ఇసుక ఆంధ్రప్రదేశ్ లో బంగారమైపోతోంది. ఆన్ లైన్లో ఎవరికి వారే బుక్ చేసుకునే సులువైన పద్ధతి అయితే ప్రభుత్వం తెచ్చింది. అదే టెక్నాలజీ వాడుకుని ఇసుకను పక్కదారి పట్టిస్తుండటంతో ప్రజలు ఇసుక దొరక్క తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది తెలుగుదేశం ఆరోపణ కాదు. స్వయంగా ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చెప్పిన పచ్చి నిజం ఇది.
ఈరోజు జరిగిన జెడ్పీ సమావేశంలో వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఇసుకపై సుదీర్ఘంగా మాట్లాడారు. అయ్యా మీరు అన్నీ చెప్పమని అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాం. రీచ్లో ఎత్తిన ఇసుక యార్డు దాకా రాకుండా మధ్యలోనే మాయమైపోతుంది.
అది ఎక్కడకు పోతుందో ఎవరికీ తెలియదు. గ్రామంలో మా కార్యకర్తలే మాకు ఇసుక ఇప్పించమని అడిగితే బొచ్చెడు ఇసుక ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నాం. బొచ్చెడు కాదు దోసెడు కూడా ఇవ్వలేం. యార్డుకు రాకుండా ఇసుక ఎక్కడకు పోతుంది? అని ఆయన ప్రశ్నించారు.
కలెక్టరుకు, మైనింగ్ వారికి అనేక మార్లు దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మనం చెప్పే దానికి చేసే దానికి చాలా తేడా ఉంది. మనం ఎన్ని స్కీములిచ్చినా ఈ ఇసుక విధానానికి వచ్చేటప్పటికి చాలా బాధపడుతున్నారు.
నాడు నేడు కార్యక్రమంలో కూడా తట్టెడు ఇసుక ఇచ్చిన సందర్భం లేదు. అమరావతికి లారీలో ఎత్తిన ఇసుక వినుకొండకు అని చెబితే… అది వినుకొండకు ఎందుకు రావడం లేదు? మధ్యలో ఏమవుతుంది? అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే ఇసుక బ్లాక్ మార్కెట్ గురించి చెప్పడంతో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది కేవలం ఆయన నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో రీచ్ లెవెల్లో కొందరు ఇసుక దారి మళ్లిస్తుంటే… టెక్నాలజీ వాడి స్థానికంగా అమాయకులకు అధిక ధరకు బ్లాక్ లో బుక్ చేసి ఇసుకను వాడుకుంటున్న పరిస్థితి. దీనిపై విధాన పరమైన నిర్ణయాలు తీసుకుని పరిస్థితి చక్కదిద్దాలని వైసీపీ ఎమ్మెల్యే జెడ్పీ సమావేశంలో కోరారు.
This post was last modified on June 2, 2020 12:42 pm
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…