ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన వ్యక్తి.. తెలుగుదేశం నేత పట్టాభిరామ్. ఆంధ్రా ప్రాంతంలో గంజాయి స్మగ్లింగ్కు సంబంధించి ఆరోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం.. ప్రతిగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వైసీపీ వర్గీయులు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద.. అలాగే పట్టాభిరామ్ ఇంటి మీద తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడటం.. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగడం తెలిసిందే. ఈ క్రమంలోనే పట్టాభిరామ్పై వైసీపీ సర్కారు కేసులు పెట్టింది. ఆయన్ని బుధవారం అరెస్టు చేసింది.
ఐతే పోలీసుల అదుపులోకి వెళ్లడానికి ముందు పట్టాభిరామ్ వ్యూహాత్మకంగా రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశాక ఆయన గాయాల పాలై కనిపించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో తనపై పోలీసులు దాడి జరిపేందుకు ఆస్కారం ఉందన్న అనుమానంతో పట్టాభిరామ్ ఈ వీడియో రిలీజ్ చేశారు. బుధవారం నాటి ఈనాడు పత్రికను చూపిస్తూ.. ఇది ఈ రోజు తీసిన వీడియో అని చెప్పుకొచ్చారు. తన ఒంటిపై ఎక్కడా గాయాలు లేవని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని.. శరీర భాగాలన్నింటినీ చూపించారు.
అరచేతులు.. పాదాలు.. పొట్ట.. వీపు.. ఇలా అన్ని భాగాలనూ ఆయన వీడియోలో చూపించడం గమనార్హం. రఘురామ కృష్ణంరాజు పాదాలు కందిపోయి కనిపిస్తే అది ఎడీమా అనే చర్మ సమస్య వల్ల తలెత్తిందని, పోలీసులు కొట్టడం వల్ల కాదని వాదించడం తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలోనే పాదాలను చూపించి తనకు ఎడీమా లేదని పట్టాభిరామ్ పేర్కొన్నారు. ముందే ఇలాంటి వీడియో రిలీజ్ చేయడంతో పట్టాభిరామ్ ఒంటిపై పోలీసులు ఒక్క దెబ్బ వేసినా చిక్కుల్లో పడ్డట్లే. పోలీసులను, వైకాపా ప్రభుత్వాన్ని ఈ వీడియో ద్వారా ముందే భలే ఇరికించారంటూ పట్టాభిరామ్పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on October 21, 2021 10:42 am
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…