తన వివాదాస్పద కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్ గా ‘మా’ ఎలెక్షన్స్ పై ఘాటుగా స్పందించారు వర్మ. ‘మా’ ఒక సర్కస్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయ నాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలంటూ ఆయన కామెంట్స్ చేశారు.
గురువారం నాడు ఉదయం ట్విట్టర్ వేదికగా ఏపీ రాజకీయాలపై సెటైర్లు వేశారు వర్మ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతి త్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్ధం నేర్చుకోవాల్సిందే అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ‘ఇదంతా మీ డైరెక్షనే కదా..?’ అంటూ కొందరు.. ‘ఏపీ దంగల్ సినిమా తీయొచ్చు కదా ఆర్జీవీ గారు’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై కొందరు దారి చేయడంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడియత్నాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ బుధవారం నాడు బంద్ నిర్వహించింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మరోపక్క ఈ దాడులను నిరసిస్తూ.. గురువారం ఉదయం నుంచి 36 గంటలపాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టారు.
This post was last modified on October 21, 2021 3:25 pm
బీఆర్ఎస్ నాయకుడు, మాటల తూటాలను తనదైన శైలిలో ఎటైనా తిప్పగల నేర్పరిగా పేరొందిన నేత.. అన్నింటికీ మించి `అందరివాడు`గా గుర్తింపు…
వెండితెరపై సినిమా చూసే అనుభూతి మారుతోంది. ఒకప్పుడు తెల్లని తెరలు కట్టి ప్రింట్లు ఎంత మసకగా ఉన్నా, లైన్లు కనిపించి…
కష్టం ఎదురైనప్పుడు వయసుతో సంబంధం లేకుండా పోరాడే మనస్తత్వం కొందరికే ఉంటుంది. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రానికి చెందిన 78 ఏళ్ల…
మహిళల మీద వివిధ రంగాల్లో జరుగుతున్న లైంగిక వేధింపులు, అఘాయిత్యాల మీద కొన్నేళ్ల ముందు మొదలైన ‘మీ టూ’ ఉద్యమాన్ని…
రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక.. వరుసగా రీమేక్ సినిమాలే చేస్తూ వచ్చాడు పవర్ స్టార్ పవన్…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరే సమయం ఆసన్నమైందా? ఇప్పటికే ఆయన…