తన వివాదాస్పద కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్ గా ‘మా’ ఎలెక్షన్స్ పై ఘాటుగా స్పందించారు వర్మ. ‘మా’ ఒక సర్కస్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయ నాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలంటూ ఆయన కామెంట్స్ చేశారు.
గురువారం నాడు ఉదయం ట్విట్టర్ వేదికగా ఏపీ రాజకీయాలపై సెటైర్లు వేశారు వర్మ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతి త్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్ధం నేర్చుకోవాల్సిందే అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ‘ఇదంతా మీ డైరెక్షనే కదా..?’ అంటూ కొందరు.. ‘ఏపీ దంగల్ సినిమా తీయొచ్చు కదా ఆర్జీవీ గారు’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై కొందరు దారి చేయడంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడియత్నాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ బుధవారం నాడు బంద్ నిర్వహించింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మరోపక్క ఈ దాడులను నిరసిస్తూ.. గురువారం ఉదయం నుంచి 36 గంటలపాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టారు.
This post was last modified on October 21, 2021 3:25 pm
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…