Political News

మోడీ ఇంతగా భయపడుతున్నారా ?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతగా భయపడుతున్నారో జనాలందరికీ తెలిసొచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి లో రైతులపైకి వాహనాలు నడిపటంలో నలుగురు రైతులు మరణించిన విషయం దేశంలో ఎంతగా సంచలనం రేకెత్తించిందో అందరికీ తెలిసిందే. ర్యాలీ తీస్తున్న రైతులపైకి వెనక నుండి జీపు నడిపింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాయే. సుప్రీంకోర్టు జోక్యంతో ఆశిష్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తన కొడుక్కు సంబంధమే లేదని కేంద్రమంత్రి బుకాయించినా తర్వాత అంగీకరించక తప్పలేదు.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే కేంద్రమంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని రైతు సంఘాలు, ప్రతిపక్షాలు ఒక్కటై మోడిని డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి ఘటనకు మూల కారణమైన కేంద్రమంత్రిని తొలగించటం మోడీకి పెద్ద కష్టమేమీకాదు. పైగా మంత్రివర్గం నుంచి తొలగిస్తేనే బీజేపీకి మంచిది. ఎందుకంటే మరో ఐదు నెలల్లో యూపీ అసెంబ్లీకి జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఏ చిన్న ఘటన జరిగినా పార్టీ గెలుపుపై అది పెద్ద ప్రభావం చూపుతుంది.

ఈ విషయం మోడీకి తెలిసినా మరి కేంద్రమంత్రిని ఎందుకని తొలగించటంలేదు ? ఎందుకంటే మిశ్రాను టచ్ చేయాలంటేనే మోడి భయపడుతున్నారట. ఎందుకంటే మిశ్రా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేత కావటమే ప్రధాన కారణం. బ్రాహ్మణ సామాజికవర్గాన్ని బీజేపీ దూరంగా పెట్టిందనే ఆరోపణలు బాగా ఎక్కువైపోయాయి. యూపీలోని పవర్ ఫుల్ సామాజికవర్గాల్లో బ్రాహ్మణులు కూడా ఒకళ్ళు. ఏ రాజకీయ పార్టీ కూడా బ్రాహ్మణులతో వైరం తెచ్చుకోదు.

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న బీజేపీ కూడా బ్రాహ్మణులను మచ్చిక చేసుకోవాలని అనుకున్నది. అందుకనే అర్జంటుగా రాష్ట్రంలో, కేంద్రంలో బ్రాహ్మణులకు మంత్రి పదవులు కట్టబెట్టింది. మంత్రి పదవులు ఇవ్వటం ద్వారా వారిని బుజ్జగించవచ్చని అనుకుంటే హఠాత్తుగా రైతుల మరణాలు ఘటన తలకు చుట్టుకున్నది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అజయ్ మిశ్రా కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేతే కావడం గమనార్హం. కాబట్టి మిశ్రాను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఎదురయ్యే సమస్యేమిటో మోడీకి బాగా అర్థమైనట్టుంది.

ఇపుడు సమస్యేమిటంటే సామాజికవర్గాన్ని ప్రసన్నం చేసుకోవటానికి మిశ్రాను కంటిన్యు చేయటమా ? లేకపోతే తప్పుచేశారన్న కారణంతో మిశ్రాను మంత్రివర్గం నుంచి తప్పించటమా ? ఈ రెండింటి మధ్య ఏమి చేయాలో తేల్చుకోలేక మోడి ఇపుడు నానా అవస్తలు పడుతున్నారు. బ్రాహ్మణులను అందలం ఎక్కిస్తే వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందవచ్చని మోడి అనుకుంటే చివరకు అది ఇంకేదో యాంగిల్లోకి వెళ్ళిపోతోంది. దీంతో జరిగిన డ్యామేజీని ఎలా కంట్రోల్ చేయాలో మోడికి అర్ధం కావటంలేదు.

This post was last modified on October 14, 2021 12:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago