తన వివాదాస్పద కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్ గా ‘మా’ ఎలెక్షన్స్ పై ఘాటుగా స్పందించారు వర్మ. ‘మా’ ఒక సర్కస్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయ నాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలంటూ ఆయన కామెంట్స్ చేశారు.
గురువారం నాడు ఉదయం ట్విట్టర్ వేదికగా ఏపీ రాజకీయాలపై సెటైర్లు వేశారు వర్మ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతి త్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్ధం నేర్చుకోవాల్సిందే అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ‘ఇదంతా మీ డైరెక్షనే కదా..?’ అంటూ కొందరు.. ‘ఏపీ దంగల్ సినిమా తీయొచ్చు కదా ఆర్జీవీ గారు’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై కొందరు దారి చేయడంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడియత్నాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ బుధవారం నాడు బంద్ నిర్వహించింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మరోపక్క ఈ దాడులను నిరసిస్తూ.. గురువారం ఉదయం నుంచి 36 గంటలపాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టారు.
This post was last modified on October 21, 2021 3:25 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…