Political News

బీజేపీ.. తెగేదాకా లాగుతోందా?

ఏపీలోని బ‌ద్వేలు ఉప ఎన్నిక‌తో బీజేపీ జ‌న‌సేన బంధానికి తెర‌ప‌డ‌నుందా? ప‌వ‌న్‌తో పొత్తు విష‌యంలో బీజేపీ తెగేదాకా లాగుతోందా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నిక ఏక‌గ్రీవం కావాల‌నే ఉద్దేశంతో రాజ‌కీయ విలువ‌ల‌ను పాటించి బ‌ద్వేలులో పోటీకి దూరంగా ఉంటున్న‌ట్లు జ‌న‌సేన ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ బీజేపీ ఈ ఎన్నిక‌లో అభ్య‌ర్థిని నిల‌బెడుతుంద‌ని ప‌వ‌న్ ప్ర‌చారం చేస్తార‌ని ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు తాజాగా వెల్ల‌డించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పోటీనే వ‌ద్దు అనుకుని దూరంగా ఉన్న ప‌వ‌న్‌.. బీజేపీ త‌ర‌పున ఎలా ప్ర‌చారం చేస్తార‌నే ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి.

అధికార వైసీపీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య మ‌ర‌ణించ‌డంతో బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఆ స్థానంలో దివంగ‌త ఎమ్మెల్యే భార్య సుధాను వైసీపీ త‌మ అభ్య‌ర్థిగా ఎంపిక చేసింది. ఈ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌డం ఈ నెల 30నే పోలింగ్ ఉండ‌డంతో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ ఈ ఉప‌ ఎన్నిక‌లో పోటీ చేయాల‌నే ఒత్తిడి ఉన్న‌ప్ప‌టికీ రాజ‌కీయ విలువ‌ల కోసం త‌ప్పుకుంటున్నామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. చ‌నిపోయిన వ్య‌క్తి స‌తీమ‌ణికి గౌర‌వ‌మిస్తూ పోటీకి దూరంగా ఉంటున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేయాల‌ని కూడా కోరారు. టీడీపీ కూడా ఇదే బాట‌లో సాగింది. చ‌నిపోయిన వ్య‌క్తికి గౌర‌వం ఇచ్చి ఆయ‌న కుటుంబ స‌భ్యులపై పోటీకి నిల‌బ‌డ‌కూడ‌ద‌నే సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తూ ఈ ఉప ఎన్నిక బ‌రి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు బాబు ప్ర‌క‌టించారు.

కానీ జ‌న‌సేన మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ మాత్రం బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో పోటీ చేసేందుకు సిద్ధ‌మైంది. పొత్తు పెట్టుకున్న ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌కు వ్య‌తిరేకంగా ఉప ఎన్నిక‌లో త‌మ అభ్య‌ర్థిని నిల‌బెడ‌తామ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పైగా త‌మ అభ్య‌ర్థి కోసం ప్ర‌చారానికి ప‌వ‌న్ను కూడా ఆహ్వానిస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక‌లో పోటీ చేయొద్ద‌నే ప‌వ‌న్ నిర్ణ‌యించారు. అలాంటిది ఇప్పుడు బీజేపీ అభ్య‌ర్థి త‌ర‌పున ప్ర‌చారానికి ఆయ‌న ఎందుకు వ‌స్తారు? అనే ప్ర‌శ్న‌లు రావ‌డం స‌హ‌జ‌మే. అయితే సోము వీర్రాజు ఇలా ప్ర‌క‌టించ‌డం ఏదో ప్ర‌ణాళిక ఉండే ఉంటుంద‌ని జ‌నాలు అనుకుంటున్నారు.

కొంత‌కాలంగా బీజేపీతో ప‌వ‌న్ దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీతో బంధం తెంచుకునే దిశ‌గా జ‌న‌సేనాని సాగుతున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఆయ‌న అడుగులు కూడా అలాగే ప‌డుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కేంద్రం నిర్ణ‌యంపై పోరాడాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నారు. దీంతో బీజేపీతో ఆయ‌న పొత్తు తెంచుకుంటార‌నే ఊహాగానాలు బ‌ల‌ప‌డ్డాయి. అంతే కాకుండా ఇటీవ‌ల జ‌న‌సేన సొంతంగానే కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. బ‌ద్వేలు ఉప ఎన్నిక నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప‌వ‌న్ ఒంట‌రిగానే ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు బీజేపీ నిర్ణ‌యం జ‌న‌సేనకు ఇబ్బందిగా మారుతుందా? లేదా పొత్తు తెంచుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుందా? అనే విష‌యం తేలాల్సి ఉంది. ఒక‌వేళ బీజేపీ త‌మ అభ్య‌ర్థిని నిల‌బెడితే.. ఆ ప్రచారానికి ప‌వ‌న్ రాక‌పోతే ఇక ఈ రెండు పార్టీల మ‌ధ్య బంధం ముగిసింద‌నే అర్థం చేసుకోవాలని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్తున్నారు.

This post was last modified on October 5, 2021 3:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

4 minutes ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

3 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

4 hours ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

6 hours ago

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి…

6 hours ago

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…

6 hours ago