలా బలంగా వాయిస్ వినిపిస్తున్న వ్యక్తి ఇతను. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక టీడీపీ నుంచి పట్టాభిరామ్ స్థాయిలో ఇంత బలంగా పార్టీ గళాన్ని వినిపించిన నాయకుడు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఏ అంశం మీద అయినా.. బాగా స్టడీ చేసి, ఆధారాలు పక్కన పెట్టుకుని మాట్లాడాడని, ఆరోపణలు చేస్తారని ఆయనకు పేరుంది.
ఐతే ఘాటు విమర్శలు చేస్తారు కానీ బూతుల జోలికి ఎప్పుడూ పెద్దగా వెళ్లింది లేదు. కానీ తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ‘బోసిడీకే’ అనే పదం వాటడంతో ఆయన వార్తల్లో వ్యక్తిగా మారారు. పట్టాభిరామ్ వ్యాఖ్యలకు ప్రతిగా వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలు, పట్టాభిరామ్ ఇంటిపై దాడులు చేయడం.. ఆ తర్వాత పట్టాభిరామ్ మీద కేసులు పెట్టి పోలీసులు అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది. పట్టాభిరామ్ పుణ్యమా అని ‘బోసిడీకే’ అనే పదం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఆ పదానికి అర్థమేంటో తెలుసుకునే పనిలో నెటిజన్లు బిజీగా ఉన్నారు.
ఈ సంగతలా ఉంచితే ఈ పట్టాభిరామ్ నేపథ్యం ఏంటన్నది కూడా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. కొంచెం లేటు వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన పట్టాభిరామ్ అంతకుముందు హోటలియర్గా చాలా ఏళ్లు ఆ రంగంలో పని చేశారు. హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ తర్వాత ఒబెరాయ్, ఛాయిస్ ఇంటర్నేషనల్ లాంటి ప్రఖ్యాత హోటళ్లలో పని చేశారు. ఆ తర్వాత సొంతంగా రెస్టారెంట్లు మొదలుపెట్టి అందులో ఎదిగారు. చాలా ఏళ్ల పాటు పట్టాభిరామ్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. స్టార్ హోటళ్లకు రేటింగ్స్ ఇచ్చే క్లాసిఫికేషన్ కమిటీలోనూ చాలా ఏళ్లు పట్టాభిరామ్ పని చేశారు. హోటల్ టూరిజం అవార్డులిచ్చే కమిటీలోనూ జ్యూరీ సభ్యుడిగా ఉన్నారు.
2011లో 38.2 అడుగుల దోసె తయారీతో గిన్నిస్ రికార్డు సాధించిన టీంలో పట్టాభిరామ్ సభ్యుడిగా ఉండటం విశేషం. వ్యాపారంలో ఒక స్థాయి అందుకున్నాక రాజకీయాల్లోకి అడుగు పెట్టి త్వరగానే టీడీపీ అధికార ప్రతినిధి హోదానందుకున్నారు. స్పోక్స్ పర్సన్ అయ్యాక కూడా చాలా వేగంగానే పేరు సంపాదించారు.
This post was last modified on October 22, 2021 2:42 pm
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…