Political News

మోడీ ఇంతగా భయపడుతున్నారా ?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతగా భయపడుతున్నారో జనాలందరికీ తెలిసొచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి లో రైతులపైకి వాహనాలు నడిపటంలో నలుగురు రైతులు మరణించిన విషయం దేశంలో ఎంతగా సంచలనం రేకెత్తించిందో అందరికీ తెలిసిందే. ర్యాలీ తీస్తున్న రైతులపైకి వెనక నుండి జీపు నడిపింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాయే. సుప్రీంకోర్టు జోక్యంతో ఆశిష్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తన కొడుక్కు సంబంధమే లేదని కేంద్రమంత్రి బుకాయించినా తర్వాత అంగీకరించక తప్పలేదు.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే కేంద్రమంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని రైతు సంఘాలు, ప్రతిపక్షాలు ఒక్కటై మోడిని డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి ఘటనకు మూల కారణమైన కేంద్రమంత్రిని తొలగించటం మోడీకి పెద్ద కష్టమేమీకాదు. పైగా మంత్రివర్గం నుంచి తొలగిస్తేనే బీజేపీకి మంచిది. ఎందుకంటే మరో ఐదు నెలల్లో యూపీ అసెంబ్లీకి జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఏ చిన్న ఘటన జరిగినా పార్టీ గెలుపుపై అది పెద్ద ప్రభావం చూపుతుంది.

ఈ విషయం మోడీకి తెలిసినా మరి కేంద్రమంత్రిని ఎందుకని తొలగించటంలేదు ? ఎందుకంటే మిశ్రాను టచ్ చేయాలంటేనే మోడి భయపడుతున్నారట. ఎందుకంటే మిశ్రా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేత కావటమే ప్రధాన కారణం. బ్రాహ్మణ సామాజికవర్గాన్ని బీజేపీ దూరంగా పెట్టిందనే ఆరోపణలు బాగా ఎక్కువైపోయాయి. యూపీలోని పవర్ ఫుల్ సామాజికవర్గాల్లో బ్రాహ్మణులు కూడా ఒకళ్ళు. ఏ రాజకీయ పార్టీ కూడా బ్రాహ్మణులతో వైరం తెచ్చుకోదు.

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న బీజేపీ కూడా బ్రాహ్మణులను మచ్చిక చేసుకోవాలని అనుకున్నది. అందుకనే అర్జంటుగా రాష్ట్రంలో, కేంద్రంలో బ్రాహ్మణులకు మంత్రి పదవులు కట్టబెట్టింది. మంత్రి పదవులు ఇవ్వటం ద్వారా వారిని బుజ్జగించవచ్చని అనుకుంటే హఠాత్తుగా రైతుల మరణాలు ఘటన తలకు చుట్టుకున్నది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అజయ్ మిశ్రా కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేతే కావడం గమనార్హం. కాబట్టి మిశ్రాను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఎదురయ్యే సమస్యేమిటో మోడీకి బాగా అర్థమైనట్టుంది.

ఇపుడు సమస్యేమిటంటే సామాజికవర్గాన్ని ప్రసన్నం చేసుకోవటానికి మిశ్రాను కంటిన్యు చేయటమా ? లేకపోతే తప్పుచేశారన్న కారణంతో మిశ్రాను మంత్రివర్గం నుంచి తప్పించటమా ? ఈ రెండింటి మధ్య ఏమి చేయాలో తేల్చుకోలేక మోడి ఇపుడు నానా అవస్తలు పడుతున్నారు. బ్రాహ్మణులను అందలం ఎక్కిస్తే వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందవచ్చని మోడి అనుకుంటే చివరకు అది ఇంకేదో యాంగిల్లోకి వెళ్ళిపోతోంది. దీంతో జరిగిన డ్యామేజీని ఎలా కంట్రోల్ చేయాలో మోడికి అర్ధం కావటంలేదు.

This post was last modified on October 14, 2021 12:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

1 hour ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago