తన వివాదాస్పద కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్ గా ‘మా’ ఎలెక్షన్స్ పై ఘాటుగా స్పందించారు వర్మ. ‘మా’ ఒక సర్కస్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయ నాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలంటూ ఆయన కామెంట్స్ చేశారు.
గురువారం నాడు ఉదయం ట్విట్టర్ వేదికగా ఏపీ రాజకీయాలపై సెటైర్లు వేశారు వర్మ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతి త్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్ధం నేర్చుకోవాల్సిందే అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ‘ఇదంతా మీ డైరెక్షనే కదా..?’ అంటూ కొందరు.. ‘ఏపీ దంగల్ సినిమా తీయొచ్చు కదా ఆర్జీవీ గారు’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై కొందరు దారి చేయడంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడియత్నాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ బుధవారం నాడు బంద్ నిర్వహించింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మరోపక్క ఈ దాడులను నిరసిస్తూ.. గురువారం ఉదయం నుంచి 36 గంటలపాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టారు.
This post was last modified on October 21, 2021 3:25 pm
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…